07/09/2026
సుపరిపాలన, నాయకత్వ పటిమకు సరికొత్త వేదికయిన "తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్" పై ఎంపీ "లావు" గారి స్పందన
భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్పై నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కీలక అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సుపరిపాలన, నవతరం రాజకీయాల్లో సాంకేతికత వినియోగం వంటి అంశాల్లో ప్రతినిధులను సన్నద్ధం చేయడానికి ఈ వేదిక గొప్ప అడుగు అని ఆయన స్పష్టం చేశారు
కాంక్లేవ్ ముఖ్య ఉద్దేశాలు ప్రజా సంక్షేమం బాధ్యతాయుత పాలన...అధికారంలో ఉండటం అంటే హోదా మాత్రమే కాదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అత్యున్నత బాధ్యత అని గుర్తుచేశారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పారదర్శక పాలన అందించేందుకు ఇలాంటి సదస్సులు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు
యువ నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తూ రాజకీయాల్లో నైతిక విలువలు, ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరు, నిరంతర అధ్యయనం ఎంత అవసరమో వివరించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించే దార్శనికత నేతల్లో ఉండాలని పిలుపునిచ్చారు
ఆధునిక సాంకేతికత - డేటా ఆధారిత పాలన: అభివృద్ధి పథకాలు నేరుగా అర్హులకు చేరడంలో, క్షేత్రస్థాయి ఫలితాలను అంచనా వేయడంలో టెక్నాలజీ పాత్రను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు
"ప్రజాసేవలో నిబద్ధత, పాలనలో పారదర్శకత ఉన్నప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ వేదిక మాత్రమే కాదు, సమాజ మార్పు కోసం నాయకులను తయారుచేసే పరిశోధనా కేంద్రం." అని MP Sri Krishna Devarayalu Lavu గారు తెలియచేసారు