23/03/2026
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారి తనయుడు సూర్య – సాక్షిల వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్ శివారులో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, జేడీ శీలం, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, టీ సుబ్బిరామి రెడ్డి, గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీలు మల్లు రవి, సీఎం రమేష్, మాజీ ఎంపీలు కెవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, వి. హనుమంతరావు, విజయసాయిరెడ్డి, కేశినేని నాని, బీజేపీ జాతీయ నాయకుడు కే లక్ష్మణ్, వైఎస్సార్సీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, అంబటి రాంబాబు, బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
అలాగే ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డీజీపీ శివధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.
ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.