09/09/2025
నేడు 100 రోజుల ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీయుత ప్రత్యేక అధికారి మరియు CDO శ్రీమతి హేమలత గారు భువనగిరి పట్టణానికి విచ్చేసి శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ జి రామలింగం గారి ఆధ్వర్యంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం చేసినటువంటి కార్యక్రమాల గురించి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి చేపట్టబడిన పనుల వివరములు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తదుపరి మున్సిపల్ రిసోర్స్ పార్క్ డంపింగ్ యార్డ్ ను సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి వర్మీ కంపోస్టింగ్ ప్రాసెస్ మరియు పొడి చెత్తను రీసైక్లింగ్ చేయు విధానమును అడిగి తెలుసుకున్నారు, అంతే కాకుండ వాటికి సంబంధించి సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా శ్రిగ్ద వెంచర్ లో పట్టణ ప్రకృతి వనాన్ని పరిశీలించి అక్కడి నుండి ABC సెంటర్ (యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్)ను సందర్శించి ఆ తదుపరి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నందు నూతనంగా ఏర్పాటు చేసిన CSC సెంటర్ ను కూడా సందర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.