ITDP Jangaon

ITDP Jangaon జనగామ నియోజకవర్గం

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి, బడుగుల చేతికి పాలనాధికారం ఇవ్వడానికి, నిరుపేదకు ఆనందంగా జీవించే హక్కును కలిగించడాని...
29/03/2026

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి, బడుగుల చేతికి పాలనాధికారం ఇవ్వడానికి, నిరుపేదకు ఆనందంగా జీవించే హక్కును కలిగించడానికి 1982, మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. 44 ఏళ్లుగా తెలుగు ప్రజల జీవన స్రవంతిలో భాగమైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు!


శ్రీ నారా లోకేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఉప్పల్ నియోజక వర్గం డా ఏ ఎస్ రావు నగర్ డివిజన్ ప...
23/01/2026

శ్రీ నారా లోకేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఉప్పల్ నియోజక వర్గం డా ఏ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో ఉన్న సౌత్ కమలా నగర్ లో కేక్ కట్ చేసి 200 వందల పేదలకు బోజన ప్యాకెట్లు పంచటం జరిగింది

ఎన్‌టిఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జ...
23/01/2026

ఎన్‌టిఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకను తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని, కేక్‌ను కట్ చేసి నారా లోకేష్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ తరపున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్ లు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎన్‌టిఆర్, చంద్రబాబు గార్లు కుటుంబ సభ్యులుగా భావిస్తారు. దీనికి అనుగుణంగా రాజకీయ పార్టీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ‘కార్యకర్తల సంక్షేమనిధి’ని నారా లోకేష్ గారు ప్రారంభించారని అన్నారు. అలాగే సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ చేసిన ఘనత లోకేష్ గారికే దక్కుతుందని అన్నారు. వీటిని ఇతర రాజకీయ పార్టీలు అనుసరిస్తుండటం గమనార్హమని అన్నారు. యువగళం పాదయాత్ర ఒక చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. యుగళం పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలో నారా లోకేష్ గారిని అజేయుడుగా నిలిచారని అన్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఆ పాదయాత్ర మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. అధికారమంటే అంకిత భావంతో కూడిన బాధ్యత అని నారా లోకేష్ గారు నిరూపించుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం తరపున నారా లోకేష్ గారికి పుట్టిన రోజులు శుభాకాంక్షలను తెలియజేశారు.
జూబ్లీహిల్స్‌లోని టిటిడి దేవాలయంలో, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు గారు పూజలు చేయించి అర్చకులకు పట్టువస్త్రాలను సమర్పించారు.
ఎన్‌టిఆర్ భవన్‌లో ఉపధ్యాయ అనుబంధ సంఘం రాష్ట్ర నాయకులు ముంజావెంకట్రాజం గౌడ్, ఎంవిపి రమేష్ బాబు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అవసరమైన కిట్‌ను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్‌టిఆర్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్, సీవోవో అడుసుపల్లి గోపి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సామ భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసిని, తాటికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అజ్మీరా రాజునాయక్, నెల్లూరు దుర్గా ప్రసాద్, పోలంపల్లి అశోక్, కట్టా వెంకటేష్‌గౌడ్, సంధ్యపోగు రాజశేఖర్, వేజెండ్ల కిశోర్‌బాబు, గూడెపు రాఘవులు, జనగామ నర్సింగ్‌రావు, యం. స్వాతి తదితరులు పాల్గొన్నారు.

మధిర లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు 🎉  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, డైనమిక్ యంగ్ లీడర్, ఎపి రాష్ట్ర ...
23/01/2026

మధిర లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు 🎉
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, డైనమిక్ యంగ్ లీడర్, ఎపి రాష్ట్ర ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈరోజు స్థానిక టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

యువగళం రథ సారథి, నవతరం నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగు దేశం పార్టీ - వంచ శ్రీనివాసరెడ్...
23/01/2026

యువగళం రథ సారథి, నవతరం నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగు దేశం పార్టీ - వంచ శ్రీనివాసరెడ్డి
ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో యువగళం రథసారథి భావితరాల భవిష్యత్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు ఐటి మరియు విద్యాశాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము  సందర్బంగా ఈ రోజు మెదక్ ప...
23/01/2026

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్బంగా ఈ రోజు మెదక్ పార్లమెంట్ టిడిపి కన్వీనర్ ఇల్లేందుల రమేష్ గారి ఆధ్వర్యంలో వసంత పంచమి పురస్కరించుకొని మెదక్ పార్లమెంట్ లోని సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం లోని చిన్న కోడూరు మండలం అనంతసాగర్, శనిగరం మధ్యలో ఉన్న సరస్వతి దేవి ఆలయంలో నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు కుటుంబం తో ఆయురారోగ్యాలతో ఉండాలి అని పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈరోజు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, యువనేత, నారా లోకేష్ అన్న గారి జన్...
23/01/2026

ఈరోజు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, యువనేత, నారా లోకేష్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, TNSF(తెలుగుదేశం పార్టీ) ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 101 కొబ్బరికాయలు సమర్పించి, నారా లోకేష్ గారి పేరు మీద వేద పండితులచే ప్రత్యేక అర్చనలు నిర్వహించారూ. అదే విధంగా మహాకుంభమేళా వాతావరణాన్ని తలపించేలా మినీ మేడారం అగ్రం పాడు జాతరలో మొక్కులు చెల్లించడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినర...
23/01/2026

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, యువనాయకులు
శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు 23-01-2026 యాద‌గిరిగుట్ట ల‌క్ష్మిన‌ర్సింహ స్వామి దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించిన పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు గారు ఇతర టిడిపి రాష్ట్ర నాయకులు

22/01/2026
తెలుగు ప్రజల ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారక రామా రావు గారి 30వ వర్ధంతి సందర్భంగా 1997 లో మాజీ మంత్రి, అఖిల భారత NTR అభిమాన ...
19/01/2026

తెలుగు ప్రజల ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారక రామా రావు గారి 30వ వర్ధంతి సందర్భంగా 1997 లో మాజీ మంత్రి, అఖిల భారత NTR అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే. శ్రీపతి రాజేశ్వర్ రావు గారు మొదలుపెట్టిన NTR అమర్ జ్యోతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. శ్రీ నందమూరి రామకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా , నందమూరి సుహాసిని గారు, కాట్రగడ్డ ప్రసూన గారు మరియు ఇతర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

ఆదివారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్థంతి ...
19/01/2026

ఆదివారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్థంతి కార్యక్రమాన్ని ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా లెజెండరీ బ్లెడ్‌ డొనేషన్‌ అండ్‌ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక`విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్‌ నందమూరి తారక రామారావు గారికి ఆత్మీయ నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శ్రీమతి నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ... తెలుగుప్రజలకు అన్నగా పిలుచుకునే ఎన్‌టిఆర్‌ గారి 30వ వర్థంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి వర్థంతికి ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎన్‌టిఆర్‌ గారు సేవా భావంతో రాజకీయాలలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ను స్థాపించడం జరిగింది. ఈ ట్రస్ట్‌కు మేనేజింగ్‌ ట్రస్టీగా ప్రజలకు సేవలు అందించే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే అదృష్టం నాకు కలిగింది. ప్రజల అవసరాలను ట్రస్ట్‌ ద్వారా మేము సేవలు అందించడానికి ముందు ఉంటాం. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సేవలు అందిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం దాతలే. కడియాల రాజేందర్‌, మన్‌మీత్‌ సింగ్‌ వంటి ఎంతో మంది దాతల సహకారంతో మేము ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ను ముందుకు తీసుకెళ్లగలుతున్నాం. ఈ దాతలు ఎన్‌టిఆర్‌ గారిపై ప్రేమతో ముందుకు వస్తున్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌కు విరాళాలు ఇస్తే ప్రజలకు అందుతుందనే నమ్మకంతో చేస్తున్నారని అన్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ తరపున బ్లడ్‌ బ్యాంక్‌ కేంద్రాలను హైదరాబాద్‌, తిరుపతి, వైజాగ్‌, రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ తరపున నాణ్యమైన రక్తాన్ని అవసరమైన ప్రజలకు అందిస్తున్నాం. ముందుగా తలసేమియా పిల్లలకు అవసరమైన బ్లెడ్‌ను ఇచ్చిన తరువాతనే ఇతరులకు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఎన్‌టిఆర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా 5 లక్షల బ్లడ్‌ యూనిట్స్‌ను సేకరించడం జరిగింది. ఈ యూనిట్ల ద్వారా 9 లక్షల 18 వేల మందికి ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ తరపున రక్తాన్ని అందించగలిగాం. వ్యక్తిగత జీవితంలో స్థిరపడిన తరువాత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత తిరిగి సమాజానికి, దేశానికి ఇవ్వాలనే భావనతో ముందుకు రావాలని ప్రజలందరినీ ఈ సందర్భంగా కొరుతున్నాము. ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మాత్రమే కాకుండా చాలా మంది తమతమ ట్రస్ట్‌ల ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ‘‘స్త్రీ శక్తి హస్తకళ’’ ద్వారా మహిళలకు వివిధ చేతి వృత్తులలో కుప్పం నైపుణ్య కేంద్రంలో శిక్షణను ఇచ్చి వారికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. హైదరాబాద్‌లో స్త్రీ శక్తి హస్తకళ స్టోర్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సీఈవో కె. రాజేంద్రకుమార్‌, సీవోవో అడుసుపల్లి గోపి, ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యులు గారపాటి శ్రీనివాస్‌, జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ నాయకులు అజ్మీరా రాజునాయక్‌, శ్రీపతి సతీష్‌ కుమార్‌, పోలంపల్లి అశోక్‌, పొగాకు జయరామ్‌చందర్‌, తెలుగుదేశం ప్రకాష్‌రెడ్డి, పార్లమెంట్‌ పార్టీ కన్వీనర్లు కుందారపు కృష్ణాచారి, సంజయ్‌, అమర్‌నాథ్‌, సంధ్యపోగు రాజశేఖర్‌, వేజెండ్ల కిశోర్‌బాబు, ముంజ వెంకట్రాజంగౌడ్‌, సైదేశ్వర్‌ రావు, జనగాం నర్సింగ్‌రావు, సాంబశివ రావు, యాదీలాల్‌, గూడెపు రాఘవులు, జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరంలో బసవతారకం ఇండో`అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి మరియు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు..., డాక్టర్‌ కడియాల రాజేందర్‌, డాక్టర్‌ కడియాల విద్య ఆధ్వర్యంలో ఏపీ సూపర్‌స్పెషాలిటీ డెంటల్‌ ఆస్పత్రి తరపున మెగా ఫ్రీ డెంటల్‌ క్యాంపును..., మన్‌మీత్‌సింగ్‌ (సోనూ) ఇన్‌ అసోసియేషన్‌ విత్‌ యోదా డయోగ్నస్టిక్స్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, కన్సల్టేషన్‌, మెడిసిన్‌ అండ్‌ ఈసీజీ..., డాక్టర్‌ అవినాష్‌ ఆధ్వర్యంలో ఓమెగా పిఆర్‌కె, మల్టీస్పెషాలిటీ అండ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి తరపున ఈఎన్‌టి (చెవి, ముక్కు, గొంతు లకు సంబంధించి)..., మంత్రి ఐజయ్య ఆధ్వర్యంలో ‘హియర్‌జాప్‌’ వారి తరపున హియరింగ్‌కు సంబంధించి..., కెఎస్‌ఆర్‌ ఐకేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిటీ ఐ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలకు సంబంధించి క్యాంపులను ఏర్పాటు చేశారు. లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపులో రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరినీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు పలకరించారు. అలాగే వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ట్రస్ట్‌ తరపున అవసరమైన వారికి మందులను ఉచితంగా అందించడం జరిగింది.
గత రెండున్నర సంవత్సరాల నుండి మోతీలాల్‌ అధ్యక్షతన మోక్షజ్ఞ. ఓ ఆర్ జి. కర్నూల్ పేరుతో ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ తరపున 30 క్యాంపులను పెట్టి తలసేమియా బాధిత పిల్లలకొరకు 700 మంది రక్తదానం చేయడం జరిగింది.
జగిత్యాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పల్లెర్ల సురేందర్‌ ఈ సందర్భంగా రూ.25 వేల విరాళాన్ని ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌కు అందించడం జరిగింది.
మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఎన్‌టిఆర్‌ అభిమానులు గన్నేరు తిప్పన నాయకత్వంలో ఎన్‌టిఆర్‌ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన అమరజ్యోతి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌లో జరిగిన ఎన్‌టిఆర్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని శ్రీమతి నారా భువనేశ్వరి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌కు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తమ సమస్యలను శ్రీమతి నారా భువనేశ్వరి గారికి విన్నవించుకోవడం జరిగింది.
-కె. రాజేంద్ర కుమార్‌ ఐపిఎస్‌(రిటైర్డ్‌)
సీఈవో, ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌.

అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తాలికోట హరికృష్ణ గారి ఆధ్వర్యంలో నాగారం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఘ...
19/01/2026

అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తాలికోట హరికృష్ణ గారి ఆధ్వర్యంలో నాగారం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
నాగారం లోని ఎన్టీఆర్ విగ్రహానికి ముందుగా నివాళులు అర్పించిన అనంతరం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తాలికోట హరికృష్ణ గారు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని, పేదల సంక్షేమం, మహిళల గౌరవం, ప్రజల ఆత్మగౌరవమే ఆయన పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు.
ఈ ర్యాలీ లో ముఖ్యంగా ఉమ శంకర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సాయి నాగార్జున గారు, మెల్లం శ్రీనివాస్ గారు, బజార్ హేమంత్ గౌడ్ గారు, బ్రహ్మం చౌదరి గారు, బాలకృష్ణ గౌడ్ గారు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Address

Bhongir
506167

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Jangaon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share