Dr. Kadiyam Kavya

Dr. Kadiyam Kavya In Dr. Kavya, Warangal finds not just a candidate, but a compassionate, educated, and dedicated leader committed to fostering positive change.

Dr. Kavya leads impactful projects focused on education and women's health, menstrual hygiene and health initiatives.
Dr. Kavya's Story

Meet Dr. Kavya, an accomplished MD in Pathology, whose vibrant spirit and dedication to community well-being are reshaping Warangal's future. Her journey is a testament to the power of passion and expertis

e coming together for positive change.

🌿 Local Roots and Political Aspirations 🌿
Hailing from Warangal, Dr. Kavya's roots run deep in the soil of her community. Inspired by her father's political legacy, she aspires to serve as a voice for the people, blending local insight with a forward-thinking vision for progress.

👩‍⚕️ Versatile Leadership and Professional Excellence 👩‍⚕️
Beyond her role as a Lead Pathologist, Dr. Kavya's leadership extends into rural communities, addressing societal challenges with holistic initiatives. Her commitment to uplifting every aspect of the constituency reflects her dedication to making a difference.

📝 Prolific Writing and Advocacy 📝
Dr. Kavya's influence goes beyond the medical field. Her writings and advocacy highlight a deep understanding of societal needs, guiding local governance and championing women's health issues with insight and compassion.

🌐 Chairperson of Kadiyam Foundation 🌐
As Chairperson, Dr. Kavya leads impactful projects focused on education and women's health, leaving a lasting legacy in menstrual hygiene and health initiatives.

🩸 Menstrual Hygiene Activism 🩸
A tireless advocate for menstrual hygiene, Dr. Kavya breaks taboos and empowers adolescent girls through awareness programs and distribution campaigns, ensuring essential hygiene products reach those in need.

🤰 Maternal and Child Health Initiatives 🤰
Dr. Kavya's passion for healthcare extends to pregnant women, providing nutrition awareness and support for healthy deliveries, exemplifying her commitment to maternal and child well-being.

🦸‍♀️ Frontline Warrior during COVID-19 🦸‍♀️
Amid the pandemic, Dr. Kavya emerged as a frontline warrior, collaborating with local administration to provide relief activities and support to COVID-affected individuals, demonstrating her unwavering dedication to community welfare.

📚 Youth Empowerment 📚
Dr. Kavya's support extends to the youth, offering financial aid and educational support programs, ensuring every child has access to quality education and opportunities for success.

💙 Mental Health and Social Welfare 💙
Known for her compassionate initiatives, Dr. Kavya supports mental health facilities and provides aid to vulnerable individuals, spreading warmth and kindness to those in need. Her journey inspires us all to embrace the power of community and compassion, for she truly embodies the spirit of progress Warangal deserves. Wishing you all the best! May your dedication and commitment to the people of Warangal lead you to success in the career path.

02/06/2026

హనుమకొండ
తేది:02-06-2026

ప్రజల కష్టమే తన కష్టం...

నిరుపేదలకు భరోసాగా నిలుస్తున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

క్యాన్సర్ బాధిత చిన్నారికి అండగా నిలిచిన ఎంపీ డా.కడియం కావ్య..

వైద్య సహాయం నుంచి సొంత ఇంటి కల వరకు... కుటుంబాలకు అండగా ఎంపీ డా.కడియం కావ్య

కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ‘నేనున్నాను’ అంటూ భరోసా ఇచ్చిన వరంగల్ ఎంపీ..

మానవత్వంతో ముందుకు సాగుతున్న ప్రజా నాయకురాలు డాక్టర్ కడియం కావ్య..

ప్రజల సమస్యలను కుటుంబ సభ్యుల సమస్యలుగా భావిస్తూ స్పందిస్తున్న ఎంపీ..

వైద్యం, గృహం, ఉపాధి అంశాల్లో అవసరమైన వారికి అండగా నిలుస్తున్న డాక్టర్ కడియం కావ్య..

ప్రజా సేవకు కొత్త అర్థం చెబుతున్న వరంగల్ ఎంపీ..

కష్టాల్లో ఉన్న కుటుంబాల కన్నీరు తుడుస్తూ మనసున్న ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందుతున్న డా. కడియం కావ్య..

అభివృద్ధితో పాటు మానవత్వాన్ని చాటుతున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు..

ప్రజలకు మరింత చేరువవుతున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

"నేన

02/06/2026

హనుమకొండ
తేది:02-06-2026

ప్రజల కష్టమే తన కష్టం...

నిరుపేదలకు భరోసాగా నిలుస్తున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

క్యాన్సర్ బాధిత చిన్నారికి అండగా నిలిచిన ఎంపీ డా.కడియం కావ్య..

వైద్య సహాయం నుంచి సొంత ఇంటి కల వరకు... కుటుంబాలకు అండగా ఎంపీ డా.కడియం కావ్య

కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ‘నేనున్నాను’ అంటూ భరోసా ఇచ్చిన వరంగల్ ఎంపీ..

మానవత్వంతో ముందుకు సాగుతున్న ప్రజా నాయకురాలు డాక్టర్ కడియం కావ్య..

ప్రజల సమస్యలను కుటుంబ సభ్యుల సమస్యలుగా భావిస్తూ స్పందిస్తున్న ఎంపీ..

వైద్యం, గృహం, ఉపాధి అంశాల్లో అవసరమైన వారికి అండగా నిలుస్తున్న డాక్టర్ కడియం కావ్య..

ప్రజా సేవకు కొత్త అర్థం చెబుతున్న వరంగల్ ఎంపీ..

కష్టాల్లో ఉన్న కుటుంబాల కన్నీరు తుడుస్తూ మనసున్న ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందుతున్న డా. కడియం కావ్య..

అభివృద్ధితో పాటు మానవత్వాన్ని చాటుతున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు..

ప్రజలకు మరింత చేరువవుతున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

"నేనున్నాను" అనే ఒక్క మాట కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందో మరోసారి నిరూపించారు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు. ప్రజల సమస్యలను కేవలం వినడమే కాకుండా వాటి పరిష్కారానికి వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటూ మానవత్వంతో ముందుకు సాగుతున్న నాయకురాలిగా ఎంపీ డా.కడియం నిలుస్తున్నారు.

కాళోజి కళాక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హనుమకొండకు వచ్చిన సందర్భంలో, తన తండ్రి భుజాలపై కూర్చొని "నేను క్యాన్సర్ పేషెంట్‌ని... నన్ను కాపాడండి" అంటూ ఫ్లకార్డు పట్టుకున్న ఆరేళ్ల బాబు ఎంపీ కడియం కావ్య దృష్టిని ఆకర్షించాడు. వెంటనే ఆ కుటుంబాన్ని పిలిపించుకుని వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

రోజు వారి కూలీగా ఉల్లిగడ్డల వ్యాపారి వద్ద పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఆ చిన్నారి తండ్రి, కుమారుడి వైద్య ఖర్చులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చలించిపోయారు. వెంటనే స్పందించి స్వయంగా వైద్యులతో మాట్లాడి ఎల్ఓసీ ద్వారా ఆ చిన్నారికి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి రూ.5 లక్షల చొప్పున 2 ఏళ్లుగా వైద్య సహాయం అందిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

అంతేకాకుండా, సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో కష్టాలు పడుతున్న ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారితో స్వయంగా మాట్లాడి ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇంటి మంజూరుకు కృషి చేశారు. ఎంపీ చొరవతో ఆ కుటుంబం నేడు సొంత ఇంటి కలను సాకారం చేసుకుంది.

ఇదే కార్యక్రమంలో మరో నిరుపేద కుటుంబానికి కూడా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆశాకిరణంగా నిలిచారు. వృద్ధురాలైన తల్లికి వికలాంగుడైన కుమారుడు ఉండటంతో జీవనం దుర్భరంగా మారింది. అద్దె చెల్లించే పరిస్థితి కూడా లేక, ఎలాంటి ఆధారం లేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబం గురించి తెలుసుకున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వారి సమస్యను తన సమస్యగా భావించి ముందుకు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడి ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇంటి మంజూరుకు కృషి చేసి ఈరోజు వారికి ఇంటి పట్టా అందేలా చేశారు. నేడు
హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్లు, 2BHK ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గార్లతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లబ్ధిదారులకు ఇల్లు మంజూరు పట్టాలను అందజేశారు.

ప్రజల బాధలను కేవలం ఫిర్యాదులుగా కాకుండా కుటుంబ సభ్యుల సమస్యలుగా భావిస్తూ స్పందించడం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేకతగా నిలుస్తున్నారు. వైద్యం, విద్య, గృహం, ఉపాధి వంటి అంశాల్లో అవసరమైన వారికి అండగా నిలుస్తూ, ప్రజా సేవకు కొత్త అర్థం చెబుతున్నారు.

నాయకత్వం అంటే కేవలం అభివృద్ధి పనులు ప్రారంభించడం మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్న ఒక కుటుంబం కన్నీరు తుడవడం కూడా అని తన కార్యాచరణ ద్వారా నిరూపిస్తున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పార్లమెంట్ ప్రజలకు మనసున్న ప్రజాప్రతినిధిగా మరింత చేరువవుతున్నారు..




హనుమకొండతేది: 02-06-2026ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..హనుమకొండలోని కాలేజీ...
02/06/2026

హనుమకొండ
తేది: 02-06-2026

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

హనుమకొండలోని కాలేజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్లు, 2BHK ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పట్టాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు..

ముందుగా,రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియాగాంధీ గారి చిత్ర పటానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు పాలాభిషేకం చేశారు..

అనంతరం న్యూ శాయంపేటలో 32 కోట్ల 24 లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు..

ఈ సందర్భంగా కాలేజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ,..
పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

గతంలో ఇల్లు కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసిన కుటుంబాలకు నేడు గౌరవప్రదమైన జీవనం అందించేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. సొంత ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు కాదని, ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసా కల్పించే సాధనమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వాగతించాల్సిన సమయంలో విమర్శలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కంటే రాజకీయ లబ్ధిపైనే వారి దృష్టి ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాటలతో కాదు, చేతలతో పాలన అందిస్తూ పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తోందని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..





హనుమకొండతేది: 02-06-2026రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు....
02/06/2026

హనుమకొండ
తేది: 02-06-2026

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలో నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు..

మొదట అదాలత్ సర్కిల్‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి అమరవీరులకు నివాళులర్పించారు..

"అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించి వాటిలో ప్రదర్శించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..




పరకాలతేది:29 -05-2026బీజేపీ ఓటర్ల జాబితాలతో ప్రమాదకర రాజకీయాలు చేస్తోంది..ప్రతి బూత్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేయాల...
29/05/2026

పరకాల
తేది:29 -05-2026

బీజేపీ ఓటర్ల జాబితాలతో ప్రమాదకర రాజకీయాలు చేస్తోంది..

ప్రతి బూత్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేయాలి..

ఓటు చోరీ ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలి..

SIR ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి..

ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే మా లక్ష్యం..

BLAలు, BLOలు కలిసి డోర్ టు డోర్ ప్రచారం చేపట్టాలి..

ఓటర్ల జాబితానే ఎన్నికల్లో విజయానికి తొలి అడుగు..

రాహుల్ గాంధీ ఓటు చోరీపై పోరాడుతున్నారు..

బీజేపీ కుట్రలను క్షేత్ర స్థాయిలో తిప్పికొట్టాలి..

కాంగ్రెస్ పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి..

__డా.కడియం కావ్య
ఎంపీ,వరంగల్

ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులే తమ సొంత నియోజకవర్గాల్లో గెలవలేని ప్రమాదకర పరిస్థితులను బీజేపీ తీసుకొచ్చిందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు. ఓటర్ల జాబితాల నిర్వహణలో నిర్లక్ష్యం, ఓటు చోరీ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత బూత్ స్థాయి నాయకులపై ఉందని ఎంపీ పేర్కొన్నారు.

పరకాల ఎన్‌ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సుకు శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,మహ్మద్ అయూబ్ గార్లతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా SIR (Special Intensive Revision) ప్రక్రియ, ఓటర్ల జాబితా నిర్వహణ, బూత్ స్థాయి బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు..

ఈ సమావేశాన్ని ఉద్దేశించి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ,..
ప్రతి బూత్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు, ఓటర్ల వివరాలు, ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రజలు తరచూ నివాస ప్రాంతాలు మార్చడం, అద్దె ఇళ్లలో నివసించడం, ఉద్యోగాల కారణంగా చిరునామాలు మారడం వల్ల ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం నిలుపుకోవడం సవాల్‌గా మారుతోందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో SIR ప్రక్రియ అత్యంత కీలకమని పేర్కొన్నారు.

గతంలో 2002లో నిర్వహించిన SIR ప్రక్రియ మళ్లీ 2026లో చేపడుతున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, బూత్ ఏజెంట్లు దీన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని మ్యాపింగ్ చేయడం, కొత్త ఓటర్ల గుర్తింపు, మారిన ఓటర్ల వివరాల సవరణ, అనుమానాస్పద నమోదుల పరిశీలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో SIR పేరుతో ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న మార్పులను గమనించాలని, తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. “మన ఓటును మనమే కాపాడుకోవాలి. ప్రతి BLA ఒక సైనికుడిలా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.

బూత్ లెవల్ ఏజెంట్లు, BLOలతో కలిసి వచ్చే మూడు నెలలు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఓటర్ల జాబితానే ఎన్నికల్లో గెలుపుకు తొలి అడుగు అని అన్నారు. ఇప్పటికే డివిజన్‌ల వారీగా ఇన్‌చార్జిలను నియమించామని, రేపటి నుంచి బూత్ స్థాయి కన్వీనర్లు, ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

అనంతరం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూపొందించిన “బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్”ను ఆవిష్కరించి BLAలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు..



హనుమకొండతేది:29-05-2026గోపాలపూర్ ఊర చెరువు పూడికతీత పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు..గ్రేటర...
29/05/2026

హనుమకొండ
తేది:29-05-2026

గోపాలపూర్ ఊర చెరువు పూడికతీత పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు..

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపూర్‌లోని ఊర చెరువు సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పూడికతీత పనులకు స్థానిక శాసన సభ్యులు కె.ఆర్ నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శంకుస్థాపన చేశారు..

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ..,
చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువు సామర్థ్యం పెరిగి వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల్లో ఎదురయ్యే వరద ముంపు సమస్యలను తగ్గించేందుకు ఈ పూడికతీత పనులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం అవసరమని, చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..



త్యాగం, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈద్-ఉల్-అదా (బక్రీద్) పండుగ సందర్భంగా ముస్లిం సోదర,సోదరీమణులకు హృదయపూర్వక...
28/05/2026

త్యాగం, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈద్-ఉల్-అదా (బక్రీద్) పండుగ సందర్భంగా ముస్లిం సోదర,సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు..




హనుమకొండతేది: 27-05-2026బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య..త్యాగం, సహనం, సౌభ్...
27/05/2026

హనుమకొండ
తేది: 27-05-2026

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య..

త్యాగం, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈద్-ఉల్-అదా (బక్రీద్) పండుగ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర, సోదరీమణులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ ప్రతి ఒక్కరిలో సేవా భావం, మానవత్వం, పరస్పర ప్రేమను పెంపొందిస్తుందని ఎంపీ పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం గారి మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పవిత్ర పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు.

భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగ సమాజంలో సోదర భావాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, తెలంగాణ రాష్ట్రం శాంతి, సుభిక్షాలతో అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు..
(File Pic)




హనుమకొండతేది: 26-05-2026ఓటర్ల జాబితానే ఎన్నికల్లో గెలుపుకు తొలి అడుగు..ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే మా బాధ్యత..ప...
26/05/2026

హనుమకొండ
తేది: 26-05-2026

ఓటర్ల జాబితానే ఎన్నికల్లో గెలుపుకు తొలి అడుగు..

ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే మా బాధ్యత..

ప్రతి BLA ఒక సైనికుడిలా పని చేయాలి..

రాష్ట్రంలో ఓట్ల తొలగింపుల పరిస్థితి రాకుండా అప్రమత్తంగా ఉండాలి..

BLAలు, BLOలతో కలిసి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించాలి..

కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులపై ప్రత్యేక నిఘా అవసరం..

కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి..

__డా.కడియం కావ్య గారు
ఎంపీ,వరంగల్

బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సులో శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య గారు రూపొందించిన “బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్”ను ఆవిష్కరించి, BLAలకు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు అందజేశారు..

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ...
పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రతి ఓటరుతో ప్రత్యక్ష సంబంధాలు పెంపొందించుకుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో BLAలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో SIR ( Special Intensive Revision) ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న మార్పులను గమనించాలని, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి BLA వద్ద తాజా ఓటర్ల జాబితా ఉండాలని, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, అనుమానాస్పద ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
BLAలు, BLOలతో కలిసి వచ్చే మూడు నెలలు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఓటర్ల జాబితానే ఎన్నికల్లో గెలుపుకు తొలి అడుగు అని పేర్కొన్నారు. “మన ఓటును మనమే కాపాడుకోవాలని, ప్రతి BLA ఒక సైనికుడిలా పని చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి” అని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో BLAలు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, MROలు తదితరులు పాల్గొన్నారు..




Address

Warangal

Alerts

Be the first to know and let us send you an email when Dr. Kadiyam Kavya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Kadiyam Kavya:

Share