26/08/2026
తేది:: 26/08/2026 దుబాయ్ లో గుండెపోటుతో మరణించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన గల్ఫ్ కార్మికుడు... మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలం, లక్ష్మనేశ్వరం గ్రామానికి చెందిన చెల్లుబోయిన వెంకన్న (49) అనే గల్ఫ్ కార్మికుడు జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకొని దుబాయి వచ్చి బ్రతుకీడుస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది...
ఇట్టి విషయాన్ని కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) గారు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ గారికి తెలియజేసి బాడీని ఎలాగైనా ఇండియా పంపాలని కోరటంతో స్పందించిన గుండెల్లి నరసింహ గారు కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) మరియు దుబాయి పోలీసు అదికారుల సహాయ సహాకారాలతో మరియు కంపెనీ యాజ మాన్యం సహకారంతో బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి మూడు రోజుల క్రితం ఇండియా పంపించడం జరిగింది.
ఇట్టి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అటు మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతూ వారి సమాచారాన్ని మాకు తెలియజేస్తూ పూర్తిగా సహకరించిన తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, పెదపట్నం లంక కు చెందిన సామజిక సేవకులు నల్లి వెంకట ప్రసాద్ గారికి మరియు కొండ రాజు గారికి, బందెల విశ్వ కుమార్ గారికి మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి(GWPC) తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 🙏🙏🙏.
అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ వరకు APNRT గారు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. వారికి మరియు ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ జగదీష్ గారికి మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి(GWPC) తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 🙏🙏.
SPECIAL THANKS TO:: COUNSULATE GENERAL OF INDIA (DUBAI (U.A.E) AND DUBAI POLICE 🙏🙏.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట,రాగళ్ల చంద్రమౌళి, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.
@