17/12/2015
అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని ఎగ్గోట్టండి. దేశ సేవలో తరించండి. ఎలాగంటే…!
callmony
“కాల్ మనీ” ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేస్తున్న వ్యవహారం ఇపుడు. లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు వడ్డీల రూపంలో వసూలు చేస్తూ, ఒకవేళ కట్టలేకపోతే బార్యనో, కుతురినో, చివరకు ఎవ్వరినయిన పడుకో పెట్టాలి, లేదా వాళ్ళే పడుకో పెట్టి డబ్బు వసూలు చేసుకుంటారు. క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది “కాల్ మనీ” గురించి , అధిక వడ్డిలకు డబ్బులు ఇచ్చి ప్రజల రక్తాలనే కాదు, చివరకు మాన ప్రాణాలను కూడా తీసేస్తున్న వడ్డీ వ్యాపారుల గురించి.
వీళ్ళ రాక్షసత్వం ఎంతల బరితేగించింది అనడానికి కొన్ని వేల ఉదాహరణలు. అందులో తాజాగా జరిగిన ” కాల్ మనీ ” వ్యవహారం లో ఒక ఉదాహరణనే తీసుకుంటే…
” ఒక ఆవిడ అవసరం కోసం లక్ష రూపాయలను అప్పుగా తీసుకుంది. వడ్డీ ఎంతో తెలుసా, రోజుకు రెండు వేలు. రెండు రోజుల్లో వస్తుంది అనుకున్న డబ్బు చేతికి రాలేదు, కాని ఈమె మాత్రం రోజుకు రెండు వేలు కడుతూనే ఉంది. మధ్యలో కొన్ని రోజులు కట్టలేక పోతే, ఈ రాక్షసులు పెట్టిన టార్చర్ కి ఆవిడ చెల్లెలు ష్యురిటీ కింద చెక్ ఇచ్చింది. అలా వీరు మొత్తం 9 లక్షలు చెల్లించిన తరువాత కూడా వదలని దుర్మార్గులు ఇద్దరికీ చెక్ లను మళ్లీ బ్యాంకు లో డిపాజిట్ చేసి, చెక్ లను బౌన్స్ చేసి, కోర్ట్ లో కేసు వేసి, కోర్ట్ ల చుట్టూ తిప్పుతున్నారు.”
ఇలాంటివి ఒక్కటే కాదు, చాలానే ఉన్నాయి. వీళ్ళ టార్చర్ పడలేక ఊర్లు వదిలి పోయిన కుటుంబాలున్నాయి, తల్లితండ్రులను వదిలేసి పారిపోయిన కొడుకులున్నారు, తల్లి తండ్రుల బాధలను చూడలేక వారి వద్ద పడుకున్న కుతుర్లున్నారు, భర్తల బాధల పరిష్కారం కోసం ఇంకొకడి పక్క పంచిన బార్యలున్నారు. ఎలాగయితేనేం…. అందరు ఈ రాక్షషుల బాధితులే. ఇందులో గగుల్పోడిచే విషయమేంటంటే…. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్రధారులు, ఎంఎల్ఏ లు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు.
మరి ఈ వ్యవహారంలో ఎన్ని రోజులు మీడియా కాని, పోలీసు లు కాని హడావిడి చేస్తారో, ఎంత మందిని శిక్షిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అతిత్వరలో దీనికి ముగింపు కార్డు వేసి, చేతులు దులిపేసుకుంటారు.
ఈ వ్యవహారం ఒక్క విజయవాడ కె పరిమితం కాదు, రెండు తెలుగు రాష్ట్రలల్లోను ఇలాంటి వ్యవహారాలు సాగుతూనే ఉన్నాయి. ఇందుకు పోలీస్ లు, ప్రజాప్రతినిధులు వారికి కావాల్సిన వాటాలు వారు తీసుకొని, ఇలాంటి దుర్మార్గులను రక్షిస్తునే ఉన్నారు. అందుకు తాజాగా జరిగిన “కాల్ మనీ ” వ్యవహారమే కాకుండా, ఇంతకు ముందు “వరంగల్” లో జరిగిన పోలీస్ ” మోహన్ రెడ్డి” వడ్డీల దందా కూడా ఇలాంటిదే.
అసలు ఈ అధిక వడ్డీల దందా అన్నదే అక్రమం, చట్టానికి వ్యతిరేకం కూడా. ఎవరు ఏ విధంగా అయిన కూడా, డబ్బు తో డబ్బు వ్యాపారం చెయ్యాలి అంటే… ప్రభుత్వాల, రాజ్యాంగ సంస్తల( అర్.బి.ఐ లాంటివి ) అనుమతి తప్పనిసరి. అవి బ్యాంకు లు కావొచ్చు, చిట్ ఫండ్ కంపెనీ లు కావొచ్చు, స్వయం సేవక సంఘాలు కావొచ్చు, మరేదైనా కావొచ్చు. డబ్బులు ఇచ్చి దానిమీద వడ్డీ వ్యాపారం చెయ్యాలి అంటే, ప్రభుత్వ నిభందనలకు లోబడే వడ్డీ వసూలు చెయ్యాలి. అలా అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం చేసినా, అధిక వడ్డీలు వసూలు చేసిన కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు.
అంతే కాకుండా ఇలా అధిక వడ్డీకి వసూలు చేసే డబ్బు మొత్తం “బ్లాక్ మనీ ” కింద చెలామణి అవుతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇలా అక్రమంగా అధిక వడ్డీలతో వ్యాపారాలు చేసి, సక్రమంగా ప్రభుత్వాలకు టాక్స్ లు కట్టరు. కనుక ప్రజలారా ఆలోచించండి… ఒకవేళ అధిక వడ్డీకి మీరిప్పటికే ఎవరిదగ్గరైన అప్పు తీసుకొని ఉంటె దయచేసి వారికి కట్టకండి. వారి అసలు మాత్రమె ఇచ్చేయండి. ఇప్పటికే వడ్డీ అసలు కంటే ఎక్కువగానే కట్టింటే, దయచేసి అసలు కూడా చెల్లించకండి. అలా చెల్లిస్తే మీరు దేశానికి అన్యాయం చేసిన వారు అవ్వడమే కాకుండా, ” కాల్ మనీ ” లాంటి రాక్షసులని ప్రోత్సహించిన వారవుతారు.
మరి వడ్డీలు ఇచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతుంటే, పరువు, మానం, మర్యాద పోదా అని మాత్రం దయచేసి ఆలోచించకండి. చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వాళ్ళు నిజంగా పరువు, మర్యాద లేని వాళ్ళు, మీరు కాదు. అంతేకాకుండా మీరు చట్ట వ్యతికేలను అడ్డుకొని దేశ సేవ చేసిన గోప్పవాల్లుగా ఫీల్ అవ్వండి.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే అధిక వడ్డీకి కాకుండా, చాల తక్కువ నామమాత్రపు వడ్డీకి మాత్రమె తీసుకోండి.
మనం ఇలా చేస్తే రేపు మనకు డబ్బు అవసరమయితే ఎవరిస్తారు అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే అలా ఇవ్వడం కోసమే ప్రభుత్వాలు కొన్ని సంస్తలకు అనుమతి ఇచ్చి చట్ట ప్రకారం బిజినెస్ చేయిస్తున్నాయి. వారెక్కడ ఇస్తారు అప్పులు, ఇవ్వాలంటే సవా లక్ష ప్రశ్నలు అడుగుతారు అంటే, అలా అడిగే వారిని నిలదీయండి, ఎందుకంటే ఇవ్వాల్సిన కనీస బాధ్యత వాళ్ళ మీద ఉంది. అంతే కాకుండా ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల భాద్యత. అందుకే మనం వోట్ వేసి మన ప్రభుత్వాలను మనమే ఎన్నుకుంది.
ఒకవేళ ప్రభుత్వాలు మన అవసరాలు తీర్చలేకపోతే… మన కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం, మనం నమ్మిన రాజకీయ పార్టీ కోసం, నాయకుల కోసం, సినిమాలలో దెబ్బతిన్న మన కుల/మత/ప్రాంత ఆత్మ గౌరవం కోసం ఎలా అయితే రోడ్ ల మీదకొచ్చి పోరాటాలు చేస్తామో, మన కనీస
అవసరాలు, హక్కుల కోసం కూడా అలానే పోరాటాలు చెయ్యడం మన కనీస భాద్యత అని తెలుసుకోండి.
కనుక ప్రజలారా ఆలోచించండి. అధిక వడ్డీకి తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టి సేవ చేసి, అక్రమార్కుల ఆట కట్టించండి. అలాగే మేధావుల్లారా మీరు కూడా ఇటువంటి వాటి గురించి అలోచించి ప్రజలను చైతన్యం చేసి, వారి మాన ప్రాణాలను రక్షించండి. అలాగే తక్కువ నామమాత్రపు వడ్డీ వసూలు చేసే వారిని ప్రోత్సహిస్తూ, అధిక వడ్డీ కి ఇచ్చే వారి దగ్గర అదే అధిక వడ్డీ ఆశ చూపి, డబ్బులు తీసుకొని, మీ అవసరాలకు వాడుకొని, తరువాత వారి అసలు మాత్రమె తిరిగివ్వండి. వీలైతే నామత్రపు వడ్డీ మాత్రమే చెల్లించండి.