04/06/2026
4.6.2026_ జిల్లాలో లక్ష్యంగా నిర్ణయించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం వ్యవసాయ, అనుబంధ రంగాలు, జలధార, సూర్యఘర్ యోజన, తదితర కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ ప్రధానమైన ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, నిర్దేశించిన లక్ష్యాల మేర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరితగతిన ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు రాబోయే ఖరీఫ్ లో రైతులకు విత్తనాల సరఫరా నుండి ధాన్యం కొనుగోలు వరకు వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు.
#వెట్రిసెల్వీ collector district