25/07/2026
🚩మన్యం జిల్లాకు కుంకీ ఏనుగులను పంపిన డిప్యూటీ సీఎం శ్రీ "పవన్ కళ్యాణ్" గారికి హృదయపూర్వక ధన్యవాదాలు – చందక అనీల్ పార్వతీపురం జనసేన పార్టీ.
🚩ఏనుగుల సమస్యకు పరిష్కారంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు!
పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలను, రైతన్నలను గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న గజరాజుల సమస్యపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి, ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు 'కుంకీ ఏనుగులను' పంపించడం పట్ల పార్వతీపురం జనసేన పార్టీ నాయకులు "చందక అనీల్" నియోజకవర్గ నాయకులు, జనసైనికులు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో మన్యం ప్రాంతంలో ఏనుగుల వల్ల పంట నష్టపోయిన రైతుల బాధలను, ప్రాణభయంతో కాలం గడుపుతున్న ప్రజల కష్టాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చూశారు. అధికారంలోకి రాగానే అటవీ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి, ఈ సమస్య తీవ్రతను గుర్తించి, అడవి ఏనుగులను అదుపు చేసేందుకు అనుభవజ్ఞులైన కుంకీ ఏనుగుల బలగాలను మన్యం జిల్లాకు తరలించే చర్యలు చేపట్టారని, మాట ఇస్తే వెనకడుగు వేయని నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారని ఈ చర్యతో మరొకసారి నిరూపితమైంది అని. పాలన అంటే కేవలం హమీలు ఇవ్వడం కాదు... ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడమేనని ఆయన చేసి చూపించారు అని అన్నారు. ఈ సందర్బంగా మన్యం జిల్లా ప్రజల తరఫున, రైతాంగం తరఫున మరియు జనసేన పార్టీ శ్రేణుల తరఫున డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. కుంకీ ఏనుగుల రాకతో త్వరలోనే మన ప్రాంతంలో ఏనుగుల ఉపద్రవం తగ్గి, రైతన్నలకు ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం అని అన్నారు.