Bring Babu Back

Bring Babu Back సమాజ అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం.

20/08/2022

మిత్రులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు నమస్కారాలు..

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతో మంది కార్యకర్తలను వీపు మీద కొట్టారు, పొట్ట మీద కొట్టారు, జీవితాల మీద కొట్టారు..
అయినా సరే మొక్కవోని ధైర్యంతో మీరు ఎదురొడ్డి నిలిచిన తీరు ప్రశంసనీయం..

మీ త్యాగానికి ప్రతిఫలం అందాలన్నా మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నా మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలి..

అందుకోసం మనం అంతా కలిసికట్టుగా పని చేసే సమయం ఆసన్నమైంది..

మనవంతు సహకారానికి తదుపరి కార్యాచరణ ఎలా చేస్తే బావుంటుంది అనేదానికి మీ నుంచి విలువైన అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి..

జై తెలుగుదేశం
జై చంద్రబాబు

27/04/2022

ముఖ్యమంత్రి గారికి, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సూచన..

పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు అసలు బస్సులే తిరగని బస్సు ప్రయాణాలు ఉచితం అని ప్రచారం చేసుకోవటం కాదు..

కనీసం పరీక్షలు పూర్తి అయ్యే వరకైనా వాళ్ళ చదువుకు ఇబ్బంది లేకుండా *కరెంటు కోతలు లేకుండా* ఇవ్వండి.. ఇప్పుడు అది చాలా అవసరం..🙏

ఇట్లు..

మిమ్మల్ని ఏరి కోరి నెత్తిన పెట్టుకున్న సామాన్యుడు



02/01/2022

Please Write the review about this page... 👍
Good or bad.. tell us the truth..

03/12/2021

ఆర్నెలల్లో ఉత్తమ CM అనిపించుకుంటానని Y.S. Jagan సాధించిన ఘనతలివీ

➤పక్కరాష్ట్రాల వెక్కిరింపులు
➤న్యాయస్థానాల ఈసడింపులు
➤సంస్థల బహిష్కరణలు
➤పెట్టుబడుల ఉపసంహరణ,నిరాసక్తత
➤బ్యాంకులకు రుణ గ్రస్తం
➤ప్రజలకు భారం
➤అభివృద్దికి దూరం
➤పడకేసిన పాలన


 #రైతు_గెలిచాడు..👏మొత్తానికి దేశ ప్రజలు గెలిచారు..ప్రజాస్వామ్యం గెలిచింది... కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక...
19/11/2021

#రైతు_గెలిచాడు..👏

మొత్తానికి దేశ ప్రజలు గెలిచారు..
ప్రజాస్వామ్యం గెలిచింది...
కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటుందని ప్రధాని అధికారికంగా ప్రకటించారు..
రైతులకు క్షమాపణ చెప్పారు..
సంవత్సరం పైగా కరోనా, ఎండ, వాన వంటివి లెక్క చెయ్యకుండా పోరాడిన రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వందలాది రైతులకు నివాళి. 🙏
వారికి మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు..😊

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా పాలకులు కళ్ళు తెరిచి తాము చేసిన తప్పులను తెలుసుకుని క్షమాపణ చెప్పి అమరావతి ఉనికి నిలబెడతారని ఆశిస్తున్నా..🙏




07/11/2021

అంతమంది సలహాదారులు అవసరమా.. 🤔

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి..
అందులో ప్రధానమైన నిర్ణయం ప్రభుత్వ సలహదారుల నియామకం.. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 60 మంది సలహదారుల నియామకం చేపట్టారు..
అయితే ఇలా ప్రజల సొమ్ముతో నెలకు 2 లక్షల పైగా జీతం తీసుకుంటున్న సలహదారుల వలన ఎంతవరకు ఉపయోగం కలుగుతుంది..
అసలు అంతమంది సలహాదారులు అవసరమా..
డబ్బులు లేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేసేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి జీతాలు చెల్లించటం అవసరమా..
నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయా లేక కోరి తెచ్చుకున్నారా..
పోనీ కరోనా సమయంలో సంక్షేమ పథకాలు కొనసాగించి ప్రజలను ఉద్ధరించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విపత్తుల నిర్వహణ పధకం క్రింద వచ్చాయని, ఆ నిధులతో పాటు ప్రజలమీద అధికంగా అనేకరకాలైన పన్నులు మోపి వచ్చిన డబ్బులను కూడా పక్కదారి పట్టించి కేవలం సంక్షేమ పథకాలను కొనసాగించటం ఎంతవరకు సమంజసం..
ఒక రాష్ట్ర భవిష్యత్తు బాగుపడటానికి పెట్టుబడులను ఆకర్షించి కొత్త ఉద్యోగాలను కల్పించడానికి ఒక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తే సరిపోతుందా.. అభివృద్ధి అక్కర్లేదా..
నిజంగా పైసా పైసా కోసం అంతగా ఆలోచిస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టేందుకు చేసే ప్రయత్నాల కన్నా ఆర్థికవ్యవస్థని గాడినపెట్టేందుకు ఒక్క దిద్దుబాటు చర్యనైనా చేపట్టిందా..
మూలిగిన నక్కమీద తాటికాయ పడ్డట్లు ఇంకా ఈ సలహదారుల నియామకం, కార్పొరేషన్ల ఏర్పాటు లాంటి చర్యలు ప్రజలకు ఉపయోగపడకపోగా తిరిగి రాష్ట్ర ఆర్థికవ్యవస్థని అతలాకుతలం చేయటం వాస్తవమే కదా..
అమరావతిని బూచిగా చూపించి గత ప్రభుత్వం మీద నిందలు వేయడంలో సఫలీకృతం అవుతున్న ప్రభుత్వం అదే అమరావతిలో గత ప్రభుత్వం చేపట్టిన కార్యాలయాలనుంచి పాలన సాగించటంలేదా..
ఒక రాజధానిని నిర్మించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం మూడు రాజధానలంటూ ఎందుకు ప్రకటించింది.. ప్రజలను తప్పుదారి పట్టించటానికే కదా..
ప్రజలకోసం అంతగా ఆలోచిస్తున్నట్లు ప్రగల్భాలు పలికే ప్రభుత్వం చేపడుతున్న దిద్దుబాటు చర్యలు ఇవేనా..

చివరగా ఒక విషయం..
అమరావతి నిర్మాణం అనేది ప్రజా ప్రయివేటు ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా నిర్మించాలని గత ప్రభుత్వం కార్యాచరణ చేసింది..
దానికి సంక్షేమ పధకాలనే ఆపేసి ప్రభుత్వం వేలకోట్ల పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలేదు..
ఇప్పుడు పెట్టిన పెట్టుబడిని భవిష్యత్తు లో రాష్ట్రానికి ప్రధాన ఆదాయ మార్గంగా మార్చే ప్రజా రాజధాని అమరావతి..🙏

✍️ Surendra nath Gondu



మొదటి అడుగే అపశకునం..9 కోట్ల ఆస్తిని కూల్చటానికి చేతులు ఎలా వచ్చాయో..??ఎందరికో ఆపన్న హస్తం దొరికిన చోటు...ఆ ఘడియ మొదలు ఒ...
19/10/2021

మొదటి అడుగే అపశకునం..

9 కోట్ల ఆస్తిని కూల్చటానికి చేతులు ఎలా వచ్చాయో..??

ఎందరికో ఆపన్న హస్తం దొరికిన చోటు...
ఆ ఘడియ మొదలు ఒక్కటైన శుభం జరిగిందా...??

ఒక్క శ్రామిక వర్గం అయిన కంటి నిండా నిద్ర పోయిందా...??

ఒక్క రైతు అయిన పండించిన పంట సరైన సమయానికి గిట్టుబాటు ధరకు అమ్ముకున్నాడా...??

కోట్లు పెట్టుబడి పెట్టిన ఏ పారిశ్రామికవేత్త అయినా ఒక్కరోజు ధీమాగా గడిపాడా...??

ఇలా చాలా వున్నాయి సమస్యలు ముందు వీటి గురించి ఆలోచించండి..🙏🏻

✍️ శిరీష పొన్నం



Address

Amaravati

Alerts

Be the first to know and let us send you an email when Bring Babu Back posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share