West godavari police

West godavari police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from West godavari police, Government Organization, bhimavaram, Bhimavaram.

*దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది....**: జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎ...
07/09/2026

*దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది....*

*: జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్. గారు*

విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి ఉంటుందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు పేర్కొన్నారు. సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఇటీవల మృతిచెందిన ఇద్దరు పోలీసు కుటుంబాలకు సంక్షేమ నిధుల కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను జిల్లా ఎస్పీ గారు స్వయంగా అందజేశారు.

భీమవరం టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ గత జూలై 9వ తేదీన అకాల మరణం చెందిన పిసి-1527 ఎస్.వి.వి.ఎస్. కృష్ణారావు గారి సతీమణి సుంకర సత్యదుర్గ గారికి 'విడో వెల్ఫేర్ ఫండ్' (Widow Welfare Fund) నుండి మంజూరైన రూ. 1,00,000/- (అక్షరాలా లక్ష రూపాయలు) చెక్కును అందజేశారు. అదేవిధంగా, పశ్చిమ గోదావరి జిల్లా నుండి పెదవేగి డి.టి.సి (DTC) లో విధులు నిర్వహిస్తూ గత ఆగస్టు 7వ తేదీన మృతిచెందిన ఏఆర్ పిసి - 2759 జి. విజయ కృష్ణ గారి సతీమణి జి. ఉష గారికి 'డిసీజ్డ్ వెల్ఫేర్ ఫండ్' (Deceased Welfare Fund) నుండి మంజూరైన రూ. 1,00,000/- (అక్షరాలా లక్ష రూపాయలు) చెక్కును ఎస్పీ గారు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ....,
ఆపత్కాలంలో తక్షణ ఆర్థిక భరోసా కల్పించేందుకే శాఖాపరమైన సంక్షేమ నిధుల ద్వారా ఈ సహాయాన్ని త్వరితగతిన విడుదల చేసినట్లు తెలిపారు. కేవలం తక్షణ ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా రావలసిన అన్ని రకాల ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్ తదితర క్లెయిమ్‌లు, అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు. పోలీసు శాఖ ఎల్లవేళలా వారి వెన్నంటే ఉండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ గారు, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సి.హెచ్.మోజేష్ గారు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






07/09/2026

*అతి ఉత్కృష్ట , ఉత్కృష్ట సేవా పతకాలు మరియు ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన జిల్లా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు......*

*జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ ...
07/09/2026

*జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.*

*ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా పోలీసు అధికారులు ఆదేశాలు జారీ.........*

*నేటి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమంలో 17 అర్జీల స్వీకరణ.......*

పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (మీకోసం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారు నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు.

బాధితుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ గారు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.......,
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని, అటువంటి బాధితులకు పోలీసు శాఖ వెన్నుముకగా నిలిచి భరోసా కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిర్యాదులు మరల మరల పునరావృతం కాకుండా ఉండాలంటే, మొదటి విడతలోనే లోతైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. విచారణలో జాప్యం వహించకుండా, పారదర్శకమైన పద్ధతిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ డి. విశ్వనాథ్ గారు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






🙏 వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇక మరింత సులభం!ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపా...
03/09/2026

🙏 వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇక మరింత సులభం!

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు/పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్‌లైన్ అనుమతి వ్యవస్థ అందుబాటులోకి తీసుకురాబడింది.

🔹 www.ganeshutsav.net ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
🔹 పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతుల ప్రక్రియ నిర్వహించబడుతుంది.
🔹 అనుమతి మంజూరైన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రం పొందవచ్చు.
🔹 ఈ సేవ పూర్తిగా ఉచితం.

సురక్షితమైన, ప్రశాంతమైన మరియు క్రమబద్ధమైన వినాయక చవితి వేడుకల నిర్వహణ కోసం నిర్వాహకులు ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని ముందస్తుగా దరఖాస్తు చేసుకొనగలరు.

🙏🚩 సురక్షిత వేడుకలు – బాధ్యతాయుతమైన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ

03/09/2026

పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటన......

*గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం.....**బంద...
31/08/2026

*గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం.....*

*బందోబస్తు విధులలో పాల్గొనే పోలీసు అదికారులు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి అశోక్ కుమార్, ఐపీఎస్., గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు...*

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 1, మంగళవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం మరియు మొగల్తూరు గ్రామంలో నిర్వహించనున్న "పేదల సేవలో పెన్షన్ల పంపిణీ మరియు ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, నర్సాపురం మండలం, సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కళాశాల ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్, గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్, గారు పాల్గొని బందోబస్తు విధులలో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి బందోబస్తు విధులపై దిశా నిర్దేశం చేశారు.

ఈ పర్యటనలో దాదాపు 1300 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారి రాక నుండి తిరిగి వెళ్లే వరకు ప్రతి అడుగును పర్యవేక్షించేలా బందోబస్తును సెక్టార్ల వారీగా విభజించి, స్పష్టమైన ప్రణాళికలను రూపొందించారు. హెలిప్యాడ్ భద్రత, సభా ప్రాంగణం, కాన్వాయ్ ప్రయాణించే రహదారి మార్గాలు, మరియు ప్రజా ప్రతినిధుల సమావేశ ప్రాంతాలను ప్రత్యేక సెక్టార్లుగా గుర్తించి, ఆయా విధుల్లో ఉన్న సిబ్బందికి బాధ్యతలను కేటాయించారు. ముఖ్యంగా రోప్ పార్టీలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ మేనేజ్మెంట్ మరియు చెక్ పోస్టుల నిర్వహణలో అనుసరించాల్సిన వ్యూహాలను ఐజీ గారు మరియు ఎస్పీ గారు స్వయంగా వివరించారు.

సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు మాట్లాడుతూ, కేటాయించిన విధులలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర శాఖల అధికారులతో నిరంతర సమన్వయం కలిగి ఉంటూ, ఎంతో సంయమనంతో, అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. పర్యటనకు విచ్చేసే ప్రజలకు మరియు కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడటమే పోలీసు శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అదేవిధంగా, ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నందున, ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే నిలిపి, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది మరియు జిల్లా పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు.

*పోలీసు విభాగంలో సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ పొందిన సిబ్బందిని ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ...
31/08/2026

*పోలీసు విభాగంలో సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ పొందిన సిబ్బందిని ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.*

*పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష*

పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి ఆగస్టు 31, సోమవారం నాడు పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు మరియు పోలీస్ అధికారులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేసి, ఆత్మీయ వీడ్కోలు పలికారు.

*పదవీవిరమణ పొందిన వారి వివరాలు:*

1. శ్రీ ఎం. సోమరాజు గారు, సబ్ ఇన్స్పెక్టర్ - 947, తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.
2. శ్రీ ఎన్. వి త్రిమూర్తులు గారు సబ్ ఇన్స్పెక్టర్ - 1370, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్.
3. శ్రీ కె. శ్రీనివాస రావు గారు, సబ్ ఇన్స్పెక్టర్ - 4615, పోలీస్ కంట్రోల్ రూమ్.
4. శ్రీ టి. చిట్టిబాబు గారు, సబ్ ఇన్స్పెక్టర్ - 95, కమ్యూనికేషన్.
5. శ్రీ ఎం. కిషోర్ బాబు గారు, హెడ్ కానిస్టేబుల్ - 718, స్పెషల్ బ్రాంచ్.
6. శ్రీ జి. యేసు రత్నం గారు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ - 1098, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్, భీమవరం.
7. శ్రీ ఎస్కె. అక్బర్ ఆలీ గారు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ - 996, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్, భీమవరం.
8. శ్రీ పి. వెంకటేశ్వర్లు గారు , హోమ్ గార్డ్ - 248, కమ్యూనికేషన్.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ....,
సుమారు 35 నుండి 40 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో వ్యక్తిగత సుఖాలను, కుటుంబ వ్యవహారాలను పక్కన పెట్టి, అహోరాత్రులు ప్రజా రక్షణ కోసం శ్రమించి, ఎటువంటి విమర్శలకు తావులేకుండా సగర్వంగా పదవీ విరమణ చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

పోలీసు వ్యవస్థలో ప్రతి ఉద్యోగి అందించే సేవలను శాఖ ఎప్పటికీ స్మరించుకుంటుందని, నిత్యం సవాళ్లతో కూడుకున్న విధుల్లో ఉన్నప్పుడు సిబ్బందికి వెన్నుదన్నుగా నిలిచిన వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పదవీ విరమణ కేవలం విధులకు మాత్రమేనని, పోలీసు కుటుంబంతో మీ అనుబంధం శాశ్వతమని భరోసా ఇచ్చారు. పదవీ విరమణ పొందిన సిబ్బంది తమ తదుపరి జీవితాన్ని ఆర్థిక క్రమశిక్షణతో, మెరుగైన ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే, వారికి అందవలసిన పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీమతి ఇ.ఇందుమతి గారు, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సి.హెచ్. మోజేష్ గారు, ఇతర పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

29/08/2026

అసాంఘిక కార్యక్రమాలు నివారణే లక్ష్యంగా డ్రోన్ గస్తీ నిర్వహిస్తున్న పెంటపాడు పోలీసు వారు.....















27/08/2026

అసాంఘిక కార్యక్రమాలు నివారణే లక్ష్యంగా డ్రోన్ గస్తీ నిర్వహిస్తున్న భీమవరం 2టౌన్ పోలీసు వారు.....















26/08/2026

డ్రోన్ తో ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్న భీమవరం ట్రాఫిక్ పోలీసు వారు....















Address

Bhimavaram
Bhimavaram
534202

Website

Alerts

Be the first to know and let us send you an email when West godavari police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share