NRI TDP Germany

NRI TDP Germany Political Party

రోడ్లు బాగయ్యాయి.రాజధాని ఒక రూపు వస్తోందిసాగునీటి ప్రాజెక్టులు గాడిన పడ్డాయి..వెలిగొండ పూర్తయింది, పోలవరం పూర్తవబోతోంది....
05/09/2026

రోడ్లు బాగయ్యాయి.
రాజధాని ఒక రూపు వస్తోంది
సాగునీటి ప్రాజెక్టులు గాడిన పడ్డాయి..వెలిగొండ పూర్తయింది, పోలవరం పూర్తవబోతోంది.
వచ్చే ఏడాది వర్షాలు బాగా పడతాయి.
పరిశ్రమలు, పెట్టుబడులు అయితే చెప్పే పని లేదు.

ఏపీ ఈజ్ రైజింగ్..

మనల్ని చూసి హేళన చేసే వాళ్ళ నోరు మూయిస్తున్నాం అనే ఎమోషన్ ప్రజల్లో క్రియేట్ అవ్వాలి. అది ఎవరి బాధ్యత ? అధికారంలో ఉన్న పార్టీలే ఆ ఎమోషన్ని డ్రైవ్ చేయాలి. 2024 ఎన్నికల్లో రాష్ట్రం ఎక్కడ నాశనం అవుతుందో అనే భయంతో ఓట్లు వేశారు..అక్కడ భయం అనే ఎమోషన్ ప్లే అయింది. ఇప్పుడు భరోసా అనే ఎమోషన్ ప్లే అవ్వాలి.

ప్రాబ్లెమ్ ఏంటంటే భయానికున్న తీవ్రత భరోసాకి ఉండదు. అధికారుల్ని, సర్వేలను, నెంబర్లను నమ్ముకుంటే పని జరగదు..పార్టీ, ఎన్నికలు అనేవి మన దేశంలో ఎమోషన్ మీద నడుస్తాయి, నెంబర్ల మీద కాదు..

అవతలోడు సరైనోడు కాదు కాబట్టి మనకి నడుస్తుంది. అది మన గొప్పదనం కాదు..

ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయమే ఉంది. ఒక నినాదం, ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి..మనం నిలదొక్కుకున్నాం అనే దానికి. IAS లని అడిగితే ఏపీ రైజింగ్ లాంటివే చెప్తారు.. ప్రజల్లోకి వెళ్లాలంటే గుండెల్లో నుండి రావాలి, పెన్నుల్లో నుండి కాదు.

ఈ స్ట్రాటజిస్టులు, సెఫాలజిస్టులు, కన్సల్టెంట్స్ వీళ్ళంతా ఎమోషన్ నీ ప్రజలకు తీసుకెళ్ళే వాహనాలు మాత్రమే.

ఎమోషన్ రావాల్సింది.మాత్రం నాయకుడి నుండే.. నాయుడి నుండే..

 #అసలు_ఎవరీ_సజ్జల_రామకృష్ణారెడ్డి 🟥🇱🇸     నిన్నటి విజయసాయి రెడ్డి బహిరంగ లేఖలో.. వైసీపీ పార్టీని పూర్తిగా control చేస్తు...
02/09/2026

#అసలు_ఎవరీ_సజ్జల_రామకృష్ణారెడ్డి 🟥🇱🇸
నిన్నటి విజయసాయి రెడ్డి బహిరంగ లేఖలో.. వైసీపీ పార్టీని పూర్తిగా control చేస్తుంది సజ్జల రామక్రిష్ణ రెడ్డే అని, జగన్ రెడ్డి కేవలం సజ్జల రామక్రిష్ణ చేతిలో కీలుబొమ్మ అని.. స్పష్టంగా చెప్పాడు.. పార్టీలో అన్నీ తానై నడిపిస్తూ, జగన్ రెడ్డిని చివరికి సొంత కుటుంబ సభ్యులు కూడా,, చీకొట్టి వెళ్ళిపోవడానికి, సజ్జల ఏ విధంగా కారణం అయ్యాడో వివరించాడు...
మొత్తం వ్యవహారం చూసినవాళ్లకు.. జగన్ రెడ్డి సజ్జల చేతిలో కీలుబొమ్మ ఎందుకు అయ్యాడు..?? అసలు సజ్జలకు ఇంత power ఉండడానికి కారణం ఏమిటి..?? అసలు ఎవరీ సజ్జల రామకృష్ణా రెడ్డి..?? అనే అనుమానాలు కలగకపోదు..
👉 ఆ ప్రశ్నలకు సమాధానం వివరిస్తాను..
✅ సజ్జల రామకృష్ణా రెడ్డి గురించి బయట తక్కువగా తెలిసిన నిజాలు.. ✅
సజ్జల ఈనాడు పత్రికలో ఒక సాధారణ విలేకరిగా జీవితాన్ని మొదలుపెట్టి అంచలంచలుగా ఎదిగి, ఇప్పుడు వైఎస్ఆర్సి పార్టీలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు.. అని ఒక అబద్ధాన్ని వైసీపీ కార్యకర్తలలో బాగా ప్రచారానికి పెట్టారు..
కానీ... నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వేల కోట్లకు అధిపతి.. రాజశేఖరరెడ్డికి బినామీలుగా.. అతని కుటుంబం దాదాపు 40 సంవత్సరాల నుంచి మైనింగ్ రంగంలో వ్యాపారం చేస్తూ కొన్ని వేల కోట్లు సంపాదించింది..
▪️ రాజశేఖర్ రెడ్డి మానసపుత్రుడు సజ్జల రామక్రిష్ణ▪️
రాజశేఖరరెడ్డికి ఏకైక పుత్రుడు జగన్ రెడ్డి కాగా.. మరో ఇద్దరు మానసపుత్రులు ఉన్నారు.. 1. గాలి జనార్ధన్ రెడ్డి 2. సజ్జల రామక్రిష్ణ రెడ్డి.. 2004 లో అధికారంలోకి వచ్చాక వీరిద్దరినీ అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాడు వైఎస్సార్..
తన తండ్రి రాజారెడ్డి ద్వారా మైనింగ్ రంగంలో సంపాదించిన సొమ్ముతో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతూ MLA స్థాయికి ఎదిగిన రాజశేఖర్ రెడ్డి.. 2004 ఎన్నికల సమయానికి కూడా కేవలం లక్షల్లోనే tax లు కట్టినట్టు వారి election affidavit ల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.. కానీ 2009 ఎన్నికల సమయానికి.. ఇటు రాజశేఖరరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, అక్కడ గాలి జనార్ధన్ రెడ్డి వందల కోట్ల advance tax కట్టే స్థాయికి ఎదిగారు.. వీరి ఈ rapid growth కు కారణం.. Mining Mafia .
▪️రాజశేఖరరెడ్డి Mining Mafia ను నడిపింది సజ్జల కుటుంబమే▪️
సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ముగ్గురు అన్నదమ్ములలో సజ్జల రామకృష్ణారెడ్డి మూడవ వాడు.. పెద్ద సోదరుడు రామసుబ్బారెడ్డి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMDC) లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందించి 1980లలో రిటైర్ అయ్యాడు.. ఈయన దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఖనిజ వనరుల మీద, మైనింగ్ మీద పూర్తి అవగాహన ఉన్న సుప్రసిద్ధ జియాలజిస్ట్ గా పేరుగాంచిన వ్యక్తి... రెండో సోదరుడు దివాకర్ రెడ్డి.. ఈయన కూడా జియాలజి గ్రాడ్యుయేట్.. మైనింగ్ లో మంచి పట్టు ఉన్న వ్యక్తి..
రాజారెడ్డి వీరిద్దరినీ చేరదీసి.. వీరి సహాయంతో మైనింగ్ వ్యాపారాన్ని విస్తరించాడు.. సజ్జల సోదరుల పేరుతో రాజశేఖరరెడ్డి కుటుంబం Sajjala Iron and Steel company ltd. మరియు Red Gold Enterprises పేర్లతో రెండు మైనింగ్ కంపెనీలు పెట్టించి, నడిపించేది..
▪️2004 లో CM గా YSR.. దోపిడీ కథ మొదలు..▪️
2004 లో CM పదవి దక్కడంతో.. రాజశేఖరరెడ్డి తాను అప్పటికే ఉన్న మైనింగ్ వ్యాపారంతోనే,, లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రణాళిక అమలు చేశాడు.. అందుకోసం తన మానసపుత్రులైన గాలి జనార్ధన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డిలను రంగంలోకి దింపాడు..
✅ సజ్జల కుటుంబానికి ఓబులాపురం అక్రమ మైనింగ్ లో వాటా.. ✅
రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఓబులాపురం గనులను ఏ విధంగా గాలి జనార్ధన్ రెడ్డికి దోచి పెట్టాడో తెలిసిందే.. దాని మీద ఇప్పటికీ వివాదం నడుస్తూనే ఉంది.. (దోచి పెట్టిన విధానాలు GO లతో సహా రాయమంటే కామెంట్లలో తెలియజేయండి.. ఒక పోస్టుగా రాస్తాను)..
2007 లో.. రాజశేఖరరెడ్డి బినామీలు అయిన సజ్జల కుటుంబ కంపెనీ Red Gold Enterprises కు, గాలి జనార్ధన రెడ్డి కి చెందిన ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (OMC) కు ఒక కీలక ఒప్పందం జరిగింది.. దాని ప్రకారం.. OMC నిర్వహించిన తవ్వకాల్లో 50% ముడి ఇనుము ఈ Red Gold Enrerprises కి కేవలం 5% appreciation ధరతో ఇవ్వబడుతుంది.. దాని అర్థం.. ఓబులాపురం అక్రమ మైనింగ్ లో 50% వాటా సజ్జల కంపెనీకి దక్కింది..
అంటే... ఓబులాపురం అక్రమ మైనింగ్ లో లాభాలను తన మానసపుత్రులు గాలి జనార్ధన్ రెడ్డి, మరియు సజ్జల రామకృష్ణా రెడ్డికి తలో 50% వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు రాజశేఖర్ రెడ్డి.. సజ్జల కంపెనీలకు ఆ విధంగా అక్రమ మైనింగ్ నుండి వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని,, RR Global అనే ఒక suitcase company ద్వారా, సాక్షి మీడియాకు మళ్ళించాడు రాజశేఖర్ రెడ్డి.. ఈ అంశాలన్నీ గాలి జానార్ధన్ రెడ్డి కేసుకి సంబంధించిన CBI ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది..
✅ సాక్షి స్థాపన నుండి జగన్ రెడ్డికి రాజకీయ Care Taker గా సజ్జల ✅
సాక్షి లో పెట్టుబడులు పెట్టాక.. ఈ RR గ్లోబల్, Sajjala Iron and Steel కంపెనీలు వ్యాపారాలు ఆపేసుకుని కనుమరుగు అయిపోయాయి.. అంటే.. సజ్జల రామకృష్ణ రెడ్డికి, రాజశేఖరరెడ్డి ఇచ్చిన టాస్క్ అక్కడితో complete అయిపోయింది అన్నమాట..
ఇక్కడ నుండి సజ్జల రామకృష్ణ రెడ్డి,, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా రాజశేఖర్ రెడ్డి కుటుంబ రాజకీయ వ్యవహారాలు manage చేయడం మొదలుపెట్టాడు..
✅ జగన్ రెడ్డి ఎందుకు కీలుబొమ్మగా ఉంటున్నాడు..?? ✅
రాజశేఖరరెడ్డి Prime phase లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి.. ఆకతాయిగా తిరిగే కుర్రాడిగా ఉన్నాడు.. చదువుకోమని విదేశాలకు పంపితే తిరుగుటపాలో వచ్చేశాడని, బొత్తిగా చదువు మీద ధ్యాస లేదు అని,, రాజశేఖరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాడు..
తన తాత రాజారెడ్డి లాగా ఎప్పుడూ గొడవలు కొట్లాటలలో తిరిగేవాడు.. చివరికి 25 సంవత్సరాల వయసు వచ్చాక హైదరాబాద్ లో ఒక ఊరుపేరు లేని కాలేజీలో B.Com చదువుతో సరిపెట్టాల్సి వచ్చింది.. రాజశేఖరరెడ్డికి జగన్ రెడ్డి మీద చాలా అపనమ్మకం ఉండేదనీ,, దీనితో వీరిద్దరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరిగేవి అనేది, చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు కూడా..
దానితో రాజశేఖరరెడ్డి అక్రమ వ్యాపారాలు మరియు రాజకీయ వారసత్వం విషయంలో జగన్ రెడ్డికి ఉన్న పరిజ్ఞానం సరిపోదు అని భావించి.. అతనికి Custodian గా సజ్జల రామకృష్ణ రెడ్డిని నియమించాడు.. దాంతో ఏ వ్యవహారంలో కూడా జగన్ రెడ్డికి కనీస అవగాహన ఉండేది కాదు.. ఎవరు ఏ విషయం గురించి అడిగినా.. "సజ్జల అన్న దగ్గరకు వెళ్ళండి" అని,, సజ్జల వైపు చెయ్యి చూపించడమే జగన్ రెడ్డికి 20 ఏళ్లుగా అలవాటుగా మారింది..
👉👉 ఇప్పుడూ అదే అలవాటు కొనసాగుతుంది. 👈👈
వైసీపీ పార్టీ విషయంలో కూడా జగన్ రెడ్డి తన 20 సంవత్సరాల కీలుబొమ్మ పాత్రే కొనసాగిస్తున్నాడు.. ప్రతీ విషయంలో సజ్జల మీదనే ఆధారపడ్డాడు.. 5 సంవత్సరాల పాలన కూడా, సజ్జల తోనే చేయించాడు.. అతన్ని ఎవరు కలవడానికి వెళ్ళినా.. అలవాటు ప్రకారం "సజ్జల అన్న దగ్గరకు వెళ్ళండి" అంటూ పంపించేసాడు.. పార్టీలో అన్నీ కీలక నిర్ణయాలు సజ్జల తీసుకుంటే, జగన్ రెడ్డి గుడ్డిగా సంతకం పెట్టడం మాత్రమే చేశాడు.. మంత్రుల నియామకాలు, మార్పులు, పార్టీ నాయకులు, కమిటీలు.. అన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డే manage చేశాడు..
జగన్ రెడ్డిలో సమర్ధత లేకపోవడం వల్లనే.. సజ్జల రామకృష్ణా రెడ్డి మీద ఆధారపడి నెట్టుకురావాల్సిన పరిస్తితి.. కాబట్టే అతను సజ్జల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు..
✅ విజయసాయి రెడ్డి చెప్పినట్టు.. వైసీపీకి నిజమైన బాస్ సజ్జల రామకృష్ణా రెడ్డే.. జగన్ రెడ్డి కేవలం ఉత్సవ విగ్రహం మాత్రమే.. ✅

కడప ఎంపీ గారి నివాసంలో 24 లక్షల కరెన్సీ కట్టలు సీజ్... చుట్టుముడుతున్న ఈడీ ప్రశ్నలు! స్వాధీనం చేసుకున్న రెండు లాకర్లలో ఏ...
21/08/2026

కడప ఎంపీ గారి నివాసంలో 24 లక్షల కరెన్సీ కట్టలు సీజ్... చుట్టుముడుతున్న ఈడీ ప్రశ్నలు! స్వాధీనం చేసుకున్న రెండు లాకర్లలో ఏముందో?

​వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు తీవ్ర రూపం దాల్చింది. హైదరాబాద్, కడప వ్యాప్తంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసాలు మరియు వారి అనుచరుల ఇళ్లపై ఒకేసారి జరిగిన ఈడీ సోదాలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించాయి.

​ఈ విచారణలో అత్యంత కీలకమైన అంశం — ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్కచూపని రూ. 24 లక్షల నగదు సీజ్ కావడం మరియు రెండు రహస్య లాకర్ల తాళాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం!

వివేకా హత్య వెనుక రూ. 4 కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయని, దానికి సంబంధించి భారీ ఎత్తున నిధుల మార్పిడి జరిగిందని సీబీఐ ఇప్పటికే తమ చార్జ్‌షీట్లలో పొందుపరిచింది. ఆ ఆధారాల ప్రాతిపదికన PMLA (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కింద రంగంలోకి దిగిన ఈడీ, సీజ్ చేసిన నగదు మరియు దొరికిన కీలక పత్రాలతో విచారణను కీలక మలుపు తిప్పింది.

​ప్రజాప్రతినిధి నివాసంలో సీజ్ అయిన ఆ రూ. 24 లక్షల నగదు ఎక్కడి నుండి వచ్చింది? దానికి సంబంధించిన సరైన ఆధారాలు చూపడంలో ఎంపీ విఫలమయ్యాడు.

​స్వాధీనం చేసుకున్న రెండు లాకర్లలో దాగిన ఆస్తులు లేదా పత్రాలు ఏమిటో?

​సోదాల్లో రికవరీ చేసిన హార్డ్ డిస్క్‌లు, మొబైల్ పరికరాల్లో దాగివున్న డేటా ద్వారా ఎవరెవరి మధ్య లావాదేవీలు సాగాయో ఈడీ విశ్లేషిస్తోంది.

ఇన్నాళ్లూ చార్జ్‌షీట్లు, వాంగ్మూలాలకే పరిమితమైన ఈ కేసులో, ఇప్పుడు ఆధారాలతో సహా లభించిన నగదు మరియు లాకర్ల సీజింగ్ అవినాష్ రెడ్డికి గండంగా మారింది. ఏళ్లుగా నడుస్తున్న ఈ కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న సాక్ష్యాధారాలు అసలు నిజాలను బయటకు తీస్తాయా లేదా అనేది వేచి చూడాలి. #చాకిరేవు

14/08/2026

జగన్ కి చంద్రబాబు కి ఒక చిన్న తేడా చెప్తాను

తాడేపల్లి లో జగన్ ఇంటి పక్కన హెలిప్యాడ్ కోసం రెండు ఎకరాలు పొలం అవసరమైంది ఆ రైతు ఒప్పుకోలేదు జగన్ వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ రైతును బెదిరించి లాక్కున్నాడు

అతను టిడిపి రాగానే చంద్రబాబునాయుడు కి ఫిర్యాదు చేశాడు బాబు ఆశ్చర్యపోయాడు ఆ సమస్య పరిష్కరణ జరిగిందా లేదా కూడా తెలియదు

చంద్రబాబు నాయుడు అమరావతికి మెయిన్ కనెక్టివిటీగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డంగా ఉన్న 60సెంట్లు భూమిని నిర్మలారెడ్డి అని ఒక రైతు ఇప్పటికి ఇవ్వలేదు బల ప్రయోగం చేసి లాక్కోవడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు కానీ

చంద్రబాబు నాయుడు అన్నీ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చేసి ఆమెకు రావాల్సిన నష్టపరిహారాన్ని కోర్టులో ఇటు నుంచి తీసుకునేలాగా చేసి ఆ హైకోర్టు కూడా ఆ పొలం ప్రభుత్వం తీసుకోవచ్చు అని తీర్పు చెప్పిన తర్వాత మాత్రమే పనులు ప్రారంభించాడు

ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నవాళ్లు వెజినరీ మనస్తత్వం ఉన్న వల్ల కి తేడా అది

ఈ ఫోటోలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మూడు అద్భుతాలు ఒకేసారి కనిపిస్తున్నాయి.1: కేవలం 27 రోజుల్లో పూర్తయిన బ్రిడ్జిలు – స...
12/08/2026

ఈ ఫోటోలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మూడు అద్భుతాలు ఒకేసారి కనిపిస్తున్నాయి.

1: కేవలం 27 రోజుల్లో పూర్తయిన బ్రిడ్జిలు – సీడ్ యాక్సెస్ రోడ్

ఫోటోలో కనిపిస్తున్న కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ మీద నిర్మించిన బ్రిడ్జిలు కేవలం 27 రోజుల్లో పూర్తి చేశారు.
రేపు ప్రారంభం కానున్న Seed Access Road కూడా ఇదే ఫోటోలో కనిపిస్తోంది.

2: కొండవీటి వాగు Lift Irrigation Scheme

ఇది చంద్రబాబు గారి ముందుచూపుకు ఒక మంచి ఉదాహరణ.

కొండవీటి వాగులో వరద వచ్చిన సమయంలో, అదే సమయంలో కృష్ణానదిలో కూడా వరద వస్తే… వాగు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక, వెనక్కి తంతూ పరిసర ప్రాంతాల్లో ముంపు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

అందుకే ముందుగానే Kondaveedu Vagu Lift Irrigation Scheme ఏర్పాటు చేశారు.

కృష్ణానది, కొండవీటి వాగులో ఒకేసారి వరద వచ్చినప్పుడు ఈ Lift ద్వారా కొండవీటి వాగులోని నీటిని ఎత్తి బయటకు తరలించే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో, కొండవీటి వాగు నీటిని Guntur Channel వైపు మళ్లించే ఏర్పాట్లు కూడా చేశారు.

అంటే వరదను కేవలం ఎదుర్కోవడం కాదు… వరద నీటిని ఎలా నిర్వహించాలి అన్నదానిపై ముందే ఆలోచించడం.

3: కృష్ణానది – పట్టిసీమ అద్భుతం

ఫోటోలో కుడివైపున కనిపిస్తున్నది కృష్ణానది.కానీ నీరు మాత్రం గోదావరి రెడ్ colour లో ఉన్నాయి

శ్రీశైలం ఇంకా నిండాలి… నాగార్జునసాగర్ నిండాలి… పులిచింతల నిండాలి… ఆ తర్వాతే ప్రకాశం బ్యారేజీకి కృష్ణా జలాలు రావాల్సిన పరిస్థితి.

కానీ పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తీసుకువచ్చి, ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టా ప్రాంతంలోని లక్షలాది ఎకరాలకు నీరు అందించే వ్యవస్థను చంద్రబాబు తీసుకొచ్చారు.

ఒకే ఫోటోలో మూడు అద్భుతాలు కనిపించాయి.

ఇదే అభివృద్ధి అంటే. ఇదే ముందుచూపు అంటే.

01/08/2026

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది.







*APNRT నుంచి రీజినల్ కోఆర్డినేటర్స్ గా నియమితులు అయిన అందరికీ శుభాకాంక్షలు**నార్తర్న్ యూరోప్ రీజినల్* కోఆర్డినేటర్లుగా న...
19/07/2026

*APNRT నుంచి రీజినల్ కోఆర్డినేటర్స్ గా నియమితులు అయిన అందరికీ శుభాకాంక్షలు*

*నార్తర్న్ యూరోప్ రీజినల్* కోఆర్డినేటర్లుగా నియమితులైన వన్నం ప్రవీణ్ కుమార్, వేణు మాధవ్ పోపూరి, జగన్మోహన్ రెడ్డి ముతుముల, సురేష్ వరికూటి, కృష్ణప్రసాద్ కట్రగడ్డ, కురపాటి శివరాం మరియు భాను ప్రకాష్ వుళ్ళంకి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

​అలాగే *సెంట్రల్ & సదరన్ రీజినల్ కోఆర్డినేటర్లుగా* నియమితులైన కుడితిపూడి శ్రీకాంత్ మరియు నరేష్ కోనేరు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు!

తెలుగు ప్రజల మెదళ్లలో ప్లాంట్ చేయబడిన అతి పెద్ద అబద్ధంఫీజు రియంబర్స్మెంట్ పథకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చాడని❎👉✅ నిజం ఏ...
09/07/2026

తెలుగు ప్రజల మెదళ్లలో ప్లాంట్ చేయబడిన అతి పెద్ద అబద్ధం

ఫీజు రియంబర్స్మెంట్ పథకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చాడని❎

👉✅ నిజం ఏమిటంటే... ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.. నారా చంద్రబాబు నాయుడు గారు..

జూలై 2002 సంవత్సరం GO.MS. 90 (సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్) ద్వారా,, private కాలేజీల్లో చదివే, B-Tech, M-Tech, BSC, MSC, BCom, MCom, MBA, MCA లాంటి కోర్సులు చదువుకునే SC, ST లకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అయ్యే విధంగా పథకాన్ని ప్రవేశ పెట్టాడు..

( ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేవారికి స్కాలర్షిప్ లు 1970 నుండే అమల్లో ఉన్నాయి..)

👉 2004 లో నుండి BCలను కూడా ఈ పథకంలో చేరుస్తారు అని పేర్కొన్నారు

🚫 రాజశేఖరరెడ్డి 2004 లో అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఆపేశాడు మళ్ళీ ఒత్తిడి పెరగడంతో 2007 సంవత్సరంలో ఇదే పథకంలో పునఃప్రారంభం చేసి, BC లను, 2008 సంవత్సరం నుండి OC లను చేర్చాడు.. ▪️

అంటే పథకం రూపకల్పనతో ఏ సంబంధం లేని వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పటిదాకా లక్షల మంది చదువులకు క్రెడిట్ తీసుకున్నాడు

02/07/2026

3 ప్రాంతాలలో 3 రాజధానులు అయిపోయాయి !
1 ప్రాంతంలోనే ఉన్న 3 ఊర్లను రాజధాని అంటున్నాడు !!

ఒక్కసీటు కూడా ఇవ్వని కోస్తా ప్రాంతంలో.. కనీసం బోణీ అయినా కొట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు !!

మాట తప్పం - మడమ తిప్పం 1 :
2019 కి ముందు... రాజధానిని ఎక్కడికీ తరలించం, అమరావతిలోనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకుని ఉంటున్నా !

మాట తప్పం - మడమ తిప్పం 2 :
2019 లో ముఖ్యమంత్రి అయ్యాక... అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా (pls note that పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా కాదు) 3 ప్రాంతాల్లో 3 రాజధానులు !!

మాట తప్పం - మడమ తిప్పం 3 :
2022 లో రాజధానిని మార్చడం, విభజించడం లేదా 3 ప్రాంతాలకు తరలించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని హైకోర్టు 3 రాజధానులు చట్టం రద్దు చేసిన తరువాత... విశాకే మన రాజధాని !!

మాట తప్పం - మడమ తిప్పం 4 :
2024 లో 11 సీట్లతో ఘోర ఓటమి చెందిన తరువాత & 2026లో అమరావతే రాజధానిగా కేంద్రం గెజిట్ నోట్ విడుదల చేసిన తరువాత... మచిలీపట్నం, విజయవాడ,గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా చేస్తాం !!

ఒక్కసారి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాక మళ్ళీ పొందాలంటే... అదేమీ సూపర్ మార్కెట్ లో దొరికే సరుకు కాదు బాసు !!

05/05/2026

మినీ మహానాడు జర్మనీ 2026. 🚲✌️🥳

Date & Time: 06-06-2026, 9:00 onwards
Venue: Borschtallee 26, 80804 Munich

Adresse

Munich

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von NRI TDP Germany erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Verknüpfungen

Teilen