01/08/2026
*రాప్తాడు_నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, పాపంపేట పంచాయతీ SBI కాలనీ నందు పేదలసేవలో పెన్షన్ పంపిణీ మరియు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం*...
*రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ గారి ఆదేశాల మేరకు*....
•కూటమి నాయకులతో కలిసి పాపంపేట పంచాయతీ లోని SBI కాలనీ నందు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసి, అనంతరం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పాలనపై ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు సేకరించి వారి సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
•ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాన్ని తెలుపుతూ చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వం 3000 రూపాయల పెన్షన్ను ఒకేసారి 4000 వేలకు పెంచడం మాకు లబ్ది చేకూరిందని అందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
• ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించిన ప్రజలు కాలనీలో రోడ్లు వేయడం, ఇతర మౌలిక సదుపాయాలపై సంతృప్తిని వ్యక్తపరుస్తూ మేము అడిగిన వెంటనే పనులు చేసిన శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
•ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు రెండు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.
•ముఖ్యంగా పాపంపేట పంచాయతీలో ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ప్రత్యేక చొరవతో 7 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు చేపట్టడం చాలా సంతోషమని ఎమ్మెల్యే గారు ప్రజలు అడిగిన వెంటనే స్పందిస్తూ నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వలన కాలనీలు రోడ్లు ఇతర మౌలిక వసతులతో చాలా బాగున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ చల్లా జయకృష్ణ, గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ రాష్ట్ర డైరెక్టర్ రావూరి లక్ష్మీదేవి, లేబర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తాడాల నాగభూషణం, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలెం రామసుబ్బులు,కో క్లస్టర్ భానుకోట రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జ్ శ్రీరాములు, నాయకులు బాల లింగయ్య యాదవ్, పాపంపేట టిడిపి ప్రధాన కార్యదర్శి జెట్టి రామన్న చౌదరి, తెలుగు మహిళ జయలక్ష్మి గారితో కలిసి పాల్గొన్న...
*రాష్ట్ర_తెలుగుయువత_అధికారప్రతినిధి,*
*హరీష్_రెడ్డి_మిడుతూరు*.