19/04/2026
🚩ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ "పవన్ కళ్యాణ్" గారు త్వరగా కోలుకోవాలని పార్వతీపురం గ్రామదేవత "ఇప్పలపొలమ్మ" అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు.
పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ "పవన్ కళ్యాణ్" గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ, ఈరోజు పార్వతీపురం పట్టణ గ్రామదేవత అయిన శ్రీ "ఇప్పలపొలమ్మ" అమ్మవారి ఆలయంలో పార్వతీపురం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు "చందక అనీల్" గారు ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, వారు త్వరగా కోలుకొని తిరిగి పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు,కార్యకర్తలు మాట్లాడుతూ "కోట్లాది మంది అభిమానులు, ప్రజల ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆ ఇప్పలపొలమ్మ అమ్మవారిని వేడుకున్నాము. ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయనకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు మరింత శక్తితో ప్రజా సేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాము" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఇజ్జాడ కాళి, భమిడిపాటి చైతన్య, కొల్లేపర తేజ, మెరువ శివ, శంబాన కూర్మ, రెడ్డి నాగరాజు, గునాన నరేష్, నెయ్యిగాపుల సంతోష్, రెడ్డి నాగరాజు, మహేశ్వర అజయ్, గేదెల వంశీ, లాడే వరుణ్, గుడ్ల వెంకటేష్, గొర్జన అవినాష్, మజ్జి గణేష్, చిత్తూరు సురేష్, మణి తదితరులు. కురుపాం జనసేనపార్టీ ముఖ్య నాయకులు సంజు తదితరులు పాల్గొన్నారు.