12/01/2026
*గ్రామ మౌలిక సదుపాయాల కోసం ఎంపీ డీకే అరుణకు BJYM వినతిపత్రం*
*హైమాక్స్ లైట్లు, CC రోడ్డు ఏర్పాటు కోసం BJYM కొత్తూరు మండలం అధ్యక్షుడు అంబటి శ్రీశైలం ఎంపీ డీకే అరుణ కు వినతి*
గ్రామ అభివృద్ధికి కొత్తూరు మండలం (BJYM) యువ మోర్చా అధ్యక్షుడు అంబటి శ్రీశైలం వినతి. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేత. కొత్తూర్ మండలంలోని S.B. పల్లి గ్రామ అభివృద్ధి పనుల కోసం కొత్తూరు మండలం భారతీయ జనతా యువ మోర్చా (BJYM) అధ్యక్షుడు అంబటి శ్రీశైలం, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కీలకమైన పలు అంశాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ప్రజలకు సమాచార సౌకర్యం మెరుగుపడేందుకు శివాలయం, గ్రామపంచాయతి కార్యాలయం, SC కమ్యూనిటీ భవనం వద్ద హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామంలో హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో CC రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ పనులు పూర్తయితే గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని, ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ వినతిపై ఎంపీ డీకే అరుణ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు BJYM నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక BJYM నాయకులు, తదితరులు పాల్గొన్నారు.