Telugu Desam Party: Giddalur

Telugu Desam Party: Giddalur Official Page of TDP Giddalur

•రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి, లక్ష్యాల సాధన కోసం నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సీఎం...
29/08/2026

•రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి, లక్ష్యాల సాధన కోసం నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు

•స్థానిక ఎన్నికలు జరగడం జగన్‌కు ఇష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు

•"జగన్‌కు పదోసారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్ ఫిక్స్ చేయండి. పులివెందులకైనా, తాడేపల్లికైనా వస్తా. చర్చకు సిద్ధమా?" అని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు

•మంత్రి నారా లోకేష్ రాకతో ఒంగోలు పసుపుమయమైంది. భారీ జనసందోహం, డీజే మోతలు, గజమాలలు, ఘన స్వాగతంతో నగరం సందడిగా మారింది

•ప్రకాశం జిల్లాలో మరో కీలక పెట్టుబడి. చదలవాడలో రూ.100 కోట్లతో నిర్మించనున్న రాడిసన్ హోటల్‌కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/0W12




రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు క...
28/08/2026

రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీమంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత ఉన్నారు.



ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా...
28/08/2026

ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగింటి ఆడపడుచులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.



వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ... 30 ఏళ్ల తర్వాత ఆయనే ప్రారంభించడం విశ...
28/08/2026

వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ... 30 ఏళ్ల తర్వాత ఆయనే ప్రారంభించడం విశేషం. ఏళ్ల తరబడి కరువును చూసిన మార్కాపురం నేలకు వెలిగొండ ఒక కొత్త అధ్యాయం.



28/08/2026

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రకాశం, రాయలసీమ జిల్లాల కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటికి వరప్రదాయినిగా ఈ ప్రాజెక్టు నిలవనుంది. ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తారు



నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రీకుల‌ క్షేమ సమాచారాలపై విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల మంత్రి నారా లో...
27/08/2026

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రీకుల‌ క్షేమ సమాచారాలపై విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ అధికారుల‌తో మాట్లాడి తెలుసుకున్నారు. నలుగురు సురక్షితంగా ఉన్నారని... కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మీలు ఆచూకీ లభించలేదని ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులు మంత్రికి వివ‌రించారు. వారి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, సురక్షితంగా ఉన్న వారిని వెంటనే మ‌న రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.


27/08/2026

శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులు ప్రమాదంలో పడితే ఐదేళ్లు పట్టించుకోలేదు జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల భద్రతకు కోట్లు వెచ్చించాం.



భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు  ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ము...
27/08/2026

భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ముంబైలో అవార్డులను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధులుగా హాజరై విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో డైరీ వాల్యూయాడెడ్ ఉత్పత్తుల్లో ప్రత్యేకత సాధించిన హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నారా బ్రాహ్మణికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆర్ పిఎస్ జి గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయెంకా అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా పెట్టుబడుల ఆకర్షణకు రెండు ప్రధాన కారణాలను మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ తమ విజయ రహస్యమని తెలిపారు.






27/08/2026

పంటల బీమా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి, రైతులకు తీరని అన్యాయం చేసిన దుర్మార్గ పాలన జగన్ నీ‌ది. ఒకసారి ఖరీఫ్‌కి భీమా కట్టి రబీకి వదిలేసారు. మరోసారి ఏకంగా ప్రీమియమే చెల్లించలేదు. ఇదీ జగన్ నీ పాలనలో రైతులకు చేసిన అన్యాయం.


•ప్రపంచస్థాయి ప్రమాణాలతో, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా అమరావతి శాసనసభ భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చే...
27/08/2026

•ప్రపంచస్థాయి ప్రమాణాలతో, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా అమరావతి శాసనసభ భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది

•రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి "సంజీవని ప్రాజెక్టు" అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు

•నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక వెజిటబుల్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు

•మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు

•ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ విజేతలకు అవార్డులు అందజేశారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/WqSdH




Address

Giddalur
523357

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Giddalur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Giddalur:

Shortcuts

Share