25/11/2025
*మహిళలకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం...*
*మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా రుణాలు సద్వినియోగం చేసుకోవాలి.*
*ప్రతి సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు*
*ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న రుణాలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఫలితంగా మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందని*
ఈరోజు గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఐడిఓసి లోని సమావేశపు మందిరంలో సేర్ప్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అట్టహాసంగా జరిగిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ గారు* హాజరయ్యారు.
ఇంద్ర మహిళా శక్తి
*ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ* .....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి సంక్షేమ పథకంలో మహిళల ద్వారా అందించడం జరుగుతుంది.
మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలికి గుర్తింపు, గౌరవం ఉండాలని ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రుణాలతో వ్యాపారాలు చేసుకుంటూ, వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేస్తూ కుటుంబ అవసరాలకు వినియోగిస్తుండడంతో కుటుంబ నిర్వహణలో మహిళలు కీలక శక్తిగా ఎదుగుతున్నారని కొనియాడారు. పిల్లల పెళ్లిళ్లు చేయడానికి, ఇంటి నిర్మాణాలకు, ఇతర కుటుంబ అవసరాలకు గతంలో ప్రైవేట్ వ్యక్తులతో అప్పులు చేసి వడ్డీలు కట్టేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఆస్కారమేర్పడిందన్నారు. ఇదివరకు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న గద్వాల ప్రాంతంలో ప్రస్తుతం సాగునీరు పుష్కలంగా ఉండడంతో మంచి పంటలు పండుతున్నాయని, ఆ పంటలను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మహిళల ద్వారానే ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.
కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పమని, అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేలా మహిళలు తీసుకున్న రుణాలతో వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని, రూ.10 కోట్లకు అధిపతులు కావాలని ఆకాంక్షించారు.
మహిళలు అభివృద్ధి చెందితేనే వారి గ్రామాలు, జిల్లా, రాష్ట్రం కూడా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.
త్వరలోనే మహిళలకు వివిధ వ్యాపార రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు గద్వాలలో మహిళ శిక్షణ కేంద్రం నిర్మాణంలో ఉందని, రెండు నెలల్లోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలబ బస్సు ప్రయాణం, సంక్షేమం కోసం సన్న బియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందనీ పేర్కొన్నారు.
*జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ* ....
గత శనివారం గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పలువురు మహిళా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణాలు కావాలని కోరారని, ప్రభుత్వ నిర్ణయంతో త్వరగానే సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాకు మొత్తం 4724 సంఘాలకు రూ.5.10 కోట్ల వడ్డీ లేని రుణాలు రావడం జరిగిందని, ఇదివరకు కూడా వడ్డీ లేని రుణాలు అందజేయడం జరిగిందన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో లేని మహిళలను కూడా సంఘాల్లో చేర్పించి ప్రతి ఆడపడుచు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. మహిళలు పెట్రోల్ బంకుల, సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహణతో కూడా సంపాదించే అవకాశాన్ని కలిగించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి బస్సులు కొనుగోలు చేసేందుకు జిల్లాలోని మూడు మండలాల మహిళా సంఘాలకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగిందని, మిగిలిన మండలాలకు కూడా త్వరలోనే బస్సులు కొనుగోలు చేసేందుకు సహకరిస్తామన్నారు. ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడంతో మంచి ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లోను మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, జిల్లాలోని ఆయా పాఠశాలల్లో రూ.10 కోట్లకు పైగా నిధులతో మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లోను ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం గర్వకారణమన్నారు. అనంతరం గద్వాల నియోజకవర్గ వర్గానికి సంబంధించి 2248 స్వయం సహాయక సంఘాల గ్రూపులకు రూ.2.28 కోట్ల విలువైన చెక్కును ఎమ్మెల్యే కలెక్టర్ తో కలిసి ఆయా మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు.
👉ఈ కార్యక్రమంలో. అధికారులు గద్వాల నియోజకవర్గం మహిళా సంఘాలు అధ్యక్షురాలు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.