08/05/2024
స్క్రోలింగ్ పాయింట్లు
• బిజేపి కూటమికి నరెంద్ర మోడి మద్ధతు తెలియజేసిన తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) ప్రతినిధులు.
• హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కలిసిన సంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ ఉల్ హదీస్ అల్లమా ముఫ్తీ జియా ఉల్లా ఖాన్ ఖాసిమి, కోశాధికారి అల్లమా ముఫ్తీ ఘుప్రాన్, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఇస్మాయిల్ ఖాసిమీలు
• టిడిపి ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో యావత్ ముస్లిం సమాజం సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేస్తుందని ప్రతినిధులు తెలిపారు.
• 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ముస్లిం సమాజ సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని మర్చిపోలేమని గుర్తుచేసుకున్నారు.
• ముస్లింలకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నా రాజధాని అమరావతి పూర్తి కావాలన్నా టీడీపీ బలపరిచిన అభ్యర్ధులకు మైనారిటీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
• అమరావతి పరిధిలో అత్యధిక ముస్లింలున్నారు. జగన్ అమరావతిని నాశనం చేసి ముస్లింలకు ద్రోహం చేశారు.
• జగన్ పాలనలో ముస్లింలపై ఒక వైపు కిరాతక దాడులు, మరోవైపు బలవంతపు మతమార్పిడిలు జరగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.\