03/08/2026
•పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణం అందించనుండగా, రెండేళ్లలో తిరిగి చెల్లించే అవకాశం కల్పించారు. సుమారు 50 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ఈ పథకం ద్వారా రాష్ట్రానికి రూ.250 కోట్ల కేంద్ర రుణ సాయం అందనుంది
•ఆంధ్రప్రదేశ్–ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి కొత్త ఊపు లభించింది. క్లీన్ ఎనర్జీ, అధునాతన తయారీ, విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో సహకారం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థలతో నాలుగు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది
•ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. లక్షలాది మంది హాజరైన ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విమానాశ్రయంపై విస్తృత చర్చ జరగడం విశేషం
•జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని రూపుదిద్దిన పింగళి వెంకయ్య దేశభక్తిని ప్రజల్లో పెంపొందించి, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు
•రాష్ట్రానికి అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అదనపు నిధులు రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/QoDpO