22/05/2021
*Covid 19 టాస్క్ ఫోర్స్ సేవలు అభినందనీయం*
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్న ప్రజలకు తమ వంతు సేవ చేయడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని covid 19 టాస్క్ ఫోర్స్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని తిరుపతి ఎమ్మెల్యే, ఆ సంస్థ గౌరవ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మనదేశం- మన తిరుపతి - మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు, రుయా హాస్పటల్లో కోవిడ్ వారియర్స్ అయిన వైద్యులకు, వైద్య సిబ్బందికి, పారామెడికల్ సిబ్బంది కి మెడికల్ పిపి కిట్లు, శానిటైజర్, మాస్కులు, గ్లౌజ్లను అందించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకే తలమానికమైన రుయా హాస్పిటల్ వైద్య సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి సేవాభారతి ఇస్కాన్ టెంపుల్ సౌజన్యంతో టాస్క్ఫోర్స్ సభ్యులు డాక్టర్ సుబ్రమణ్యం వితరణతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. టాస్క్ ఫోర్స్ కన్వీనర్ ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వానికి బాధ్యతలను గుర్తు చేస్తూ అలాగే ప్రజలు ప్రభుత్వం మనకేం చేసింది అని కాకుండా మన కోసం పని చేస్తున్న కోవిడ్ వారియర్స్కు అండగా నిలబడాల్సిన సమయం ఇదే అన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చే రోగులకు, కరోనా బాధితులు కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందికి ప్రతి ఒక్కరు తామున్నామని భరోసా కల్పించాలని చెప్పారు. కోవిడ్ వారియర్స్ కనిపించే దేవుళ్ళుగా అభివర్ణించారు. వారికి అవసరమైన వస్తువులను అందించడం తమకు శ్రీ వెంకటేశ్వర స్వామి కలిగించిన మహా అవకాశంగా భావిస్తున్నామని అన్నారు. ఇకపై టాస్క్ఫోర్స్ కార్యక్రమాలు తిరుపతి నగరంలో నిరంతరాయంగా నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ సుబ్రమణ్యం గారు, డాక్టర్ శ్రీహరి గారు, ఇస్కాన్ టెంపుల్ లీలా పారాయణ దాస్ గారు,TAPE నాయకులు ఆర్ ఆర్ శ్రీనివాసులు గారు, ఎన్జీవో సంఘం నాయకులు సురేష్ గారు, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్ కె బాబు గారు, గౌస్ గారు, nsf నాయకులు నగేష్ గారు, సేవ భారతి నాయకులు ముని రత్నం గారు, అవిలాల శ్రీధర్ గారు,రుయా హాస్పటల్ సూపరింటెండెంట్ భారతి గారు, నోడల్ ఆఫీసర్ శ్రీహరి గారు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారాలతో
ముని సుబ్రహ్మణ్యం
కన్వీనర్
Covid 19 - టాస్క్ ఫోర్స్.