Dr.Nukasani Balaji

Dr.Nukasani Balaji Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Nukasani Balaji, Ongole.

Dr. Nukasani Balaji
National Vice President, Telugu Desam Party
Chairman, Andhra Pradesh Tourism Development Corporation
Economist | Former ZP Chairman | Dedicated to Public Service

ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ గారి స్క్రోలింగ్ పాయింట్స్:• 30 ఏళ్ల కలను సాకారం చేసి వెలిగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్...
03/09/2026

ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ గారి స్క్రోలింగ్ పాయింట్స్:

• 30 ఏళ్ల కలను సాకారం చేసి వెలిగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లా రైతులకు నీళ్లు ఇచ్చారు.

• అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇచ్చిన మాట ప్రకారం వెలిగొండకు నీళ్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు.

• 2008 ఆగస్టులో టన్నెల్ 1కి వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే 2009 సెప్టెంబర్ లో మరణించారు. మరి ఎలా 20 కి.మీ. టన్నెల్ పనులు వైఎస్ఆర్ చేశారో జగన్ సమాధానం చెప్పాలి.

• నాలుగు జిల్లాల ప్రజల కలను చంద్రబాబు సాకారం చేస్తే... మా క్రెడిట్ అంటూ జగన్ దొంగ డ్రామాలు మొదలుపెట్టారు.

• 2024 ఎన్నికలకు ముందు టన్నెల్స్ పూర్తి చేయకుండానే జాతికి అంకితం అంటూ జగన్ ప్రజలను మోసం చేశారు.

• ప్రజలను మోసం చేసినందుకే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుండు సున్నా ఇచ్చారు.

• 11 ఏళ్లు పాలించిన వైఎస్ఆర్, జగన్‌లు మట్టి పనులు చేసుకొని సొమ్ములు చేసుకున్నారు.

• నిర్వాసితులకు చంద్రబాబు రూ.1,050 కోట్లు ఇస్తే... జగన్ రూపాయి కూడా ఇవ్వలేదు.

• సభ ప్రారంభం కాక ముందే ఖాళీ కూర్చిల ఫోటోలు తీసి సాక్షి తప్పుడు ప్రచారం చేస్తోంది.

• టన్నెల్ పనులు పూర్తి చేయకుండా, నిర్వాసితులకు రూపాయి ఇవ్వకుండా, లైనింగ్ పనులు చేయకుండా, నీళ్లు పారించకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారు.

• జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసుకొని మట్టి పనులతో దోచుకున్నారు.

• పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్, కెనాల్ లైనింగ్, నిర్వాసితులకు పునరావాసం, కొండలు, బండలు తొలగించకుండా, అక్విడెక్టులు నిర్మించకుండా ఎలా 79 శాతం పనులు వైఎస్ఆర్ చేశారు జగన్ రెడ్డి.?

• పోలవరం టెండర్లు రద్దు చేసి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది వైఎస్ఆర్, జగన్‌లు.

• పోలవరం పనులను 89 శాతం పూర్తి చేసిన ఘతన చంద్రబాబుది.

• పోలవరం ఎడమ కాలువకు రూ.2,800 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసింది చంద్రబాబు.

• పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీటి ఇచ్చిన జల ప్రధాత చంద్రబాబు.

• చంద్రబాబు పరిపాలనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారు.

• బీసీలకు జగన్ ద్రోహం చేస్తే... చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్ కల్పించి న్యాయం చేస్తున్నారు.

ఒంగోలు 8వ డివిజన్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్...
01/09/2026

ఒంగోలు 8వ డివిజన్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఒంగోలు నగరంలోని 8వ డివిజన్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారితో కలిసి పాల్గొని వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లను స్వయంగా అందజేయడం జరిగింది.

పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ భరోసా చూసి లబ్ధిదారుల కళ్ళలో కనిపిస్తున్న ఆనందం ఎంతో సంతృప్తినిస్తుంది.


🌊 వెలిగొండకు చారిత్రాత్మక రోజు!30 ఏళ్ల పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల స్వప్నం… నేడు సాకారం దిశగా మరో చారిత్రాత్మక అడుగు!ముఖ...
31/08/2026

🌊 వెలిగొండకు చారిత్రాత్మక రోజు!

30 ఏళ్ల పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల స్వప్నం… నేడు సాకారం దిశగా మరో చారిత్రాత్మక అడుగు!

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం పశ్చిమ ప్రకాశం ప్రజల చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టం.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల ఆశలు, ప్రజల ఆకాంక్షలకు నేడు కొత్త భరోసా లభించింది.

చంద్రబాబు గారి సంకల్పం – కూటమి ప్రభుత్వ కార్యాచరణ – వెలిగొండ ద్వారా పశ్చిమ ప్రకాశం ప్రగతికి కొత్త దిశ!

💧 రైతులకు సాగునీరు
💧 ప్రజలకు తాగునీరు
💧 వ్యవసాయానికి కొత్త ఊపు
💧 పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి బలమైన పునాది

వెలిగొండ కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కాదు…
పశ్చిమ ప్రకాశం ప్రజల 30 ఏళ్ల కలకు సజీవ సాక్ష్యం!

ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ప్రతిబింబిస్తూ వివిధ పత్రికల్లో వెలువడిన కథనాలు మీ ముందుకు తీసుకువస్తున్నాను.

జై తెలుగుదేశం!
జై చంద్రబాబు! 💛

డా. నూకసాని బాలాజీ
జాతీయ ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్

#వెలిగొండ #చంద్రబాబునాయుడు #పశ్చిమప్రకాశం #సాగునీరు #రైతన్నభరోసా #పశ్చిమప్రకాశం_ప్రజల_కల #అభివృద్ధి

భగీరథుడి సంకల్పం.. కాటన్‌ దొర దూరదృష్టి.. చంద్రబాబు జలసంకల్పం!- వెలిగొండ జలాలతో పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల స్వప్నం సాకా...
30/08/2026

భగీరథుడి సంకల్పం.. కాటన్‌ దొర దూరదృష్టి.. చంద్రబాబు జలసంకల్పం!
- వెలిగొండ జలాలతో పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల స్వప్నం సాకారం
- కాటన్‌ దొరను మైమరిపిస్తున్న ఆధునిక అపర భగీరథుడు చంద్రబాబు
- టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు,
& రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌

డా. నూకసాని బాలాజీ

మార్కాపురం, ఆగస్టు 30 : పశ్చిమ ప్రకాశం ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం అవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆధునిక అపర భగీరథుడిగా చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ డా. నూకసాని బాలాజీ అన్నారు. భగీరథుడు గంగను భువికి తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చినట్లే, సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరిపై ఆనకట్ట నిర్మించి ఆంధ్ర ప్రజల జీవితాల్లో జలవిప్లవానికి నాంది పలికినట్లే.. చంద్రబాబు జలసంకల్పంతో పశ్చిమ ప్రకాశం ప్రజల జీవితాల్లో వెలిగొండ కొత్త వెలుగులు నింపబోతోందని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన డా. నూకసాని బాలాజీ ప్రాజెక్టు పనులు, నీటి ప్రవాహం, గేట్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న మహత్తరమైన కల సాకారం అవుతున్న చారిత్రాత్మక దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
30 ఏళ్ల నిరీక్షణకు తెర :
1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినప్పటి నుంచి పశ్చిమ ప్రకాశం ప్రజలు ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారని బాలాజీ తెలిపారు. అనేక ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఎదురైన అవరోధాలు తొలగలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా తీసుకుని పనులను వేగవంతం చేశారని చెప్పారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల పునరావాసం, పునరావాసం–పరిహారం సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారని, పునరావాసం–పరిహారం ప్యాకేజీల కోసం సుమారు రూ.955 కోట్లు విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని బాలాజీ పేర్కొన్నారు.
పశ్చిమ ప్రకాశానికి వరప్రదాయిని :
వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని సుమారు 30 మండలాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి వస్తాయని బాలాజీ తెలిపారు. సుమారు 23 లక్షల మంది ప్రజలకు తాగునీటి భరోసా కలగడంతో పాటు సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం చేకూరుతుందన్నారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి తదితర ప్రాంతాలకు వెలిగొండ జలాలు వరప్రదాయినిగా మారనున్నాయని చెప్పారు. సాగునీటి లభ్యతతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వివరించారు. భవిష్యత్తులో ఈ జలప్రయోజనాలు నెల్లూరు, కడప జిల్లాల ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందన్నారు.
ప్రజల భావోద్వేగానికి వెలిగొండే నిదర్శనం :
వెలిగొండ ప్రాజెక్టు వద్దకు భారీగా తరలివచ్చిన ప్రజల్లో కనిపించిన ఆనందం, భావోద్వేగం తనను ఎంతో కదిలించిందని బాలాజీ అన్నారు. తమ కలను చంద్రబాబు నాయుడు నెరవేర్చారని, తమ పొలాలకు సాగునీరు, ఇళ్లకు తాగునీరు అందించి జీవితాల్లో వెలుగులు నింపబోతున్నారని ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆనందం వెలిగొండపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబు :
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని విడుదల చేసే స్థాయికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదేనని బాలాజీ అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని, గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక భారాన్ని అధిగమిస్తూ వెలిగొండ వంటి భారీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చారని తెలిపారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి పునరావాస ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రాజెక్టు పూర్తికి ఉన్న ప్రధాన అవరోధాలను తొలగించి నీటి విడుదలకు మార్గం సుగమం చేశారని చెప్పారు.
కాటన్‌ దొరను మైమరిపించే జలసంకల్పం :
ఆంధ్రప్రదేశ్‌ జలచరిత్రలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ వేసిన ముద్ర ఎంత గొప్పదో.. వెలిగొండ ద్వారా చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రకాశం ప్రజల జీవితాల్లో అంతే శాశ్వతమైన ముద్ర వేయబోతున్నారని బాలాజీ అన్నారు. కాటన్‌ దొరను మైమరిపించే జలసంకల్పంతో, పురాణాల్లోని భగీరథుడిని తలపించే పట్టుదలతో పశ్చిమ ప్రకాశం ప్రజల మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్న చంద్రబాబు ఆధునిక అపర భగీరథుడిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.
చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా.. :
వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు సంబంధించిన ప్రయోగాత్మక ప్రవాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని బాలాజీ తెలిపారు. పశ్చిమ ప్రకాశం ప్రజల మూడు దశాబ్దాల కల సాకారం అవుతున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలవడం తన అదృష్టమన్నారు. వెలిగొండ నీరు కేవలం కాలువల్లో ప్రవహించే నీరు కాదని.. పశ్చిమ ప్రకాశం ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కన్నీళ్లు, మూడు దశాబ్దాల నిరీక్షణకు లభించిన సమాధానమని బాలాజీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశం ప్రాంత భవిష్యత్తును మార్చే జలవిప్లవానికి నాంది పలకబోతోందని అన్నారు.

డా. నూకసాని బాలాజీ
జాతీయ ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC)

💛 ఒంగోలులో లోకేష్ గారి పర్యటనకు ఘన స్వాగతం… ఘన విజయం! 💛శ్రీ నారా లోకేష్ బాబు గారి ఒంగోలు పర్యటనను విజయవంతం చేసిన తెలుగుద...
28/08/2026

💛 ఒంగోలులో లోకేష్ గారి పర్యటనకు ఘన స్వాగతం… ఘన విజయం! 💛

శ్రీ నారా లోకేష్ బాబు గారి ఒంగోలు పర్యటనను విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏

మీ అందరి అభిమానం, అంకితభావం, సమన్వయం, ఉత్సాహభరితమైన స్పందన ఈ పర్యటనను ఘనవిజయం చేశాయి.

కూటమి ఐక్యతే మన బలం… ప్రజల అభిమానమే మన విజయానికి బలం! ✌️💛

డా. నూకసాని బాలాజి

జాతీయ ఉపాధ్యక్షుడు,

తెలుగుదేశం పార్టీ
&
చైర్మన్,
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్

ఒంగోలు పర్యటనను జయప్రదం చేద్దాంఈ నెల 28-08-2026న ఒంగోలులో శ్రీ నారా లోకేష్ బాబు గారి పర్యటన జరుగనున్న సందర్భంగా, తెలుగుద...
27/08/2026

ఒంగోలు పర్యటనను జయప్రదం చేద్దాం

ఈ నెల 28-08-2026న ఒంగోలులో శ్రీ నారా లోకేష్ బాబు గారి పర్యటన జరుగనున్న సందర్భంగా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

డా. నూకసాని బాలాజి
జాతీయ ఉపాధ్యక్షుడు
తెలుగుదేశం పార్టీ
&
చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్

పెరుగు వారి వివాహ వేడుకలో:--పొన్నూరు మండలం మంగపతివారిపాలెం గ్రామంలో పెరుగు కోటేశ్వరరావు–రవణమ్మ దంపతుల కుమారుడు పెరుగు శ్...
26/08/2026

పెరుగు వారి వివాహ వేడుకలో:--

పొన్నూరు మండలం మంగపతివారిపాలెం గ్రామంలో
పెరుగు కోటేశ్వరరావు–రవణమ్మ దంపతుల కుమారుడు పెరుగు శ్రీహరి–శ్రావణి ల
వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాను.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందంతో నిండాలని ఆకాంక్షించాను.

గుమ్మా వారి వివాహ వేడుకలో:--పొన్నాలూరు మండలం శివన్నపాలెం గ్రామంలో గుమ్మా వేణు–ప్రియల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ...
26/08/2026

గుమ్మా వారి వివాహ వేడుకలో:--

పొన్నాలూరు మండలం శివన్నపాలెం గ్రామంలో

గుమ్మా వేణు–ప్రియల
వివాహ వేడుకకు
హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాను.

ఈ సందర్భంగా వధూవరుల తల్లిదండ్రులతో పాటు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపాలు, మాల్యాద్రి, మల్లికార్జున్, ఆదెయ్య, మాలకొండయ్య, మాధవ్, శ్రీకాంత్, మోహనకృష్ణ ,
తదితర తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నూతన దంపతుల దాంపత్య జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందంతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 💐

🇮🇳 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి 125వ జయంతి సందర్భంగా ఘన నివాళులు 🙏స్వాతంత్ర్య సమరయోధుడు, నిర్భయ ప్రజానాయకుడు, ...
23/08/2026

🇮🇳 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి 125వ జయంతి సందర్భంగా ఘన నివాళులు 🙏

స్వాతంత్ర్య సమరయోధుడు, నిర్భయ ప్రజానాయకుడు, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి 125వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.

బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధైర్యశాలి ప్రకాశం పంతులుగారు. ప్రజల హక్కుల కోసం ఎటువంటి ఒత్తిడికీ తలొగ్గకుండా, నిజాయితీ, నిబద్ధత, ధైర్యంతో ప్రజాసేవ చేసిన మహనీయుడు.

ఆయన త్యాగం, స్ఫూర్తి, ప్రజాసేవా విలువలు నేటి తరానికి ఎప్పటికీ మార్గదర్శకాలు.

ఆంధ్రకేసరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి.

🙏 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారికి హృదయపూర్వక జయంతి నివాళులు.

-డా. నూకసాని బాలాజి

జాతీయ ఉపాధ్యక్షులు

తెలుగుదేశం పార్టీ
&

చైర్మన్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్

కార్పొరేషన్

Address

Ongole

Alerts

Be the first to know and let us send you an email when Dr.Nukasani Balaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr.Nukasani Balaji:

Shortcuts

Share