28/09/2020
చర్ల మేజర్ పంచాయతీ గ్రామపంచాయతీ ప్రజలకు తెలియజేయి ముఖ్య సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కార్యక్రమంలో భాగంగా ధరణి పోర్టల్ ను దసరా రోజు ప్రారంభించుటకు కార్యాచరణ ప్రారంభించింది. దీనిలో భాగంగా
1. చర్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మరియు గ్రామకంఠం పరిధిలో, ఎలాంటి భూమిలో నైనా( వ్యవసాయ భూమి అయినా, పట్టా భూమి అయినా, ఫారెస్ట్ ల్యాండ్, దేవుడి మాన్యాలు )ప్రతి నిర్మాణాoకు గాను అసెస్మెంట్ మరియు ఆన్లైన్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది.
2. దీనికిగాను ప్రతి ఇంటి యజమాని ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్, 2020-21 ఇంటి పన్ను చెల్లించిన రసీదు ఇవ్వవలసిందిగా కోరడమైనది. కుటుంబ యజమాని, కుటుంబంలోని సభ్యుల వివరాలు తెలుపవలసిందిగా కోరడమైనది.
3. ఒకవేళ కుటుంబ పెద్ద మరణించినచో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరి పేరు మీద అసెస్మెంట్ చేయవలసినదిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా కోరడమైనది.
4. కుటుంబంలోని అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు ఎవరి పేరుమీద ఇంటి యొక్క అసెస్మెంట్ చేయాలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా కోరడం జరుగుతుంది.
5. పెళ్లి ఐ అత్తారింటికి వెళ్లి పోయిన ఆడపడుచులు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా కోరడం జరుగుతుంది.
6. గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సరిహద్దు లో, గ్రామ పొలిమేరలో ఎటువంటి నిర్మాణం అయి ఉన్నప్పటికీ అసెస్మెంట్ చేయించుకోవాల్సింది గా కోరడం జరుగుతుంది.
7. ప్రభుత్వ ఆదేశానుసారం రేపు అనగా 28.09.2020 నుండి 30.09.2020 వరకు చర్ల పంచాయతీ కార్యదర్శి కి లేదా సిబ్బంది కి తగు సమాచారం ఇచ్చి సహకరించగలరు.
8. ఇంటి నెంబరు ఉన్నా వారు మరియు కొత్త ఇంటి నెంబర్ కావలసిన వారు, నిర్మాణం లో ఉన్న ఇండ్ల కు మరియు వ్యవసాయ క్షేత్రములో కట్టిన ఇండ్ల కు అసెస్మెంట్ మరియు ఆన్లైన్ చేయడం జరుగుతుంది.
9. పాత మరియు కొత్త ఇండ్లు అస్సేస్మెంట్ మరియు ఆన్లైన్ కొరకు పంచాయతీ సిబ్బంది మీ ఇంటికి వచ్చినపుడు సిబ్బంది కి సహకరించగలరు. కొత్త ఇంటి నమోదు కొరకు తగిన ధ్రువ పత్రాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవలసినదిగా కోరనైనది. మరియు వివరములు కు పంచాయతీ కార్యాలయములో సంప్రదించగలరు.
ఇట్లు
పంచాయతీ కార్యదర్శి
చర్ల మేజర్ గ్రామపంచాయతీ