21/05/2026
*వృద్దాశ్రమంలో చీరలు పండ్లు పంపిణి*
*పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం*
*వార్షికోత్సవంలో పాల్గొన్న బిజెపి నాయకులు మరియు పీవీఆర్ అభిమానులు*
షాద్ నగర్ పట్టణంలోని నవోదయ సేవ సంఘం వృద్ధాశ్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, రమాదేవి దంపతుల పెళ్లి రోజు సందర్బంగా షాద్ నగర్ బిజెపి నాయకులు సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలోని మహిళలకు ఉచితంగా చీరలు, పురుషులకు పంచెలు, అరటిపళ్ళు పంపిణీ చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆశ్రమ వాసులు మాట్లాడుతూ, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల సేవలో ముందుంటారని, సమాజానికి ఆయన చేస్తున్న సేవలు ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. పేదలు, వృద్ధులు మరియు అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశీర్వదించారు.
అలాగే వృద్ధులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి వివాహ వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ పట్ల చూపుతున్న సేవాభావానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవీఆర్ అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఇస్నాతి శ్రీనివాస్ , లష్కర్ నాయక్, పసుల నర్సింహ్మ యాదవ్,చేగు సుధాకర్ అప్ప,హాజీపల్లి ఉపసర్పంచ్ గంగాధర్, మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మిద్దె గణేష్, అనిల్ కుమార్ గౌడ్, కుడుముల బాల్ రాజ్, కిట్టు యాదవ్, క్యామ మహేష్, కుమ్మరి మహేష్, కరెడ్ల నరేందర్ రెడ్డి, శ్రీధర్ చారి, వనం శ్రీనివాస్,గణేష్ నాయక్, ప్రశాంత్ గౌడ్, కావలి ఆంజనేయులు,చెవుల బాస్కర్,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు..