29/08/2026
📝 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ 📝
మందమరి కళ్యాణి కని పాఠశాల విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీలత ఇంచార్జ్ రజిత గారి సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ...
“విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షలు ఎంతో ముఖ్యమైనవి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, మా వంతు సహాయంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మందమరి కళ్యాణి కని పాఠశాల విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.
విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాము.”
అలాగే, ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహాయం చేయాలని ఆసక్తి ఉన్న దాతలు, సేవాభిమానులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించాలని కోరారు. వారి సహకారాన్ని అవసరమైన వారికి చేరేలా సద్వినియోగం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నందిపాటి రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్ పటేల్, ఎండి జావిద్ పాషా, అన్వేష్, సూర్య, ఇమామ్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🌿 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ
🤝 సేవే మా లక్ష్యం – సమాజమే మా కుటుంబం