11/10/2022
అమరావతిలో రాజధాని, విశాఖ మరియు ఉత్తరాంధ్రవాసుల అవకాశాలను దెబ్బతీస్తుందా? 🤔🤔🤔
విశాఖ, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి, ఈశాన్యాన ఉన్న ఒక ప్రకృతి వరం.
ఎలమంచిలి ,పరవాడ, నుంచి భీమిలి వరకు విస్తరించి ఉన్న ఒక సుందర నగరం.
ఆంధ్ర రాష్ట్రానికే, ఆర్థిక రాజధానిగా బాసిల్లుతున్న నగరం.
దక్షిణాన పరవాడ నుంచి అచ్యుతాపురం వరకు,
వందల కొద్ది విస్తరించి ఉన్న ఫార్మా కంపెనీలు,
మెడ్ టెక్ జోన్లు, బ్రాండిక్స్ వగైరా కంపెనీలు,
దానికి ముందే ఉన్న ఎన్టిపిసి సింహాద్రి పవర్ ప్లాంట్,
అచ్చుతాపురానికి ఉత్తరాన ఉన్న, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్,
దానికి అనుకునే ఉన్న గంగవరం పోర్టు,
ఆ తర్వాత, విశాఖపట్నం పోర్టు, షిప్పియార్డు, డాక్ యార్డ్,
జింకు, బిహెచ్పివి, బీహెచ్ఈఎల్,
ఇవన్నీ కాకుండా ఈస్టర్న్ నావెల్ బేస్, విశాఖ కే ఒక వెన్నెముక.
విశాఖ మధ్యలో మకుటాయమానంగా శోబిల్లుతున్న ఆంధ్ర యూనివర్సిటీ. ఎందరో ప్రతిభావంతులను దేశానికి అందించిన విద్యామతల్లి.
పడమర దిక్కున కొలువైన సింహాచల
నృసింహ క్షేత్రం, ఉత్తరాంధ్ర ఇలవేల్పు.
టూరిజానికి హంగులద్ధిన, ఋషికొండ, తోట్లకొండ, బావికొండ, కైలాసగిరి కొండ, సొగసులు చూడ తరమా?
విశాఖ కే మణిహారం లా ఉండే బీచ్ రోడ్డు, యారాడ బీచ్ నుండి మొదలు, ఆర్కే బీచ్, ఊడా పార్కు ,అప్పూఘర్, తెన్నేటి పార్కు ,సాగర్ నగర్ లు, మరియు ఋషికొండ బీములిబీచ్లు విశాఖ టూరిజానికి వన్నె తెచ్చేవే కదా!
కొండలపై నెలకొన్న మిలీనియం టవరు మరియు ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు, మరియు రావడానికి సిద్ధంగా ఉన్న అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, డాటా సెంటర్లు, ఆంధ్రాలో, సాఫ్ట్వేర్ చదువుకున్న విద్యార్థులకు ఏకైక డెస్టినేషన్ ముందు ముందు విశాఖపట్నమే కదా?
రామానాయుడు ఫిలిం సిటీ, మరియు ఇతర సినీ పరిశ్రమకు కావలసిన హంగులు అన్నీ ఇక్కడే కదా కొలువై ఉన్నాయి. నటీనట సాంకేతిక వర్గం అంతా ఇక్కడి వారే అయ్యుండి, వారికి సరైన మార్గదర్శకం లేకనే కదా ముందడుగు పడటం లేదు.
ఈ కారిడారంతా కలుపుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం గావించినట్లయితే ఎంత సర్వీస్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది.
విశాఖ నుండి కాకినాడ తీరం వరకు విస్తరించే పెట్రో కెమికల్ కారిడార్లు, ఎంత ఉద్యోగాల సృష్టి కల్పిస్తుంది.
భాజపా వారు దయ తలిస్తే, వచ్చే రైల్వే జోన్ వల్ల ఎన్ని అవకాశాలు వస్తాయి...
ఇవి కాక ఎన్నెన్నో యూనివర్సిటీలు, హాస్పిటల్స్ కలిగిన విశాఖ దేనిలో వెనకబడింది🤔🤔🤔
ఏమీ లేని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, మధ్య వెలసిన అమరావతి అనబడే రాజధానిని చూసి,
"విశాఖ" అసూయ పడుతోందా?
అందరి ఆమోదంతో అందరికీ అందుబాటులో రాష్ట్రానికి మధ్యలో, 8 సంవత్సరాల క్రితం ఏర్పడిన రాజధానిని, నాయకులు రేపే ప్రాంతీయ విద్వేషాలతో, రాజధానిని విశాఖకు తరలించకపోతే మేమెంతో వెనుకబడి పోతాం అనే సెంటిమెంటు మాటల ప్రయోగంతో ,
మూడు ముక్కలాటకు వంత పాడటం సబబేనా?
గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ఎవరైనా, మధ్య కోస్తా ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమ అయినా, లేక ఉద్యోగం కల్పన ఐనా ఇదివరలో జరిగిందా?
అందరి ఆమోదయోగ్యంతో పెట్టబడిన రాజధానిలో, నాలుగు ప్రైవేటు యూనివర్సిటీలు, అది మేము ఇచ్చిన భూములలో ఏర్పాటు చేయడం , దానివల్ల మేమేమైనా ఎత్తుకుపోతామా?
రాష్ట్రంలోని పిల్లలకు, పక్క రాష్ట్రాలకు పోకుండా మెరుగైన విద్య అందుతుందనే కదా!
మా దగ్గర సేకరించిన భూములు కొంత తక్కువ రేట్లో ఇచ్చి,నాలుగు ప్రైవేట్ స్పెషలైజేడ్ హాస్పిటల్స్ కడతామంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుందనే కదా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ , అమెరికన్ హాస్పిటల్ ,బి ఆర్ శెట్టి హాస్పిటల్స్ లాంటివి ,నాలుగు వస్తే అందరికీ హైదరాబాదు పరిగెత్తే పని లేకుండా అందుబాటులో ఉంటాయి అనే కదా!
వీటికి తోడు రాజధాని లో, సర్వీస్ సెక్టార్ లాగా కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే, రాజధాని లో కూడా కొంత సివిక్ లైఫ్ పెరిగి ఆదాయ మార్గాలు వస్తాయనే కదా!
ప్రజాధనం వృధా కాకుండా, మరి యొక ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగితే రాష్ట్ర ప్రజలకే కదా ఆదాయ మార్గాలు పెరిగేది.
అమరావతిలో జరిగే ఈపాటి గ్రోత్, విశాఖకు ఏ విధంగా నష్టం కలిగిస్తుంది, విశాఖ గ్రోత్ కి
అమరావతి అభివృద్ధికి సంబంధం ఏముంది.
కాబట్టి ఆంధ్రులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఏది ఎక్కడ ఉంటే సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందో, అది అలా జరిగినప్పుడే భావితరాల భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది.
ఈ మూడు ముక్కలాట ఆడే వారి ప్రలోభాలకు గురై ఆంధ్ర రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయకండి.🙏