01/04/2024
*ఫించన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13వేల కోట్లు మార్చి 16 - 30 మద్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్ రెడ్డి :- ఇన్చార్జి PVG కుమార్*
ఈ రోజు మాడుగుల నియోజకవర్గం, K కోటపాడు మండలం కేంద్రంలో మాడుగుల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి PVG కుమార్ గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ
👉సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమీషన్, తెలుగుదేశం కాదు
👉ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? ఖజానాలో నిధులు లేకనే కదా?
👉1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్దప్రాతిపదికన ఫించన్లు ఇంటి వద్దే పంపిణీ చేయడం సాధ్యం
👉జగన్ రెడ్డి స్వార్ధ రాజకీయం వల్లే ఫించన్ దారులు, వాలంటీర్లు నష్టపోతున్నారు
👉టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు రూ.4,000 పింఛన్ అందిస్తోంది
👉ఫించన్లు సకాలంలో ఇళ్ల వద్దనే పంపిణీ చేయకపోతే సీఎస్ జవహార్ రెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల కమీషన్ తగు చర్యలు తీసుకోవాలి.
1. లక్షా 35వేల మంది సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లు ఒకటో తారీఖున వారి ఇంటికి చేర్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
2. ఒకటో తారీఖున పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును మరియు జనవరి 23న బటన్ నొక్కిన ఆసరా డబ్బును, ఫిబ్రవరి 16న బటన్ నొక్కిన చేయూత డబ్బును, ఫిబ్రవరి 29న పామర్రులో బటన్ నొక్కిన విద్యా దీవెన డబ్బును, మార్చి 14న బటన్ నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బును, ఆరోగ్య శ్రీకి ఇవ్వాల్సిన నిధులు రూ.13వేల కోట్లు మార్చి 16 నుంచి 30వ తారీషు లోపల అంటే 15 రోజుల్లోనే జగన్రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం దోచిపెట్టాడు. దీంతో పింఛన్ల సొమ్ములు ఇవ్వడానికి నేడు ఖజానాలో సరిపడా నిధులు లేవు.
3. అందుకే తన దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి జగన్రెడ్డి ఎన్నికల కమిషన్పైనా, నిమ్మగడ్డ రమేష్ కుమార్పైన, టీడీపీపైన దుష్ప్రచారం చేయిస్తున్నాడు.
4. వాలంటీర్లు ప్రజా సేవా కార్యక్రమాలకు కాకుండా జగన్రెడ్డి వారిని వైకాపా కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేశాడు. వాలంటీర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగాచేసి వందల మందిని సస్పెన్షన్లకు, వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు జగన్ రెడ్డి కారకుడయ్యాడు.
5. వాలంటీర్లను ప్రజా సేవకులుగా కాక జగన్రెడ్డి తన పార్టీ కార్యకర్తల్లా దుర్వినియోగం పరిచినందునే ఎన్నికల కమీషన్ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టింది.
6. పింఛన్ దారుల పట్ల వైకాపాకు ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ఖజానాలో ఉన్న డబ్బు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేవాడు కాదు. పించన్లకు నిధుల కొరత పెట్టేవాడు కాదు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి కారణం నిధులు కొరతే గాని ఎన్నికల కమీషన్ కాదు. దీనికి రుజువు ఏప్రిల్ 3వ తారీషు నుంచి ఫించన్లు పంపిణీ చేస్తారని మార్చి 28న సాక్షి దినపత్రికలో జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన వార్తను ప్రచురించింది. ఎందుకు ఇలా సాక్షిలో రాశారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే కదా. ఈ వాస్తవాన్ని కప్పిపెట్టి ఎన్నికల లబ్ది కోసం దుష్ప్రచారం చేస్తుంది.
7. వైకాపా కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజాసేవ మాత్రమే చేసే వాలంటీర్లను రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుంది. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్ దారులకు నెలకు రూ.4,000 పెన్షన్లు ఇంటి వద్దకే పంపిణీ చేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు.
8. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి గారు సెర్చ్, సీఈవో మురళీధర్ రెడ్డి గారు ఫించన్ల పంపిణీ సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఈ సమావేశం లో అనకాపల్లి జిల్లా పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు, ఎక్స్ జెడ్పీటీసీ p సత్యవతి, సర్పంచ్ దాడి ఏరుకునాయుడు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ ఇన్చార్జి జురెడ్డి రాము, బీజేపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కొట్టన ఈశ్వరరావు, రాష్ట్ర పార్టీ ఐటిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ పైలా నారాయణ మూర్తి, ఎక్స్ సర్పంచ్ రొంగలి అప్పలనాయుడు, రుద్ర ఈశ్వరరావు, స్వామినాదం, రావాడ రమణ, పల్లి రాజు బాబు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.