Manohar Swaero

Manohar Swaero ᴘʀᴏᴍᴏᴛɪᴏɴꜱ ᴀᴠᴀɪʟᴀʙʟᴇ ᴅᴍ

02/06/2026
02/06/2026

బండరావిరాల గ్రామంలో ఏర్పాటు చేయాలని చూస్తున్న డంపింగ్ యార్డ్ (ఎకో టౌన్) ప్రాజెక్టు పై జరిగిన పత్రికా సమావేశం లో సర్పంచ్ Kandikanti Vijay Kumar Swaero గారు మాట్లాడిన ముఖ్యమైన ముఖ్యాంశాలు ఇవే:
​🔹 బండరావిరాల గ్రామ పరిధిలోని 268 సర్వే నంబర్లలో 494 ఎకరాల స్థలంలో 'ఎకో టౌన్' పేరుతో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని చూస్తోంది.
🔹 ఈ ప్రాజెక్ట్ కోసం విడుదల చేసిన జీవో 20ని అధికారులు రహస్యంగా ఉంచారని, అది కేవలం డంపింగ్ యార్డ్‌కు పెట్టిన కొత్త పేరు మాత్రమేనని సర్పంచ్ ఆరోపించారు.
🔹 గతంలో జరిగిన మైనింగ్ వల్ల ఇక్కడ 100-150 మీటర్ల లోతు గుంతలు ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చే రోజుకు 10,000 టన్నుల చెత్త వేస్తే భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యమవుతాయి.
🔹 తీవ్రమైన దుర్వాసన, దోమలు, కెమికల్ డస్ట్ కారణంగా స్థానిక ప్రజలు చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల జబ్బుల బారిన పడతారు.
🔹 ఈ ప్రాంతం ORRకి 3 కి.మీ దూరం, భద్రాచలం హైవేకి ఆనుకొని ఉండటంతో ఇప్పుడిప్పుడే ఇక్కడ భూముల ధరలు పెరుగుతున్నాయి, కానీ ఈ ప్రాజెక్ట్ ప్రకటనతో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.
🔹 బండరావిరాల మరియు చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలు ఈ ప్రాజెక్ట్‌ వద్దు అంటూ గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
🔹 అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని, ఒకవేళ స్పందించకపోతే కోర్టును మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
🔹 కాలుష్యం పెంచే చెత్త యార్డ్ కాకుండా, ఇక్కడ యువతకు ఉపాధినిచ్చే ఐటీ కంపెనీలు లేదా సాఫ్ట్‌వేర్ టవర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
🔹 గత 20 ఏళ్లుగా భూములు కోల్పోయిన 268 మంది రైతులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ఎకరాకు ₹42 లక్షల పరిహారం వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు.
🔹 ప్రజల ఆరోగ్యం, గ్రామాల రక్షణ కోసం అవసరమైతే తన సర్పంచ్ పదవికి రాజీనామా చేసి, ప్రాణాలు అడ్డైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
fans

ఆకాశమే హద్దురా.. అవనిలో స్వేరోల జెండ గిర గిరా! ✊🔥​ఈరోజు మే 25 - "స్వేరోస్ విక్టరీ డే" (SWAEROES VICTORY DAY). తెలుగు గుర...
25/05/2026

ఆకాశమే హద్దురా.. అవనిలో స్వేరోల జెండ గిర గిరా! ✊🔥

​ఈరోజు మే 25 - "స్వేరోస్ విక్టరీ డే" (SWAEROES VICTORY DAY). తెలుగు గురుకులాల చరిత్రను, బహుజన బిడ్డల ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన చారిత్రాత్మక రోజు.

​మే 25, 2014 న సరిగ్గా ఇదే రోజున.. మన గురుకుల ముద్దుబిడ్డలు మాలవత్ పూర్ణ మరియు ఆనంద్ కుమార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించారు.
​ముఖ్యంగా కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే ఎవరెస్ట్ అధిరోహించి, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బాలికగా పూర్ణ చరిత్ర సృష్టించిన క్షణమిది. ఎవరెస్ట్ శిఖరంపై భారత జాతీయ జెండాతో పాటు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని, స్వేరోస్ జెండాను ఎగురవేసి.. "మాకు ఏదీ అసాధ్యం కాదు" అని నిరూపించారు.

​లక్షలాది మంది గురుకుల విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపి, ఈ అద్భుత విజయానికి వెన్నుముకగా నిలిచిన మన లీడర్, ఆర్గనైజర్ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి మరియు ఈ వీరులకు సెల్యూట్.🫡

​"నో రివర్స్ గేర్" అనే నినాదంతో ముందుకు సాగుతున్న స్వేరోస్ అందరికీ స్వేరోస్ విక్టరీ డే శుభాకాంక్షలు.🤝

​ RS Praveen Kumar Swaeroes

బండరావిరాల ప్రతి పాదిత ఎకో టౌన్ (డంపింగ్ యార్డ్‌)ను నిలిపి వేయాలని ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతి...
25/05/2026

బండరావిరాల ప్రతి పాదిత ఎకో టౌన్ (డంపింగ్ యార్డ్‌)ను నిలిపి వేయాలని ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం.

​బండరావిరాల గ్రామ సర్వే నెంబర్ 268 లో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎకో టౌన్ (డంపింగ్ యార్డ్) ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఈరోజు భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన నాయకులు కలిసి గ్రామ వినతి పత్రాన్ని అందజేశారు.

​ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న గ్రామాల పంచాయితీలు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మాన పత్రాలను ఎమ్మెల్యే గారికి సమర్పించారు. ప్రాజెక్ట్ పరిధిలోని 10-15 గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు.

ఎమ్మెల్యే గారు సానుకూల స్పందన: ఐటీ టౌన్ ఏర్పాటుకు కృషి,

వినతి పత్రం స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి నష్టం కలిగించే ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఆపడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, అవుట్ రింగ్ రౌడ్ కి అతి సమీపం లో ను ,భద్రాచలం హై వే కి అనుకున్న ఉన్న ఆ ఎకో టౌన్ ప్రతిపాదిత స్థలంలో "ఐటీ టౌన్" ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని కోరతానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బండరావిరాల గ్రామ సర్పంచ్ శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారు , చిన్నరవిరాల సర్పంచ్ శ్రీ పబ్బత్ బాలకిషన్ గౌడ్ గారు ,పిల్లాయిపల్లి సర్పంచ్ శ్రీమతి పెరుమాండ్ల మహాలక్ష్మి దానయ్య గారు, దేశ్ముఖి సర్పంచ్ దుర్గంజంగయ్య యాదవ్ గారు ,జూలూరు సర్పంచ్ కాసుల అంజయ్య గారు, ఉప సర్పంచ్ లు దూసరి శంకర్ గారు,భండారపు లక్ష్మణ్ గారు,అశోక్ యాదవ్, బండరావిరాల గ్రామ పెద్దలు శ్రీ కవాడి దయాకర్ రెడ్డి గారు, చిన్నరావిరాల బీజేపీ నాయకులు శ్రీ గోమారపు కొండల్ రెడ్డి గారు, యువ నాయకులు కొత్త శ్రీకాంత్ గౌడ్ వివిధ గ్రామాల పెద్దలు, రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Kandikanti Vijay Kumar Swaero

25/05/2026

నేడే హిమగిరి శిఖరం తల ఒంచింది
గురుకుల కుసుమాలు ఆకసాన పూసింది
నువు బలహీనుడివనే మాయోపాయాన్ని పటాపంచలు చేసింది
ఓ ధైర్యం సైన్యమై గెలిచింది
కొత్త చరిత సువర్ణాక్షరాలతో లిఖించింది
స్వేరోస్ విక్టరీ డే ✊

RS Praveen Kumar Swaeroes

25/05/2026

నేడే హిమగిరి శిఖరం తల ఒంచింది
గురుకుల కుసుమాలు ఆకసాన పూసింది
నువు బలహీనుడివనే మాయోపాయాన్ని పటాపంచలు చేసింది
ఓ ధైర్యం సైన్యమై గెలిచింది
కొత్త చరిత సువర్ణాక్షరాలతో లిఖించింది
స్వేరోస్ విక్టరీ డే ✊

RS Praveen Kumar Swaeroes

ఎకో టౌన్ (డంపింగ్ యార్డ్)‌ను నిలిపివేయాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వినతి.. వెంటనే కలెక్టర్‌తో మాట్లాడిన ఎం...
24/05/2026

ఎకో టౌన్ (డంపింగ్ యార్డ్)‌ను నిలిపివేయాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వినతి.. వెంటనే కలెక్టర్‌తో మాట్లాడిన ఎంపీ గారు

ప్రజా జీవనానికి విరుద్ధంగా నిర్మించే ఏకో టౌన్ డంపింగ్ యార్డ్‌ను నిలిపివేయాలని కోరుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు పలు గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు కలిసి ప్రాజెక్టు కి వ్యతిరేకంగా చేసిన గ్రామ పంచాయితీ లు చేసిన తీర్మాన కాపీలు తో పాటు వినతి పత్రం అందజేశారు.

​ఈ సందర్బంగా ఎంపీ గారు మాట్లాడతు రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామ రెవెన్యూ సర్వే నెం. 268లో చేపట్టబోయే ఏకో టౌన్ డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని నిలిపివేయాదానికి ప్రభుత్వ యంత్రంగా దృష్టి కి తీసుకువెళ్లాలని కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చారు.

పచ్చని పొలాల్లో ఈ డంపింగ్ యార్డ్ నిర్మించడం వల్ల సమీప గ్రామాలు కాలుష్యమయమై, ప్రజలు అనారోగ్యం బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు సుమారు 10 గ్రామాలకు పైగా ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎంపీ గారు తెలియజేసారు.

గ్రామస్థుల సమస్యను, ఆందోళనను శ్రద్ధగా విన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తక్షణమే స్పందించారు. ఆయన అక్కడికక్కడే జిల్లా కలెక్టర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. స్థానిక ప్రజలనుండి వ్యతిరేకత వస్తున్నందుకు ఈ ప్రాజెక్టు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు. ఎంపీ గారు సానుకూలంగా స్పందించి కలెక్టర్‌తో మాట్లాడడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బండరావిరాల గ్రామ సర్పంచ్ శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారు,పిగిలిపురం సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి గారు, బండరావిరాల ఉప సర్పంచ్ శ్రీ దూస శంకర్ ముదిరాజ్ గారు,
చిన్నరావిరాల బీజేపీ నాయకులు గోమారపు కొండల్ రెడ్డి గారు అలాగే బండరావిరాల వార్డ్ సభ్యులు శ్రీ కన్నె భరత్ యాదవ్ గారు,గ్రామ యువజన నాయకులు శ్రీ గుండ్ల సతీష్ యాదవ్ గారు, శ్రీ బుద్ధుల రాజు, శ్రీ ఒంగూరి రమేష్ గారు, శ్రీ కొత్త శ్రీకాంత్ గారు పాల్గొన్నారు.

Kandikanti Vijay Kumar Swaero

Address

Baireddipalle
517415

Alerts

Be the first to know and let us send you an email when Manohar Swaero posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manohar Swaero:

Share