11/09/2024
*వరద బాధితులకు గోపాలపురం నియోజకవర్గ దాతల భరోసా*
*సీఎం పిలుపుతో సాయం అందించిన సామాన్య ప్రజలు, నాయకులు,ప్రముఖులు*
*ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో సీయం సహాయ నిధికి ₹ 58,58,999/- రూపాయల విరాళం*
*విజయవాడ కలెక్టరేట్ లో సీఎంను కలిసి విరాళం అందించిన గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, నాయకులు*
ఊహించని విధంగా ముంచెత్తిన వరదతో ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు గోపాలపురం నియోజకవర్గ ప్రజలు, ప్రముఖులు, నాయకులు కదం తొక్కారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ఆధ్వర్యంలో తమ వంతు సహకారంగా నియోజకవర్గ నాయకులతో కలిసి 58 లక్షల 58వేల 999 రూపాయలు సేకరించారు. విరాళాలు అందించిన దాతలు అంతా కలిసి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి సీయం సహాయ నిధికి రూ58,58,999/- అందజేశారు.
ఊహించని వరదతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు, వరద ప్రభావిత ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు, స్వార్థంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న నిర్విరామ కృషిని చూసి తమ వంతు సహాయంగా గోపాలపురం నియోజకవర్గం దాతలు భారీ విరాళాన్ని అందించారు. విపత్కర పరిస్థితుల్లో మానవత్వం చాటుకుని విరాళాలు అందించిన దాతలను, నాయకులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.