MHPS ponnur constituency

MHPS ponnur constituency minority hakkula parirakshana samiti

25 ఆగస్టు 2026 జంపని. అతా తాజ్ సూఫీ నిజాముద్దీన్ బాబా గారి ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త మీలాద్ ఉన్ నబి కార్యక్రమానికి ఉర్ద...
20/08/2026

25 ఆగస్టు 2026 జంపని. అతా తాజ్ సూఫీ నిజాముద్దీన్ బాబా గారి ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త మీలాద్ ఉన్ నబి కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూఖ్ షూబ్లి గారినీ ముఖ్యఅతిథిగా విచ్చేయాలని ఆహ్వానించడం జరిగింది.

పొన్నూరు పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు పొన్నూరు కొండిబోయిన బ్రహ్మయ్య గారు, మైనార్టీ నాయకులు సుల్తాన్ గారు, ఉమ్మడి...
20/08/2026

పొన్నూరు పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు పొన్నూరు కొండిబోయిన బ్రహ్మయ్య గారు, మైనార్టీ నాయకులు సుల్తాన్ గారు, ఉమ్మడి గుంటూరు జిల్లా MHPS అధ్యక్షులు సయ్యద్ జాఫర్ గారు మరియు తదితరులు ఈరోజు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి. ఫారూక్ షుబ్లీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

19/08/2026

ఇమామ్ & మౌజ్జిన్‌ల గౌరవ వేతనాలను విడుదల చేసిన సందర్భంగా…

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
గౌరవ మైనారిటీ సంక్షేమ & న్యాయ శాఖ మంత్రి శ్రీ ఎన్.ఎం.డి. ఫరూఖ్ గారికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మైనారిటీల సంక్షేమం…
ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం.
# farook shubli

  TO BE AN INDIAN  INDEPENDENT DAY
15/08/2026

TO BE AN INDIAN
INDEPENDENT DAY

దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధం​కొండపల్లి దర్గాలో జాతీయ జెండాల పంపిణీ చేపట్టిన మైనారిటీ హక్కుల పర...
14/08/2026

దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధం

​కొండపల్లి దర్గాలో జాతీయ జెండాల పంపిణీ చేపట్టిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి.

"ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి గతంలోనూ వెనకాడలేదు, ఇప్పుడు వెనకాడము, రాబోయే రోజుల్లోనూ సిద్ధంగా ఉంటాం" అని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ స్పష్టం చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లిలోని చారిత్రాత్మక హజరత్ సయ్యద్ షా బుకారీ దర్గా ఆవరణలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఫరూఖ్ షుబ్లీ మాట్లాడుతూ... 'దేశం కోసం – ధర్మం కోసం' అనే ముఖ్య లక్ష్యంతో సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో లక్ష ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గ పరిధిలోనే 5 వేల ఇళ్లకు జెండాలను అందజేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మత పండితులు, పూర్వీకులు ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది ముస్లింలు ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. ఆ త్యాగాల బాటలోనే నేటి తరం కూడా దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

అనంతరం ​సూఫీ మత గురువు అల్తాఫ్ రజా మాట్లాడుతూ... 450 సంవత్సరాల చరిత్ర కలిగిన బుకారీ దర్గా ఆవరణలో ‘ఘర్ ఘర్ తిరంగా’ కాన్సెప్ట్‌తో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం చిన్నారులు, పెద్దలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనారిటీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

"ఘర్ ఘర్ తిరంగా" కార్యక్రమానికి శ్రీకారం — రాష్ట్రవ్యాప్తంగా లక్ష జాతీయ జెండాల పంపిణీకి MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ ష...
12/08/2026

"ఘర్ ఘర్ తిరంగా" కార్యక్రమానికి శ్రీకారం — రాష్ట్రవ్యాప్తంగా లక్ష జాతీయ జెండాల పంపిణీకి MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ పిలుపు

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి — MHPS ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ నేత్రుత్వంలో “ఘర్ ఘర్ తిరంగా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మొగల్రాజపురంలోని సదర్న్ స్పైస్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష జాతీయ జెండాలను పంపిణీ చేసి, ప్రతి ఇంటినీ ‘ఘర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నిర్ణయించింది.

ఈ సందర్బంగా.. MHPS వ్యవస్థాపకులు, అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ..
“ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి… ప్రతి హృదయంలో దేశభక్తి వెలుగులు నిండాలి…” అనే సంకల్పంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతున్నట్టు తెలిపారు.

కులమతాలకతీతంగా ప్రజలందరినీ ఏకం చేసే త్రివర్ణ పతాకం మన గౌరవం, మన గుర్తింపు, మన దేశభక్తికి ప్రతీక అని MHPS నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నేడు నిర్వహించిన MHPS రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది నాయకులు, సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 200 జాతీయ జెండాలను అందజేసి, వారందరినీ “ఘర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా MHPS అధ్యక్షులు మహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ, “మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ‘ధర్మం కోసం — దేశం కోసం’ అనే సంకల్పంతో ‘ఘర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి. దేశభక్తి ప్రతి హృదయంలో వెలుగొందాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంతో జాతీయ గీతానికి గౌరవంతో పాటూ మత విశ్వాసాలకు కూడా గౌరవం పెరుగుతుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “ఘర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని షిబ్లీ పిలుపునిచ్చారు. ఎంహెచ్పిఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టినట్టు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల నుంచి ఎంహెచ్పీఎస్ ప్రతినిధులు, మత పెద్దలు హాజరయ్యారు.

12/08/2026

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి — MHPS ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ గారి నాయకత్వంలో “ఘర్ ఘర్ తిరంగా” కార్యక్రమం

Address

Ponnur Town
Ponnur

Website

Alerts

Be the first to know and let us send you an email when MHPS ponnur constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share