16/05/2026
📍 ఏలూరు | స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక 2వ డివిజన్ – భావిశెట్టి వారి పేట, భూలోకమ్మ గుడి సమీపంలో "Plastic Free State" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు (MLA) గారు, గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు గారు, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మరియు MEPMA సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
🔹 ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం
🔹 పరిశుభ్రమైన పరిసరాలను నిర్మిద్దాం
🔹 స్వచ్ఛతతో స్వర్ణ ఆంధ్ర సాధిద్దాం
ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
— MEPMA Eluru Official
Municipal Corporation Eluru