Anakapalli District Police

Anakapalli District Police The official handle of ANAKAPALLI DISTRICT POLICE.... Please don't report Crime here. In case of eme ANAKAPALLI DISTRICT POLICE

*గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా అనకాపల్లి పోలీసులు పటిష్ట చర్యలు: సుమారు 3 కోట్ల విలువైన 600 కేజీల భారీ గంజాయి పట్టివేత – ...
03/09/2026

*గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా అనకాపల్లి పోలీసులు పటిష్ట చర్యలు: సుమారు 3 కోట్ల విలువైన 600 కేజీల భారీ గంజాయి పట్టివేత – ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్*

*సమర్థవంతంగా పనిచేసిన అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్*

*అనకాపల్లి, సెప్టెంబర్ 3:* అనకాపల్లి జిల్లాను సంపూర్ణ గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు, నిఘా చర్యలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు తెలిపారు. ఒడిస్సా నుంచి అనకాపల్లి మీదుగా తుని వైపు తరలిస్తున్న 600 కేజీల భారీ గంజాయిని, రవాణాకు ఉపయోగించిన వాహనాలను అనకాపల్లి రూరల్ పోలీసులు సమయస్ఫూర్తితో పట్టుకున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు.

*కేసు పూర్వాపరాలు & నేర విధానం:*
*జైలు పరిచయం – భారీ నెట్‌వర్క్:* పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెంకు చెందిన *A-1 షేక్ మస్తాన్ వలి* గతంలో జి.మాడుగుల PS (Cr.No.7/2023) పరిధిలో గంజాయి కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉండగా, అదే జైలులో ఉన్న నర్సీపట్నానికి చెందిన A-3తో పరిచయం ఏర్పడింది.
*కమీషన్ ఒప్పందం:* ఒడిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ దగుడుపల్లికి చెందిన A-2 నుంచి 600 కేజీల గంజాయిని సమకూర్చి, తుని సమీపంలో తనకు అప్పగిస్తే సరుకు ఖరీదు కాకుండా అదనంగా రూ.3,00,000 కమీషన్ ఇస్తానని A-3 ఒప్పందం కుదుర్చుకున్నాడు.
*రవాణా పన్నాగం:* A-2 వద్ద గంజాయి కొనుగోలు చేసి, A-5 మరియు A-6 (పాంగి రత్నాలు)ల సహాయంతో చెక్‌పోస్టులు తప్పించేందుకు ఒడిస్సా సరిహద్దుల నుండి నడక ద్వారా, మోటార్ సైకిళ్లపై దఫదఫాలుగా తరలించారు. అనంతరం ఆ సరుకును వ్యాన్ (AP39 VA 6786)లోకి లోడ్ చేసి, దానికి పైలట్‌గా హోండా సివిక్ కారు (AP16 BC 0018)ను ఏర్పాటు చేసుకుని తుని వైపు తరలించేందుకు పన్నాగం పన్నారు.
*పోలీసుల మెరుపు దాడి:* పక్కా ముందస్తు సమాచారంతో అనకాపల్లి రూరల్ ఎస్సై, సిబ్బంది రంగంలోకి దిగి అనకాపల్లి మండలం సంపతిపురం జంక్షన్ వద్ద మాటువేసి గంజాయి లోడుతో ఉన్న వ్యాన్‌తో పాటు పైలట్ కారును పట్టుకున్నారు.
*అరెస్ట్ అయిన నిందితులు:*
*​షేక్ మస్తాన్ వలి (A-1)* – ధర్మాజీగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
*షేక్ మదీనా (A-4)*
*పాంగి రత్నాలు (A-6)* – అల్లూరి సీతారామరాజు జిల్లా
*పరారీలో ఉన్న నిందితులు:*
A-2 (ఒడిస్సా మూలం), A-3 (నర్సీపట్నం), A-5 (అల్లూరి జిల్లా). వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
*స్వాధీనం చేసుకున్న సొత్తు:* ​600 కేజీల గంజాయి రవాణాకు ఉపయోగించిన వ్యాన్ (AP39 VA 6786)
​పైలట్ వెహికిల్ హోండా సివిక్ కారు (AP16 BC 0018)
*నిందితుల నేర చరిత్ర & పీడీ యాక్ట్ ప్రతిపాదన:*
​A-1 (షేక్ మస్తాన్ వలి): గతంలో జి.మాడుగుల (అల్లూరి జిల్లా), కిర్లంపూడి (కాకినాడ జిల్లా)లలో 2 కేసులు నమోదయ్యాయి.
​A-3 (నర్సీపట్నం): గొలుగొండ (అనకాపల్లి), మార్టూరు (పశ్చిమ గోదావరి), కిర్లంపూడి, జగ్గంపేట (కాకినాడ), టంగుటూరు (ప్రకాశం) పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 5 గంజాయి కేసులు ఉన్నాయి. ఇతనిపై పిట్ ఎన్‌డీపీఎస్ (PIT-NDPS) చట్టం కింద పీడీ యాక్ట్ (PD Act) అమలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది.
​A-6 (పాంగి రత్నాలు): జి.మాడుగుల PS పరిధిలో ఒక కేసు నమోదై ఉంది.

*పోలీస్ సిబ్బందికి అభినందనలు - రివార్డుల ప్రదానం:*
ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించి భారీ గంజాయి ముఠాను పట్టుకున్న ఎస్.బి సీఐ ఎస్.బాల సూర్యరావు, అనకాపల్లి టౌన్ సీఐ జి.ప్రేమ కుమార్, రూరల్ సీఐ జి.అశోక్ కుమార్, రూరల్ ఎస్సై జి.రవికుమార్, టౌన్ ఎస్సై షేక్ జిలాని, ఈగల్ టీం సీఐలు టీ.ధనుంజయ నాయుడు, వి.నాగరాజు మరియు వారి సిబ్బందిని ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
​జిల్లాలో మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు,
మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఈ.శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



Andhra Pradesh Police

*ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం: పోలీసు బృందానికి ఎస్పీ తుహిన్ సిన్హా అభినందనలు* *అనకాపల్లి (పాయకరావుపేట), సెప్టెంబర్ 2:* ప...
03/09/2026

*ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం: పోలీసు బృందానికి ఎస్పీ తుహిన్ సిన్హా అభినందనలు*

*అనకాపల్లి (పాయకరావుపేట), సెప్టెంబర్ 2:*
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తాగు, సాగునీటి విడుదల సందర్భంగా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘జలహారతి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భారీ జనసందోహం నడుమ సాగిన ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంత వాతావరణంలో, అత్యంత విజయవంతంగా ముగిసింది.
హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ తరపున ఘన స్వాగతం లభించింది. విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి (ఐపీఎస్), అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా (ఐపీఎస్) ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సాదర ఆహ్వానం పలికారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

*పకడ్బందీ భద్రత – సిబ్బందికి ఎస్పీ ప్రశంసలు:*
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వర్తించిన సిబ్బంది పనితీరును ఎస్పీ కొనియాడారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ—
"ముఖ్యమంత్రి గారి పర్యటనను విజయవంతం చేయడంలో అంకితభావంతో పనిచేసిన ప్రతీ పోలీసు అధికారికి, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. మీ సమన్వయం, అప్రమత్తత, క్రమశిక్షణ అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ నిబద్ధతకు నిదర్శనం. అలాగే బందోబస్తు విధుల్లో పాల్గొని విశేష సేవలందించిన ఇతర జిల్లాల పోలీసు అధికారులకు, సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

Andhra Pradesh Police

*ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు: జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్ & జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్* *పోలవ...
01/09/2026

*ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు: జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్ & జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్*

*పోలవరం ఎడమ కాలువ 'జలహారతి' కార్యక్రమంలో పాల్గొననున్న గౌరవ ముఖ్యమంత్రి*

*క్షేత్రస్థాయిలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) పూర్తి*

*1600 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు*

*అనకాపల్లి (పాయకరావుపేట)* పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘జలహారతి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 2న అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలో పర్యటించనున్నారు.
​ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీ శౌర్య మాన్ పటేల్, ఐఏఎస్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటన ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి, భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు.

*​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..* అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
*1600 మందితో పకడ్బందీ భద్రత:*
ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం సుమారు 1600 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

*భద్రతా సిబ్బంది కేటాయింపు:* 03 అదనపు ఎస్పీలు, 09 డీఎస్పీలు, 36 సీఐలు, 90 ఎస్ఐలు, 150 ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు, 427 మంది కానిస్టేబుళ్లు, 150 మంది మహిళా కానిస్టేబుళ్లు మరియు 249 మంది హోంగార్డులు విధుల్లో పాల్గొంటారు.

*ప్రత్యేక రక్షణ విభాగాలు:* రోప్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్ మరియు స్పెషల్ పార్టీ బలగాలను మోహరిస్తున్నారు.
​పర్యటన షెడ్యూల్:
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని, అనంతరం పోలవరం ఎడమ కాలువ వద్ద జలహారతి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభ, పార్టీ కార్యకర్తల సమావేశం మరియు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

*అధికారులకు ఆదేశాలు:*
"విధుల పట్ల ఎలాంటి అలసత్వం వహించకుండా క్షేత్రస్థాయి అధికారులంతా పరస్పర సమన్వయంతో పనిచేయాలి. హెలిప్యాడ్, సభా ప్రాంగణాలు, ముఖ్య మార్గాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టాలి. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండి, పర్యటన ముగిసేవరకు నిరంతర నిఘా కొనసాగించాలి" అని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

*​ASL సమీక్షా సమావేశంలో పాల్గొన్న అధికారులు:*
ఈ భద్రతా సమీక్షలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) అడిషనల్ డైరెక్టర్ శ్రీ కె.శ్రీనివాస రావు, అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, ఆర్డీవోలు శ్రీమతి కె.వి.రామలక్ష్మి, శ్రీ వీ.వీ.రమణ, నర్సీపట్నం డీఎస్పీ శ్రీ పి.శ్రీనివాసరావు, పరవాడ ఇన్చార్జి డీఎస్పీ శ్రీ బి.మోహన రావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఈ.శ్రీనివాసులు, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, ఇతర డీఎస్పీలు, సీఐలు బాల సూర్యారావు, వినోద్ బాబు, గఫూర్, వెంకటనారాయణ, ధనుంజయ రావు, అశోక్ కుమార్, ఎస్సైలు పురుషోత్తం, అలీ షరీఫ్ తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Andhra Pradesh Police

జిల్లా పోలీసు శాఖలో 41 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ARSI శ్రీ అల్లిపిల్లి నర్సింగరావు గారికి ఘన వీడ్కోలు...
31/08/2026

జిల్లా పోలీసు శాఖలో 41 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ARSI శ్రీ అల్లిపిల్లి నర్సింగరావు గారికి ఘన వీడ్కోలు

అనకాపల్లి, ఆగస్టు 31: పోలీసు శాఖలో నాలుగు దశాబ్దాలకు పైగా నిస్వార్థ సేవలు అందించి, అంకితభావంతో పనిచేసిన ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ARSI) శ్రీ అల్లిపిల్లి నర్సింగరావు గారికి అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు గారి ఆధ్వర్యంలో సోమవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది.

​ఈ సందర్భంగా విశ్రాంత అధికారి శ్రీ అల్లిపిల్లి నర్సింగరావు మరియు వారి కుటుంబ సభ్యులను అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు మాట్లాడుతూ:
"పోలీసు వృత్తి ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. అటువంటి బాధ్యతాయుతమైన రంగంలో 41 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేయడం అభినందనీయం. ముఖ్యంగా 'జన జాగృతి కళా బృందం' ద్వారా సుమారు 12 సంవత్సరాల పాటు మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలు, సంతల్లో 200కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. మావోయిస్టుల వల్ల కలిగే అనర్థాలపై గిరిజనులకు అవగాహన కల్పించడంలో ఆయన పోషించిన పాత్ర శాఖకు గర్వకారణం.
​ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 'ఉత్తమ సేవా పతకం', 'సేవా పతకం', 'అతి ఉత్కృష్ట సేవా పతకం' లభించడం ఆయన అంకితభావానికి నిదర్శనం. యువ పోలీసు సిబ్బందికి ఆయన క్రమశిక్షణ మార్గదర్శకం. ఆయన విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా సాగాలని కోరుకుంటున్నాం. పోలీసు శాఖ ఎల్లప్పుడూ వీరికి అండగా ఉంటుంది."

భావోద్వేగానికి లోనైన విశ్రాంత అధికారి:
సత్కారం అందుకున్న అనంతరం ARSI శ్రీ నర్సింగరావు గారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ 41 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో అందించిన సహకారానికి ఉన్నతాధికారులకు, తోటి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి ఘనమైన వీడ్కోలు లభించడం జీవితంలో మరువలేని అనుభూతి అని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, రామకృష్ణారావు, సీనియర్ అసిస్టెంట్ అప్పలరాజు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని రిటైర్డ్ అధికారికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.



Andhra Pradesh Police

*రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘పీజీఆర్‌ఎస్’ రద్దు: ఎస్పీ  తుహిన్ సిన్హా ఐపీఎస్* *అనకాపల్లి, ఆగస్టు 30:* అనకాపల్లి జిల్...
30/08/2026

*రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘పీజీఆర్‌ఎస్’ రద్దు: ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్*

*అనకాపల్లి, ఆగస్టు 30:* అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్ - PGRS) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబర్ 2వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాయకరావుపేట మండలంలో నిర్వహించే
*'జల హారతి' కార్యక్రమంలో పాల్గొననున్నారు.* ఈ పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లలో పోలీస్ అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున, సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది.
ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, పోలీసు శాఖకు సహకరించాల్సిందిగా జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


Andhra Pradesh Police

*నర్సీపట్నం సబ్ డివిజన్‌లో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’**నాతవరం మండలంలో చమ్మచింత ,  కురువాడ గ్రామాలలో లో భారీ కార్డన్ అండ్ సెర్...
30/08/2026

*నర్సీపట్నం సబ్ డివిజన్‌లో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’*
*నాతవరం మండలంలో చమ్మచింత , కురువాడ గ్రామాలలో లో భారీ కార్డన్ అండ్ సెర్చ్ 300 ఇళ్లలో సోదాలు*
*సరైన పత్రాలు లేని 35 బైకులు, ఒక ఆటో మరియు 25 (180 ML బాటిల్స్ బెల్ట్) స్వాధీనం.*

*మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం: *అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు*

*నర్సీపట్నం, ఆగస్ట్ , 30.2026:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చేపట్టిన “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో భారీ తనిఖీలు నిర్వహించారు. ఆదివారం నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని చమ్మచింత , కురువాడ గ్రామలలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ ఎల్.రేవతమ్మ గారు తెలిపారు.
ఈగల్ సెల్ ఐజి శ్రీ అకే రవికృష్ణ ఐపీఎస్., విశాఖ రేంజ్ ఐజీపీ శ్రీ గోపీనాధ్ జట్టి మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఈగల్ టీమ్ (EAGLE), స్పెషల్ పార్టీ మరియు వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన 65 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు చమ్మచింత , కురువాడ గ్రామలలోని సుమారు 300 ఇళ్లను మరియు 600 మంది వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి సాగు, రవాణా మరియు పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల నివాసాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
సరైన పత్రాలు లేని 35 బైకులు, ఒక ఆటో మరియు 25 (180 ML బాటిల్స్ బెల్ట్) స్వాధీనం
చేసుకున్నారు.
గతంలో గంజాయి కేసులలో ఉన్న ముద్దాయిలకు మరియు సస్పెక్ట్ షీట్ ఉన్న వ్యక్తులకు పోలీసులు స్పాట్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా గంజాయి రాపీట్ కిట్స్ తో 15 మందికి టెస్టులు నిర్వహించగా ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది , అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, సన్మార్గంలో నడవాలని హెచ్చరించారు.

*ఈ సందర్భంగా నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ ఎల్.రేవతమ్మ గారు మాట్లాడుతూ..* మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతుందని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” చేయించారు.
మీ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 లేదా 100/112 కు డయల్ చేయండి అని తెలియజేసారు.
సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, మరియు నర్సీపట్నం గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం కే.డి. పేట ఎస్ఐలు నర్సీపట్నం టౌన్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
(ఒక సి.ఐ గారు , 8 మంది ఎస్.ఐ లు, మరియు 56 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు)


Andhra Pradesh Police

*చట్టవిరుద్ధ మద్యంపై అనకాపల్లి జిల్లా పోలీసుల తీవ్ర ఉక్కుపాదం: రూ.50 లక్షల విలువైన 38,379 అక్రమ మద్యం సీసాలు ధ్వంసం* మున...
28/08/2026

*చట్టవిరుద్ధ మద్యంపై అనకాపల్లి జిల్లా పోలీసుల తీవ్ర ఉక్కుపాదం: రూ.50 లక్షల విలువైన 38,379 అక్రమ మద్యం సీసాలు ధ్వంసం*

మునగపాక :
సమాజంలో నేరాల రహిత వాతావరణాన్ని పెంపొందించడం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. అందులో భాగంగా, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు నమ్మకమైన సమాచారం, సమర్థవంతమైన నిఘా ఆధారంగా స్వాధీనం చేసుకున్న భారీ అక్రమ మద్యం నిల్వలను గురువారం అధికారుల సమక్షంలో నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు.

​గతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో చట్టవిరుద్ధంగా తరలిస్తూ మునగపాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసిన కేసు (Cr.No.78/2024 U/s 34(a) A.P. Excise Act) లో స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షల విలువ కలిగిన మొత్తం 38,379 మద్యం సీసాలను మునగపాక సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న లేఅవుట్ వద్ద చట్టబద్ధమైన పద్ధతిలో పూర్తిగా తొక్కించి/ధ్వంసం చేయడం జరిగింది.

​ఈ కార్యక్రమం అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ ఈశ్వరరావు గారి పర్యవేక్షణలో, యలమంచిలి సీఐ శ్రీ ఎస్.ధనుంజయరావు మరియు మునగపాక ఎస్‌ఐ శ్రీ పి.ప్రసాద రావు ల ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించబడింది.

*​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు/పోలీస్ అధికారులు మాట్లాడుతూ:*
"జిల్లాలో అక్రమ మద్యం సరఫరా, నిల్వ లేదా విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ముఖ్యంగా ఎన్నికల సమయం నుండి ఇప్పటివరకు శాంతిభద్రతల పరిరక్షణలో అనకాపల్లి జిల్లా పోలీసులు రాజీపడకుండా పనిచేస్తున్నారు. అక్రమ రవాణాపై మా నిఘా ఎల్లప్పుడూ కొనసాగుతుంది."
​ప్రజా సంక్షేమం, చట్ట రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా పోలీసులకు ప్రజలు సహకరించి, ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది.



Andhra Pradesh Police

*ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత: 56 ఫిర్యాదుల స్వీకరణ* *- బాధితులకు 7 రోజుల్లోపు న్యాయం చేయాలని అదనపు ఎస్పీ శ్...
24/08/2026

*ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత: 56 ఫిర్యాదుల స్వీకరణ* *- బాధితులకు 7 రోజుల్లోపు న్యాయం చేయాలని అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు ఆదేశం*

*అనకాపల్లి, ఆగస్టు 24:* ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు ప్రజా ఫిర్యాదుల వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు బాధితుల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు.

నేటి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 56 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా: *సివిల్ వివాదాలు:*
భూ తగాదాలు మరియు ఆస్తి సంబంధిత సమస్యలు.
*కుటుంబ సమస్యలు:* భార్యాభర్తల మధ్య కలహాలు, వేధింపులు.
*నేరాలు:* మోసపూరిత వ్యవహారాలు, ఆర్థిక నేరాలు.
*ఇతరాలు:* ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అంశాలు.

ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం అదనపు ఎస్పీ గారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి కీలక సూచనలు చేశారు:
ప్రతి ఫిర్యాదుపై 7 రోజుల్లోపు సమగ్ర విచారణ పూర్తి చేయాలి.
ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా వాస్తవాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
బాధితులకు చేపట్టిన చర్యల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి.
విచారణ అనంతరం తీసుకున్న చర్యల నివేదికను తప్పనిసరిగా జిల్లా కార్యాలయానికి సమర్పించాలి.

"ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయం అందించడమే పోలీసు యంత్రాంగం ప్రధాన బాధ్యత. ప్రజా సమస్యల పరిష్కారంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు."
— శ్రీ ఎల్.మోహన రావు, జిల్లా అదనపు ఎస్పీ

ఈ కార్యక్రమంలో ఎస్సై బి.శ్రీనివాసరావు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.



Andhra Pradesh Police

*ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అనకాపల్లి జిల్లా పోలీసు వ్యవస్థ ఘన నివాళి* *అనకాపల్లి, ఆగస్టు 23:* ఆంధ్ర రాష్...
23/08/2026

*ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అనకాపల్లి జిల్లా పోలీసు వ్యవస్థ ఘన నివాళి*

*అనకాపల్లి, ఆగస్టు 23:* ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు 'ఆంధ్రకేసరి' శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి వేడుకలు అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో భావపూర్వకంగా నిర్వహించబడ్డాయి.
జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్ గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

*ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్ మాట్లాడుతూ:*
మద్రాసులో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో, బ్రిటిష్ తుపాకీ ఎదుట గుండెను చూపి "కాల్చండి" అని గర్జించిన ప్రకాశం పంతులు గారి ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచిపోయాయని, ఆ సాహసమే ఆయనకు 'ఆంధ్రకేసరి' బిరుదును తెచ్చిపెట్టిందని గుర్తుచేశారు.

నిజాయితీ, సత్యనిష్ఠ, నైతిక విలువలతో కూడిన ఆయన జీవితం నేటి యువతకు, ప్రజాప్రతినిధులకు మరియు ఉద్యోగస్వామ్యానికి దిశానిర్దేశమని పేర్కొన్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులు గారు వేసిన బాటలో పయనిస్తూ, రాష్ట్ర మరియు దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ గారితో పాటు కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొని ఆంధ్రకేసరి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.


Andhra Pradesh Police

అనకాపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం: ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంసలు* *అనకాపల్లి (ఎ.కోడూరు), ఆగస్టు 22:* కె.కోటపాడు మండ...
22/08/2026

అనకాపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం: ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంసలు*

*అనకాపల్లి (ఎ.కోడూరు), ఆగస్టు 22:* కె.కోటపాడు మండలం, ఎ.కోడూరు గ్రామంలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర' కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అత్యంత శోభాయమానంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది.
హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి గారికి జిల్లా యంత్రాంగం మరియు పోలీసు శాఖ తరపున ఘన స్వాగతం లభించింది.

విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలసి, సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

*పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు:*
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ పర్యటనను అత్యంత క్రమశిక్షణతో, విజయవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

*ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ—*
"ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేందుకు అంకితభావంతో పనిచేసిన ప్రతీ పోలీసు అధికారికి, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. మీ సమన్వయం, అప్రమత్తత, వృత్తిపరమైన క్రమశిక్షణ అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ నిబద్ధతకు నిదర్శనం. విశేషంగా ఇతర జిల్లాల నుండి విధులకు హాజరై విశేష సేవలందించిన అధికారులకు, సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు."


Andhra Pradesh Police

Address

Office Of The Supdt Of Police, Anakapalli District
Anakapalle
531002

Alerts

Be the first to know and let us send you an email when Anakapalli District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share