06/16/2022
*పెంచిన ఆర్టీసీ చార్జీలు మరియు విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ అచ్చంపేట యూత్ కాంగ్రెస్ ,NSUI , కాంగ్రెస్ ఆధ్వర్యంలో అచ్చంపేట ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిరసన కార్యక్రమం....*
అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు యూత్ కాంగ్రెస్ NSUI , కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా కార్యక్రమం నిరసన తెలియజేయడం జరిగింది..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ....
పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలి..
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించలి
పేద ప్రజల ప్రయాణికులకు భారంగా మారిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం
ఇప్పటికే ఆరు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు మరోసారి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధపడింది వెంటనే ఇటువంటి ఆలోచన ను మార్చుకుని పేద ప్రజల ప్రజా రవాణాకు సహకరించాలని కోరుతున్నాము, సామాన్య ప్రజలు ఆర్టిసి బస్సు ఎక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరియు ఆర్టీసీ ఎండి గారు మీరు ఎటువంటి ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం...
మరీ ముఖ్యంగా పాఠశాలలో తెరిచిన సందర్భంగా విద్యార్థుల బస్పాస్ చార్జీలను పెంచడం వలన విద్యార్థులు స్కూల్ లకు వెళ్లడానికి బస్సులు తీసుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ మొత్తంలో మధ్యతరగతి వెనుకబడిన తరగతులు చెందినటువంటి విద్యార్థులు మాత్రమే ఇటువంటి బాధలు అనుభవిస్తూ చదువుకు దూరం కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్టీసీ సంస్థ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని మా యూత్ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నాం లేనియెడల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అందోళనకులకు సిద్ధమవుతున్నాను...
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు , NSUI నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు....