Telugu Desam Party: Nellore Rural

Telugu Desam Party: Nellore Rural Official Page of TDP Nellore Rural

ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా ప...
09/12/2025

ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా ప్రఖ్యాత సంస్థల సీఈవోలు, అధిపతులు, ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. కాన్వా (Canva) ఛీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మాట్, ఏఎండీ ( Amd) సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగం) వంశీ బొప్పన, ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌లతో వేరువేరుగా సమావేశం అయ్యారు. ఏపీలో అవకాశాలు, అనుకూలతలు వివరించి, పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.




అంతర్జాతీయస్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ Celesta VC మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌తో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మం...
09/12/2025

అంతర్జాతీయస్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ Celesta VC మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌తో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
అనంతరం creative land asia ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ చిక్ రసెల్‌తో సమావేశమయ్యారు. ఏపీతో గతంలో కుదుర్చుకున్న ఎంవోయూ మేరకు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని లోకేష్ కోరారు.
ops ramp సీఈవో వర్మ కూనపునేనితో భేటీ సందర్భంగా ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మద్దతు ఇవ్వాలని లోకేష్ కోరారు.




జగన్ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం ఏపీ వృద్ధి రేటు 5.97%కి పడిపోయింది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొనఊపిరితో వెంటిల...
09/12/2025

జగన్ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం ఏపీ వృద్ధి రేటు 5.97%కి పడిపోయింది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొనఊపిరితో వెంటిలేటర్ పైకి చేరిందన్నమాట. అటు వంటి ఏపీ కూటమి హయాంలో మొదటి సంవత్సరం 12.02% వృద్ధి రేటును నమోదు చేసింది. అంటే చంద్రబాబు గారి పాలనలో రాష్ట్రం వేగవంతమైన వృద్ధిని సాధిస్తోందన్నమాట.

09/12/2025

2025-26 తొలి అర్ధ సంవత్సరం ఫలితాలు :

* గత ఏడాది ఇదే కాలానికి జీఎస్డీపీ 9.89 ఉండగా, అది ఇప్పుడు 10.91 శాతానికి పెరిగింది.
* ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ రూ.7,58,270 కోట్లు కాగా... జీవీఏ విలువ మొదటి రూ.7,03,767 కోట్లుగా ఉంది.
* వ్యవసాయ రంగంలో 10.26 శాతం వృద్ధి, పరిశ్రమల రంగంలో 12.05 శాతం వృద్ధి, సేవల రంగంలో 11 శాతం వృద్ధి నమోదైంది.

• రెండో త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధి 11.2 8 శాతానికి పెరగడం మెరుగైన పాలనా విధానాలకు నిదర్శనం.. సీఎం చంద్రబ...
09/12/2025

• రెండో త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధి 11.2 8 శాతానికి పెరగడం మెరుగైన పాలనా విధానాలకు నిదర్శనం.. సీఎం చంద్రబాబు

• జనవరి 19 నుంచి 23 వరకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. సీఎం వెంట వెళ్ళనున్న మంత్రులు నారా లోకేష్, భరత్, ముఖ్య కార్యదర్శులు

• ప్రయాణికులకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి.. ఇండిగో వ్యవహారంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రధాని మోడీ అభినందనలు

• గజదొంగ.. మరో దొంగను వెనకేసుకొస్తున్నారు.. జగన్ రెడ్డి పాలనలో తిరుమల పరకామణి చోరీపై స్పందించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

• సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లను స్ఫూర్తిగా తీసుకొని నిత్యం ప్రజలతో మమేకం కావాలి.. తెలుగుదేశం పార్టీ మండల స్థాయి శిక్షణా తరగతుల్లో శాసనమండలి విప్ వేపాడ చిరంజీవి రావు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/0OPlB


అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమానికి పునరంకితమవుతోంది తెలుగుదేశం.
03/12/2025

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమానికి పునరంకితమవుతోంది తెలుగుదేశం.

03/12/2025

తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్లలో "రైతన్నా... మీకోసం" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, డ్రిప్ సిస్టం ఎగ్జిబిషన్‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ మరింత మెరుగ్గా రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీలో చేయాల్సిన మార్పులపై సూచనలు ఇచ్చారు.




03/12/2025

జనం సొమ్ముతో జగన్ గాలి తిరుగుళ్ల ఖర్చు రూ.222 కోట్లు.
ప్రజాధనం లూటీ చేయడంలో జగన్ తన దోపిడీ చరిత్రను తానే తిరగ రాశాడు.


03/12/2025

రాయలసీమకు జీవనాడి హంద్రీనీవా. జగన్ ఐదేళ్ల పాటు అప్పటివరకు జరుగుతున్న పనులను విస్తరణ పేరుతో రద్దు చేశాడు. కనీసం విద్యుత్ మోటర్లకు చెల్లించాల్సిన బిల్లులను కూడా జగన్ చెల్లించలేదు.

కూటమి ప్రభుత్వం రాగానే, రూ.3870 కోట్లుతో హంద్రీనీవా పనులు ఏడాదిలో చేసి చూపించి 738 కి.మీ. రాయలసీమలో కృష్ణా జలాలను పారించి రాయలసీమను రతనాల సీమగా చేస్తున్నాం.


Jagan’s luxury special-flight spree burned Rs 222 crore, pushing Andhra Pradesh deeper into debt.
03/12/2025

Jagan’s luxury special-flight spree burned Rs 222 crore, pushing Andhra Pradesh deeper into debt.


మొంథా తుపాను  24 జిల్లాల్లోని 443 మండలాల పరిధిలో 3,109 గ్రామాలను ప్రభావితం చేసిందని... 3.27 లక్షల మంది రైతులు  సుమారు 4....
03/12/2025

మొంథా తుపాను 24 జిల్లాల్లోని 443 మండలాల పరిధిలో 3,109 గ్రామాలను ప్రభావితం చేసిందని... 3.27 లక్షల మంది రైతులు సుమారు 4.36లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను నష్టపోయారని కేంద్ర వ్యవసాయ మంత్రికి మంత్రి లోకేష్ గారు వివరించారు. రైతును ఆదుకోమని కోరారు.


Address

Nellore Rural
Nellore
524004

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nellore Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nellore Rural:

Share