CPIM Nalgonda

CPIM Nalgonda Official page of Communist Party of India (Marxist), Nalgonda District Committee

పొలిట్‌బ్యూరో ప్రకటనభారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో సెప్టెంబర్ 4–5, 2026 తేదీల్లో సమావేశమై, కింది అ...
06/09/2026

పొలిట్‌బ్యూరో ప్రకటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో సెప్టెంబర్ 4–5, 2026 తేదీల్లో సమావేశమై, కింది అంశాలపై ప్రకటన విడుదల చేసింది:

వాతావరణ మార్పులు – ప్రకృతి విపత్తులు
రామ జన్మభూమి ట్రస్ట్ అవినీతి
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
నిరసనలను అప్రతిష్టపాలు చేయడం
ఆర్థిక పరిస్థితి
కార్పొరేట్లకు ప్రయోజనాలు – క్రోనీ క్యాపిటలిజం
జనగణన – కుల గణాంకాలు
కుల వివక్షకు సంబంధించిన ఘటనలు
పెరుగుతున్న ఘర్షణలు – ఉద్రిక్తతలు
దిద్దుబాటు ప్రచారం

పెంపుడు జంతువులు యజమాని పట్ల  ఎల్లప్పుడూ విశ్వాసంగా ఉంటూ కాపాడుతుంటాయి.
06/09/2026

పెంపుడు జంతువులు యజమాని పట్ల ఎల్లప్పుడూ విశ్వాసంగా ఉంటూ కాపాడుతుంటాయి.

ఉమర్ ఖలీద్స్వతంత్ర భరద్వాజ్వీరిద్దరిలో ఎవరు ఉగ్రవాదులో మీరే చెప్పండి..!
06/09/2026

ఉమర్ ఖలీద్

స్వతంత్ర భరద్వాజ్

వీరిద్దరిలో ఎవరు ఉగ్రవాదులో మీరే చెప్పండి..!

7.8% జీడిపీ వృద్ధి సాధించిన భారత్ లో.. స్పేస్ టెక్నాలజీతో వేసిన రోడ్...
06/09/2026

7.8% జీడిపీ వృద్ధి సాధించిన భారత్ లో.. స్పేస్ టెక్నాలజీతో వేసిన రోడ్...

 #ప్రారంభమైన_జాతీయ_సెమినార్ -  Struggle Convention For Adivasi Rights .. న్యూ ఢిల్లీ. మాట్లాడుతున్న విశ్రాంత న్యాయమూర్తి...
06/09/2026

#ప్రారంభమైన_జాతీయ_సెమినార్ -
Struggle Convention For Adivasi Rights .. న్యూ ఢిల్లీ. మాట్లాడుతున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్,త్రిపుర మాజీ మంత్రి జితిన్ చౌదరీ,కన్వీనర్ మాజీ రాజ్యసభ సభ్యులు పశ్చిమబెంగాల్ పులిన్ బస్కి,, మాజీ రాజ్యసభ సభ్యురాలు ఆదివాసి జాతీయ నాయకురాలు బృందా కారత్, భద్రాచలం మాజీ పార్లమెంట్ సభ్యు లు డాక్టర్ మిడియం బాబురావు గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
06-09-2026

రైతు నాయకులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభఅఖిల భారత కిసాన్ సభ (AIKS) ఉపాధ్యక్షులు, రైతుసంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
06/09/2026

రైతు నాయకులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ

అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఉపాధ్యక్షులు, రైతుసంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి
వ్యవసాయరంగం, సాగునీటి రంగంలో విశేషమైన కృషి చేసిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ విజయవాడ బాలోత్సవ భవన్ లో జరిగింది.
సంతాప సభలో మాజీ మంత్రి, రైతుసంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వర రావు, రైతుసంఘం పూర్వ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, ఏ. పి. రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, రైతుసంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై. కేశవరావు, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. క్రిష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. లోకనాధం తదితర రైతు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.
రైతులు, కౌలు రైతులు, ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయ వాదులు మల్లారెడ్డి గారి సంతాప సభకు హాజరై నివాళి అర్పించారు.

సిపిఎం ప్రెస్‌ నోట్‌:    6-09-2026,నల్లగొండ.*బైరు మల్లయ్య స్పూర్తితో ప్రజాఉద్యమాలను తీవ్రతరం చేయాలి*--- *6వ వర్ధంతి సభల...
06/09/2026

సిపిఎం ప్రెస్‌ నోట్‌:
6-09-2026,
నల్లగొండ.
*బైరు మల్లయ్య స్పూర్తితో ప్రజాఉద్యమాలను తీవ్రతరం చేయాలి*

--- *6వ వర్ధంతి సభలో సిపిఎం తుమ్మల వీరారెడ్డి*

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, సిపిఎం సీనియర్‌ నాయకులు బైరు మల్లయ్య గారి స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని *సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి* ఆదివారం నాడు 6వ వర్దంతి నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే ఆయనకు మనం ఆర్పించే ఘనమైన నివాళి ఆన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేయడంలో పోటిపడుతున్నాయని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. బైరు మల్లయ్య గారు చివరి వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి నిలకడగా పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. గీత కార్మికుల పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియాలను వెంటనే మంజూరు చేయాలన్నారు. గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీలను అమలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వారు గీత కార్మికుల సమస్యలపై కాకుండా వ్యవసాయ కార్మికులు, రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు చేసి ఫలితాలను సాధించారని చెప్పారు. నాటి నకిరేకల్ శాసనసభ్యులు నర్రా రాఘవరెడ్డి సహకారంతో పేదలకు భూముల పంచడంలో, ఇండ్ల స్థలాలను పంపిణీలో కీలకపాత్ర పోషించారు. గీసే వాడికే చెట్టు కావాలని అనేక పోరాటాలు సాధించి టిఎఫ్టిలను సొసైటీలుగా మార్చిన ఘనత వీరికే దక్కిందని అన్నారు. ఆబ్కారీ శాఖ వేధింపులకు వ్యతిరేకంగా గీత కార్మికులు సమీకరించి అనేక ఉద్యమాలు చేశారని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు *గంజి మురళీధర్, పి. నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, కొండ వెంకన్న, నలుపరాజు సైదులు, మన్నెం బిక్షం, బొల్లు రవిందర్‌, కండె యాదగిరి* తదితరులు పాల్గొన్నారు.

*కొండ వెంకన్న*
గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు
9391662262

06/09/2026
✊ కాళ్లు మర్దన చేయలేదని దళితుడిని కొట్టి చంపడమా?కుల అహంకారానికి, దళితులపై దాడులకు ఇక చరమగీతం పాడాలి!— కులవివక్ష వ్యతిరేక...
06/09/2026

✊ కాళ్లు మర్దన చేయలేదని దళితుడిని కొట్టి చంపడమా?

కుల అహంకారానికి, దళితులపై దాడులకు ఇక చరమగీతం పాడాలి!
— కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS)

బీజేపీ పాలిత రాష్టం ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో జరిగిన రాజ్‌కుమార్ అలియాస్ ఛన్నూ హత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేస్తోంది. మద్యం పార్టీలో కాళ్లు మర్దన చేయాలని చెప్పగా నిరాకరించాడనే కారణంతో దళిత యువకుడిపై బెల్ట్, ఇనుప రాడ్‌తో దాడి చేసి చంపారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైoధి.

అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని కూడా పోలీసులు పేర్కొన్నారు.

ఇది కేవలం ఒక వ్యక్తి హత్యగా చూడలేం.
ఒక మనిషిని మరో మనిషి కాళ్లు మర్దన చేయాల్సిందేనని ఆదేశించే మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది?

అతను నిరాకరిస్తే కొట్టి చంపేంతటి అహంకారం ఎలా పెరిగింది?
ఇలాంటి ఘటనలు మన సమాజంలో ఇంకా బలంగా ఉన్న కుల ఆధిపత్యం, సామాజిక అసమానత, దళితుల పట్ల ఉన్న వివక్షను మన కళ్లముందు నిలబెడుతున్నాయి.

🔥 మనిషి కాళ్లకు బానిస కాదు!
భారత రాజ్యాంగం ప్రతి మనిషికి సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ కల్పించింది. కులం పేరుతో ఎవరినీ తక్కువగా చూడటానికి, అవమానించటానికి, బలవంతపెట్టటానికి ఎవరికీ హక్కు లేదు.

కానీ రాజ్‌కుమార్ ఘటనలో కనిపిస్తున్నది ఏమిటి?
“నువ్వు దళితుడివి… మా కాళ్లు మర్దన చేయాలి” అనే ఆధిపత్య భావజాలం!

ఆ ఆదేశాన్ని తిరస్కరించినందుకు హింస!

ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన గొడవగా కొట్టి పారేయలేం. మద్యం ఒక సందర్భం కావచ్చు. కానీ ఒక మనిషి తనకు నచ్చని పని చేయడానికి నిరాకరించినప్పుడు అతని ప్రాణం తీసే స్థాయికి వెళ్లే ఆధిపత్య మనస్తత్వాన్ని ప్రశ్నించాల్సిందే.

✊ దళితుడి ఆత్మగౌరవాన్ని చంపలేరు!
రాజ్‌కుమార్ ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కానీ ఆయన మరణం వృథా కాకూడదు.

ఒక దళితుడు తనకు నచ్చని పనిని “నాకు ఇష్టం లేదు” అని చెప్పే హక్కు కలిగి ఉండాలి.
ఒక దళిత మహిళ తనపై జరుగుతున్న అవమానాన్ని “ఇది తప్పు” అని ప్రశ్నించే హక్కు కలిగి ఉండాలి.
ఒక దళిత విద్యార్థి కుల వివక్షను ఎదిరించే హక్కు కలిగి ఉండాలి.

ఒక దళిత కార్మికుడు తన శ్రమకు గౌరవం, సమాన వేతనం అడిగే హక్కు కలిగి ఉండాలి.
ఆ హక్కులన్నింటి పేరే రాజ్యాంగం ఇచ్చిన మానవ గౌరవం.

⚖️ నిందితులకు కఠిన శిక్ష పడాలి
ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. హత్యతో పాటు SC/ST (Prevention of Atrocities) Act కింద కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అరెస్టులతోనే న్యాయం పూర్తికాదు.

త్వరితగతిన దర్యాప్తు జరగాలి.
సాక్ష్యాలను కాపాడాలి.
బాధిత కుటుంబానికి న్యాయం, భద్రత కల్పించాలి.
చట్టంలోని అన్ని వర్తించే నిబంధనలను సమర్థంగా అమలు చేయాలి.
నేరం కోర్టులో రుజువైతే నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

అదే సమయంలో, న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు నిందితులను దోషులుగా ప్రకటించకుండా, కేసులో నిందితులుగా మాత్రమే పేర్కొనాలి.

🚩 యూపీలోనే కాదు… దేశమంతా కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి
ఇది ఉత్తరప్రదేశ్‌లో జరిగింది కాబట్టి అక్కడి ప్రభుత్వాన్నే ప్రశ్నించి ఆగిపోతే సరిపోదు.

కులం పేరుతో అవమానం ఎక్కడ జరిగినా—
దళితులపై దాడి ఎక్కడ జరిగినా—
అంటరానితనం ఎక్కడ కొనసాగినా—
దళితుల ఆత్మగౌరవాన్ని అణచివేయాలని చూసినా—
KVPS ప్రశ్నిస్తుంది!
కుల వివక్ష ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సమర్థించలేం.
కుల ఆధిపత్యం కుడివైపు నుంచైనా, ఎడమవైపు నుంచైనా—
మతం పేరుతో వచ్చినా, సంప్రదాయం పేరుతో వచ్చినా—
అది కులవివక్షే! దాన్ని వ్యతిరేకించాల్సిందే!

✊ KVPS డిమాండ్లు
రాజ్‌కుమార్ హత్య కేసును వేగంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలి.
SC/ST చట్టంలోని వర్తించే నిబంధనలను సమర్థంగా అమలు చేయాలి.
బాధిత కుటుంబానికి తగిన పరిహారం, భద్రత, పునరావాసం కల్పించాలి.
కుల ఆధారిత అవమానాలు, దాడులు, అంటరానితనంపై కఠిన చర్యలు తీసుకోవాలి.
SC/ST చట్టంపై పోలీసులు, అధికారులకు మరింత సమర్థవంతమైన శిక్షణ ఇవ్వాలి.
దళితులపై జరిగే నేరాల్లో బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి.
కుల ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ప్రజల్లో విస్తృత సామాజిక చైతన్యం కల్పించాలి.
🔥 మా పోరాటం ఒక్క రాజ్‌కుమార్ కోసం మాత్రమే కాదు!
ప్రతి దళితుడి ఆత్మగౌరవం కోసం!
ప్రతి మనిషి సమానత్వం కోసం!
కులవివక్ష లేని సమాజం కోసం!
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం!
మనిషి కాళ్లను మర్దన చేయించుకునే హక్కు ఎవరికీ లేదు.
మనిషిని కాళ్ల కింద తొక్కే హక్కు ఎవరికీ లేదు.
కుల అహంకారాన్ని అంతం చేద్దాం!

కులవివక్షను ప్రతిఘటిద్దాం!
దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుదాం!

రాజ్యాంగాన్ని రక్షిద్దాం!

— కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS)
జనగామ జిల్లా ఉపాధ్యక్షులు మంద. మహేందర్

Address

#3-6-504, D. K. Bhavan, Near Subhash Statue, Nalgonda/
Nalgonda
508001

Telephone

+919490098311

Website

Alerts

Be the first to know and let us send you an email when CPIM Nalgonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPIM Nalgonda:

Shortcuts

Share