02/07/2026
ఏ.బీ.ఎం హై స్కూల్ ...
మార్కాపురం పట్టణంలోని అత్యంత పురాతనమైన స్కూల్...
1874లో స్థాపితం...
కొన్ని లక్షలమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన స్కూల్..
లక్షలాదిమంది దళిత క్రిస్టియన్ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన స్కూల్.. వారి పాలిటి దేవాలయం..
అటువంటి స్కూల్ పై కొందరు భూకబ్జాదారులు కన్నేసి దానిని వశం చేసుకొని క్రిస్టియన్ మరియు దళితుల మనోభావాలపై దెబ్బ కొట్టారు...
అప్పుడే మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు రంగంలో దిగారు..
అందరి సహకారంతో అందరినీ కలుపుకొని ఆ స్కూలుకు 1.7.2026 తేదీన కబ్జాదారుల చెర నుండి విముక్తి కల్పించి మార్కాపురం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దళిత క్రిస్టియన్ సోదర సోదరీమణులకు మహదానందం కలిగించారు.
ఇంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ దళిత క్రిస్టియన్ సోదరుల ఓట్ల కోసమే రాజకీయం చేశారు కానీ,
ఒకే ఒక్కడు ఇప్పటి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు నిజమైన దళిత క్రిస్టియన్ సోదర సోదరీమణుల శ్రేయోభిలాషిగా వారి ఆకాంక్షలను గౌరవిస్తూ తిరిగి ఏ బి ఎం స్కూలు తెరిపించి నిజంగా దళితుల కోసం పనిచేసేది తాను ఒక్కడినే అని నిరూపించారని దళిత, క్రిస్టియన్ సోదరుల సోదరీమణులు చర్చించుకుంటున్నారు.
Kandula Narayana Reddy