24/07/2026
నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం - వెంటనే పూర్తి వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున డిమాండ్.
నిజామాబాద్ నగర ప్రజలు ఎదురుచూస్తున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పనులు ప్రారంభమై చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే బక్కిని నర్సింలు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2022 నవంబర్ 27న ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. 2025 నాటికి పూర్తవుతుందని చెప్పినా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.
ఈ బ్రిడ్జి పూర్తయితే నిజామాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ నియోజక వర్గం ఇంచార్జీలు బొబ్బ నరసింహారావు, కర్రె వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, రేంజర్ల సురేష్, రాఘవులు, మల్లికార్జున్, అంబిక సత్యనారాయణ, యువ నాయకులు శ్రీనివాస్ బాబు, సచిన్ పటేల్, దంతాల ఆనంద్, కల్లెడ గంగాధర్, మాజీ మండల అధ్యక్షులు బాల గంగాధర్, కృష్ణారెడ్డి, చిలుక సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, దత్త కృష్ణ, పట్టణ సీనియర్ నాయకులు శంకర్ ముదిరాజ్, లవంగా రాజు, నటరాజ్, హరిష్ చౌదరి, రషీదా, లక్ష్మీ యాదవ్, విజయలక్ష్మి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.