19/03/2024
🙏 *ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము* 🙏
కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా., ఆంధ్రప్రదేశ్
email: [email protected], [email protected]
Ph .No.08494-221066, 221366
*Web Site www.aptemples.ap.gov.in*
*_శ్రీవారి బ్రహ్మొత్సవములు-2024_*
నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వేలశియున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయము, చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రం.
*శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు 19.03.2024 నుండి 02.04.2024 వరకు 15 రోజుల పాటు అత్యంత వైభోపేతముగ జరుగును*
*మొదటి రోజు అంకురార్పణము విశిష్టిత 19.03.2024*
శ్రీవారి త్రయోదసాహ్నిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
భక్తులందరూ పాల్గొని తరించండి...
అంకురార్పణ అనగా ప్రకృతి ఆరాధన, ప్రకృతి అనగా భూదేవి అనగా స్త్రీ, అంటే మన పెద్దలు ఏ పని ప్రారంభించినా ప్రకృతిని ఆరాధించడం ,స్త్రీలను పూజించడం,స్త్రీలను కార్యక్రమంలో పూజ్యనీయులను చేయడం, అనేటువంటి విషయాలను అనాదిగా ఋషులు కూడా వారి ఆగమశాస్త్ర లో క్రమబద్దం చేయడం,అంటే మన సనాతన హిందూధర్మ శాస్త్ర వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతోంది...
శ్రీవారి ఆలయానికి సంభందించిన ఏ కార్యక్రమంలో అయిన, సకల దేవత ప్రీతి కొరకు, ముందుగా శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించలని ఆగమశాస్త్ర వచనం,అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించారు అందులో,ముక్యంగా చంద్రుడు బీజవృద్ది కారకుడు,అధిపతి కావున సాయంకాల చంద్రోదయం తరువాత చల్లని సమయంలో ఈ కార్యక్రమ జరుగుతుంది
అంకురార్పణ లో ప్రధాన ఘట్టాలు,
1,ప్రదానాచార్య స్వాగతం,
2,మెదిని పూజ(భూదేవి ఆరాధన)
3.అంకురార్పణ దేవత ఆరాధన,బీజావాపనం.
4,అజస్రదీపారాదన
రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ మర్యాదలు తో ప్రదానచార్యుల అర్చకుల ఆలయ స్వాగతం
యాగసాలలో పుణ్యాహవాచనం నిర్వహించి
, శ్రీవారి ఆలయంలో స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుణ్ని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష సమర్పణ చేసి అనంతరం మండపంలో వైయించెపు చేసి ఆలయ మర్యాదలతో సర్వ మంగళ కర సంభారములతో ఈశాన్య దిక్కున వెళ్లి, ఉత్సవాలకు ప్రారంభ సూచికగా విష్వక్సేనుల సమక్షంలో ప్రదానాచార్యులు వారు భూమాత అనుగ్రహం కోసం, భూమాతకు విశేషమైన ఆరాధన విధానం అయిన మెదిని పూజ నిర్వహించి,భక్తి శ్రద్ధలతో మంత్రయుక్తంగా (మృణ్మయం)మట్టిని సేకరించి,ఆలయ మర్యాదలతో యాగశాల చేరుకుంటారు
అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరించి బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను, అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది అంకురార్పణ దేవతలను ఆవాహన చేసి విశేష ఆరాధన నిర్వహిస్తారు.
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే కదిరి మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ.
అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం (బీజవాపనం) జరుగుతుంది
విత్తనాలు నాటేందుకు పాలికాది ,రాఖా దేవతలను ఆరాధన చేసి, మట్టి కుండలను వినియోగిస్తారు. ముందుగా భూమాతను ప్రార్దించి తెచ్చిన మట్టితో పాలికలు నింపి చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో మంత్రపూర్వకన నవధాన్యాలు ఉంచి మట్టిని కప్పి నీరు, క్షీరం సమర్పిస్తారు,చివరగా సూర్య తేజస్సు కోసం అర్కపత్రాలను(జిల్లేడు ఆకులు)కప్పి సంరక్షిస్తారు . ఈ పాలికలకు కేంద్ర స్థానంలో ప్రధాన కుంభాన్ని ప్రతిష్టించి బ్రహ్మాది దేవతలను ఆవాహన చేసి ,ప్రధాన స్తానం శ్రీ నరసింహస్వామి వారిని బ్రహ్మ స్థానంలో ఆహ్వానించి,పట్టు వస్త్రాన్ని అలంకరించి,ప్రదానాచార్యులు బ్రహ్మగా ఉండి విశేష ఆరాదనలు ప్రతీ రోజు త్రికాలములు నిర్వహిస్తారు.
బీజాలు ఏవైపున దట్టముగా,ఏపుగా వృద్ధి చెందుతాయో ఆ దిక్కున పాడిపంటలు సుభిక్షంగా ఉంటాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం
అజశ్ర దీపారాధన :
యాగశాలలో అంకురార్పణ సందర్భంగా అఖండదీపారాధన చేస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే 15 రోజులు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. అనంతరం ఈ దీపాన్ని గర్భాలయంలో గల దీపంలో ఐక్యం చేస్తారు
ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగి,చివరిగా మహా మంగలహారతి,తీర్థ ప్రసాద వినియోగంతో మొదటి రోజు కార్యక్రమం పరిసమాప్తం
సర్వేజనా సుఖినోభవంతూ