25/05/2026
బండరావిరాల ప్రతి పాదిత ఎకో టౌన్ (డంపింగ్ యార్డ్)ను నిలిపి వేయాలని ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం.
బండరావిరాల గ్రామ సర్వే నెంబర్ 268 లో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎకో టౌన్ (డంపింగ్ యార్డ్) ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఈరోజు భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన నాయకులు కలిసి గ్రామ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న గ్రామాల పంచాయితీలు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మాన పత్రాలను ఎమ్మెల్యే గారికి సమర్పించారు. ప్రాజెక్ట్ పరిధిలోని 10-15 గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు.
ఎమ్మెల్యే గారు సానుకూల స్పందన: ఐటీ టౌన్ ఏర్పాటుకు కృషి,
వినతి పత్రం స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి నష్టం కలిగించే ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఆపడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, అవుట్ రింగ్ రౌడ్ కి అతి సమీపం లో ను ,భద్రాచలం హై వే కి అనుకున్న ఉన్న ఆ ఎకో టౌన్ ప్రతిపాదిత స్థలంలో "ఐటీ టౌన్" ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని కోరతానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బండరావిరాల గ్రామ సర్పంచ్ శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారు , చిన్నరవిరాల సర్పంచ్ శ్రీ పబ్బత్ బాలకిషన్ గౌడ్ గారు ,పిల్లాయిపల్లి సర్పంచ్ శ్రీమతి పెరుమాండ్ల మహాలక్ష్మి దానయ్య గారు, దేశ్ముఖి సర్పంచ్ దుర్గంజంగయ్య యాదవ్ గారు ,జూలూరు సర్పంచ్ కాసుల అంజయ్య గారు, ఉప సర్పంచ్ లు దూసరి శంకర్ గారు,భండారపు లక్ష్మణ్ గారు,అశోక్ యాదవ్, బండరావిరాల గ్రామ పెద్దలు శ్రీ కవాడి దయాకర్ రెడ్డి గారు, చిన్నరావిరాల బీజేపీ నాయకులు శ్రీ గోమారపు కొండల్ రెడ్డి గారు, యువ నాయకులు కొత్త శ్రీకాంత్ గౌడ్ వివిధ గ్రామాల పెద్దలు, రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Kandikanti Vijay Kumar Swaero