27/08/2026
నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రీకుల క్షేమ సమాచారాలపై విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. నలుగురు సురక్షితంగా ఉన్నారని... కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మీలు ఆచూకీ లభించలేదని ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. వారి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, సురక్షితంగా ఉన్న వారిని వెంటనే మన రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు.