18/01/2024
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిచే రేపు ది.19-01-2024 స్వరాజ్ మైధానంలో డా”బి.ఆర్.అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహావిష్కరణ సందర్భముగా ఈ రోజు ది.18-10-2024 ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఉత్తర్వులు ననుసరించి “సామాజిక సమత సంకల్పం” నిర్వహించుట జరిగినది. ఈ కార్యక్రమములో భాగంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయము నుండి ఏలూరు రోడ్డు బస్టాండ్ వద్ద గల Dr. B. R. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించబడినది. తదుపరి అంబేద్కర్ గారి విగ్రహాని పూల మాలలు వేసి ఆయనకు అంజలి ఘటించారు.
ఈ కార్యక్రములో పురపాలక సంఘ చైర్ పెర్సన్ శ్రీమతి బత్తిన లక్ష్మి గారు, YSRCP నాయకులు బత్తిన చిన్నా గారు, కౌన్సిలర్ సభ్యులు మరియు కొఆప్షన్ సభ్యులు, ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజా గారు, DSP శ్రీ మతి విద్యా గారు, పురపాలక కమిషనర్ గారు డా. P భవాని ప్రసాద్ గారు, MRO స్లివ జోజీ గారు, MPDO K. విజయ్ ప్రసాద్ గారు, మెప్మా సిబ్బంది మరియు అన్ని డిపార్ట్మెంట్స్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, విద్యార్ధులు అందరూ పాల్గొన్నారు.