31/08/2026
భారత కమÖ్యనిస్టు పార్టీ మార్క్సిస్టు
పశ్చిమగోదావరి జిల్లా కమిటీ
ప్రచురణ / ప్రసారార్థం
భీమవరం, 31.08.2026 :
నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను తక్షణమే అదుపు చేయాలి: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్
వీరవాసరం (తూర్పు చెరువు సెంటర్):
నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువులు మరియు కూరగాయల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెరిగిన ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్ డిమాండ్ చేశారు. వీరవాసరం తూర్పు చెరువు సెంటర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన/ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గోపాలన్ గారు తెలిపిన ముఖ్యమైన అంశాలు:
పెరిగిన ధరల భారం: బియ్యం బస్తా ధర 300 నుండి 400 వరకు పెరిగింది. ఉల్లిపాయలు కేజీ 50 నుండి 60 వరకు, పంచదార కేజీ 45 నుండి ఆకస్మికంగా 90 కి పెరిగాయి. బెండ, బీర, దొండ వంటి కూరగాయలతో పాటు కందిపప్పు, మినపప్పు, వంటి పప్పుధాన్యాల ధరలు వంటనూనె, గ్యాస్ అపారంగా పెరిగిపోయాయి.
పెరిగిన ధరలకు తగినట్లుగా ప్రజల ఆదాయాలు పెరగకపోగా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, పేదలకు సరైన పనులు కూడా దొరకక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కార్పొరేట్లు, బడా వ్యాపారుల దోపిడీ: ఎల్ నినో లేదా వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే కార్పొరేట్ కంపెనీలు, బడా వ్యాపారులు సరుకులను బ్లాక్ మార్కెట్కు తరలించి, కృత్రిమ కొరత సృష్టించి లాభాలు కూడబెట్టుకుంటున్నారు.
ఇథనాల్ విధానం -- పంచదార సంక్షోభం: ఇథనాల్ తయారీ కోసం చెరకును దారి మళ్లించడం వల్లే మార్కెట్లో పంచదార ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు.
నెల రోజులకు పైగా ధరలు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని, తక్షణమే నిత్యావసరాల ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాల్సి
ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బొర్ర అలమహారాజు మండల కమిటీ సభ్యులు యండమÖరి సుబ్బారావు, గొట్టుముక్కల శ్యాంబాబు, తాళ్ళూరి రాము మరియు బాలం విజయ కుమార్, యాళ్ళబండి నారాయణమÖర్తి, ఐనపూడి బాబూరావు, కిలాడి సత్యనారయణ, జుత్తిగ శ్రీనివాస్, పాలొ కోటేశ్వరరావు పాల్గొన్నారు.