19/08/2026
ఐదేళ్ళలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వడం చేతకాని జగన్, మెగా డీఎస్సీ -2025 గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. మెగా డీఎస్సీ ఎంత పారదర్శకంగా జరిగిందో చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త టీచర్లు చేస్తున్న ఆందోళనలే నిదర్శనం. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడి వింత సైకో చేష్టలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఏళ్ళ తరబడి తాము చేసిన సాధనను, పడిన కష్టాలను జగన్ అవమానించడమే వీళ్ళ ఆగ్రహానికి కారణం. ఎన్నో పేద కుటుంబాలలో తమ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉండింది. కానీ ఇప్పుడు ఆ సంతోషాన్ని దూరం చేయడానికి దుష్టగ్రహంలా కుట్రలు చేస్తున్నాడు జగన్. ప్రజల జోలికి వస్తే చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. ఆయన వెనుక మీరున్నారు. న్యాయం ఉంది. యువశక్తి తోడుంది.