30/08/2026
Justice for Sirisha 🙏 details⬇️
హైదరాబాద్లో అనుమానాస్పదంగా ములకలపల్లి యువతి మృతి🚨
భద్రాద్రి జిల్లా, ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీష.. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని తాను ఉంటున్న రూమ్కు వెళ్లి నిద్రించినట్లు సమాచారం. శిరీషతో పాటు రూమ్లో ఉంటున్న మరో నర్సు విధులకు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని రూమ్కు తిరిగి వచ్చి చూడగా.. శిరీష గాయాలతో రక్తసిక్తమై మృతిచెంది ఉండటాన్ని గుర్తించినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. దీంతో శిరీష మృతికి గల కారణాలు, ఆమెకు గాయాలు ఎలా అయ్యాయనే విషయాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. శిరీష తండ్రి కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా.. తల్లి రామలక్ష్మి కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న శిరీష అనూహ్యంగా మృతిచెందడంతో చౌటిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
_
MANA BHADRADRI