23/08/2026
*తేదీ: 23-08-2026 | ప్రదేశం: పుంగనూరు*
*స్థానిక ఎన్నికల సమరంలో విజయం లక్ష్యంగా SDPI విస్తృత స్థాయి సమావేశం*
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని *"స్థానిక ఎన్నికల సమరంలో విజయం లక్ష్యం"* అనే నినాదంతో SDPI పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఈరోజు పుంగనూరులో జిల్లా అధ్యక్షులు *గౌ. యూసుఫ్ గారి ఆధ్వర్యంలో* అత్యంత ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ *జాతీయ కార్యవర్గ సభ్యులు గౌ. అబ్దుల్ హన్నాన్ గారు* పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...* "స్థానిక ఎన్నికలు పార్టీకి పునాది లాంటివి. ప్రతి వార్డు, ప్రతి పంచాయతీలో మన బూత్ కమిటీలు బలంగా ఉండాలి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ SDPI మాత్రమే. ప్రజలకు మనం అందుబాటులో ఉండి, వారి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే వారు మనల్ని ఆదరిస్తారు. కాబట్టి ఇప్పటి నుండే ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను, 'ఆకలి నుండి విముక్తి - భయం నుండి విముక్తి' అనే మన లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి" అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకులు *, హాఫిజ్ అత్తావుల్లా గారు*, రాష్ట్ర అధ్యక్షులు *అబ్దుల్ ఖాన్ గారు*, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు *KS. అన్వార్ బాషా గారు, మహమ్మద్ గాని గారు*, జిల్లా నాయకులు *ఇర్ఫాన్ ముల్లా గారు* పాల్గొని రాబోయే ఎన్నికల వ్యూహం, సంస్థాగత నిర్మాణం, క్యాడర్ ను బలోపేతం చేయడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అనంతరం జిల్లా అధ్యక్షులు *యూసుఫ్ గారు* మాట్లాడుతూ, "జిల్లాలో పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో SDPI తన బలాన్ని చాటుతుంది. ప్రతి నియోజకవర్గంలో మన అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం" అని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా, నియోజకవర్గ, మండల, బ్రాంచ్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
*ఇట్లు,*
*యూసుఫ్*
*జిల్లా అధ్యక్షులు, SDPI - అన్నమయ్య / చిత్తూరు జిల్లా*
*సెల్: 9703195540*