District Collector, Chittoor

District Collector, Chittoor District Collector, Chittoor has opened this account for taking the suggestions from the public

కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూసేకరణపై రైతులతో జాయింట్ కలెక్టర్ సమావేశంకుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు ...
03/06/2026

కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూసేకరణపై రైతులతో జాయింట్ కలెక్టర్ సమావేశం

కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ గారు బుధవారం శాంతిపురం మండలం దండికుప్పం గ్రామంలో రైతులతో సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా భూములకు గతంలో నిర్ణయించిన ధర కంటే అదనపు పరిహారం అందించాలని రైతులు కోరగా, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుప్పం ఆర్డీవో, తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

పత్రికా ప్రకటన 03.06.2026*************పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ * కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు : ఓ...
03/06/2026

పత్రికా ప్రకటన
03.06.2026
*************

పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ

* కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, డోర్ టు డోర్ వెరిఫికేషన్ అంశాలపై బుధవారం సాయంత్రం చిత్తూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బిఎల్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) క్షేత్రస్థాయి సర్వేపై రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా స్వేచ్ఛగా, పారదర్శకంగా బి. ఎల్‌.వో లు సర్వే నిర్వహించాలన్నారు. ప్రధానంగా 2025 ఓటర్ల జాబితాలు 2002 జాబితాతో మ్యాపింగ్ చేయాలన్నారు. వలస వచ్చినవారు, తాత్కాలిక నివాసంలో ఉన్న వారికి సంబంధించి వారి స్వస్థల్లోని ఓటర్ల జాబితాతో వారి తండ్రి, తాతల పేర్లతో సరిపోల్చి చూడాలన్నారు. మృతి చెందిన వారి ఓట్లను, డూప్లికేట్ ఓట్లను, శాశ్వత వలసదారుల ఓట్లను గుర్తించి సరైన కారణాలు, పత్రాలతో సమర్పించాలన్నారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఓటర్లకు సంబంధించి వివరాలతో నిండిన దరఖాస్తులను ఇవ్వడం జరుగుతుందని, వీటిని సదరు ఓటరుకు అందించి, వివరాలను సరిపోల్చి, కలర్ ఫోటోతో సహా సంతకం చేయించి తీసుకోవాలన్నారు. సరిపోలని ఓటర్లను మాస్టర్ డేటాతో తనిఖీ చేయాలని, ఎలక్షన్ డీటీ, ఎలక్షన్ టీం తో డేటాను సరిపోల్చుకోవాలన్నారు. క్షేత్రస్థాయి సర్వే, మ్యాపింగ్, డిలీటింగ్ అంశాలపై సందేహాలు ఉంటే ఎలక్షన్ డీటీ, ఏఈఆర్ఓ, ఈఆర్వోలతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. సర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో ఈఆర్వో@ ఆర్డీవో శ్రీనివాసులు, ఏఈఆర్ఓ@కమిషనర్ పి నరసింహ ప్రసాద్, అర్బన్ తాసిల్దార్ కులశేఖర్, బిఎల్వోలు పాల్గొన్నారు.

చిత్తూరు, జూన్ 02: జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని మ్యాంగో పల్ప్ పరిశ్రమల యజమానులతో మామిడి కొనుగోలు ధరలు,...
02/06/2026

చిత్తూరు, జూన్ 02: జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని మ్యాంగో పల్ప్ పరిశ్రమల యజమానులతో మామిడి కొనుగోలు ధరలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోలు ప్రక్రియ మరియు పరిశ్రమల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్.

చిత్తూరు, జూన్ 02:జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మాతా-శిశు మరణాలపై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జి...
02/06/2026

చిత్తూరు, జూన్ 02:
జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మాతా-శిశు మరణాలపై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్. జిల్లాలో మాతా-శిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వైద్య సేవల మెరుగుదలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

27/05/2026
పూతలపట్టులో మే 22న భారీ జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణచిత్తూరు, మే 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)...
15/05/2026

పూతలపట్టులో మే 22న భారీ జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణ

చిత్తూరు, మే 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో పూతలపట్టు నియోజకవర్గంలో మే 22, 2026 (శుక్రవారం) నిర్వహించనున్న జాబ్ మేళా–2026 పోస్టర్లను జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఆవిష్కరించారు.
ఈ జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. సుమారు 1,500కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండగా, అర్హత మరియు ఉద్యోగాన్ని బట్టి వార్షిక వేతనం రూ.6 లక్షల వరకు ఉండనుంది.
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా@, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన వారు (పాస్/ఫెయిల్) ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. ఫ్రెషర్స్, అనుభవజ్ఞులు, ఉద్యోగార్థులు మరియు కోర్సులు పూర్తిచేస్తున్న విద్యార్థులు పాల్గొనడానికి అర్హులు.
ఐటీ, బీపీఓ, తయారీ, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, రిటైల్, లాజిస్టిక్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.
జాబ్ మేళా వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పి.కొత్తకోట, చిత్తూరు జిల్లాలో నిర్వహించబడుతుంది. నమోదు పూర్తిగా ఉచితం.
ఆసక్తి గల అభ్యర్థులు ముందస్తుగా నమోదు చేసుకుని, సంబంధిత విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 8465830771, 8866661096, 9988853335.cmo andhrapradesh

15/05/2026

పుంగనూరులో వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, మే 15: ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరు సమీపంలోని అగ్నిగొండిపల్లి గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రెండేళ్ల వ్యవధి గల వ్యవసాయ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ప్రాయోగిక శిక్షణ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించబడుతుంది.
కళాశాలలో హాస్టల్, 24 గంటల వై-ఫై, డిజిటల్ తరగతి గదులు, ల్యాబ్‌లు, ఉపకార వేతనాలు/ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9381359956, 9010402068
వెబ్‌సైట్: www.angrau.ac.in⁠�
ఈమెయిల్: [email protected]

పుంగనూరులో వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానంజిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్చిత్తూరు, మే 15: ఆచార్య ఎన్...
15/05/2026

పుంగనూరులో వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, మే 15: ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరు సమీపంలోని అగ్నిగొండిపల్లి గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రెండేళ్ల వ్యవధి గల వ్యవసాయ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ప్రాయోగిక శిక్షణ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించబడుతుంది.
కళాశాలలో హాస్టల్, 24 గంటల వై-ఫై, డిజిటల్ తరగతి గదులు, ల్యాబ్‌లు, ఉపకార వేతనాలు/ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9381359956, 9010402068
వెబ్‌సైట్: www.angrau.ac.in⁠�
ఈమెయిల్: [email protected]

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్కాణిపాకం, మే 10: భారత ప్రధాన ఎన్నికల...
10/05/2026

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
కాణిపాకం, మే 10: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులు ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు కాణిపాకం అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తదితరులు కమిషనర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఓటరు ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

గుడిపాల మండలం కమ్మతిమ్మపల్లి గ్రామంలో ACLP ఆధ్వర్యంలో నిర్వహించిన SHG మహిళా సంఘ సమావేశంలో పాల్గొని మహిళా సంఘ సభ్యులకు పల...
08/05/2026

గుడిపాల మండలం కమ్మతిమ్మపల్లి గ్రామంలో ACLP ఆధ్వర్యంలో నిర్వహించిన SHG మహిళా సంఘ సమావేశంలో పాల్గొని మహిళా సంఘ సభ్యులకు పలు సూచనలు చేసిన డిఆర్డిఏ పీడీ శ్రీదేవి గారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Address

Collecterate
Chittoor
517002

Alerts

Be the first to know and let us send you an email when District Collector, Chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share