20/11/2023
సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేపడుతున్న పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర సాధారణ, పోలీస్ పరిశీలకులు కలెక్టరేట్ కు విచ్చేశారు. అజయ్ వి. నాయక్ ఐఏఎస్, దీపక్ మిశ్రా ఐపీఎస్ లను పూల గుచ్చాలను అందజేసి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సి. నారాయణరెడ్డి , ఎస్పి ఎన్. కోటిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రల్లో ఏర్పాట్లపై వారు ఆరా తీశారు. పోలింగ్ , కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Election Commission of India
Chief Electoral Officer Telangana