31/05/2026
ఒక్క మనిషి మీద ఇంత ద్వేషమా? ఇంత పగా? ఇంత అసూయా?
తమ రాజకీయ ఎదుగుదలకి అడ్డు వస్తున్నాడని ఒక్క మనిషి మీద ఇంత మంది కలసి ఇలా విషం కక్కడం బహుశా దేశ రాజకీయాలలో ఇదే ఏమో.
కుల విద్వేషం
దాసరి రాము
అడ్వకేటు రజని
నరేంద్ర
ప్రతీరోజు మాకులాన్ని మోసం చేసాడు. ఏదో చేస్తాడని నమ్మి గెలిపించుకున్నాం. ఏమీ చెయ్యలేదు మోసం చేస్తున్నాడు. ఒకటే స్క్రిప్ట్ మార్చి మార్చి ఒక్కొక్కరు ఒక్కో చానెల్ ఒక్కో డిబేట్ ఒక్కో రోజు. ఒకటే పని. అసత్యాలని ప్రజల మీదకి రుద్దటం.
* పవన్ వేయిస్తున్న రోడ్డు మీద ఒక్క కులమే నడుస్తున్నదా?
* పవన్ తీసుకొచ్చిన పర్యావరణ సంస్కరణలు వలన ఒక్క కులమే లాభపడుతుందా?
* అటవీ శాఖ లో పవన్ తీసుకొచ్చిన పెను మార్పు వలన ఒక్క కులానికే ఉపయోగమా?
* పంచాయితీ రాజ్ లో తాను తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు ఒక్క కులానికే ఉపయోగమా?
పవన్ చేస్తున్నవి అన్ని పక్కన పెట్టేసి ఏదో పార్టీ కి సపోర్ట్ చేస్తున్నాడు దమ్ముంటే ఒక్కడే రావాలి అని రోజు ఒకటే నస. విద్వేషం. అసలు వీటిని రాజకీయాలు అంటారా?
ప్రాంతాల విద్వేషం
ప్రొఫెసర్ నాగేశ్వర రావు తను నోరు జారాడు, క్షమించాని కోరాడు. అయిపోయింది. కాని దానికి ప్రాంతాన్ని అంటగట్టి పవన్ మీద విద్వేషం. తెలంగాణా కొంతమంది వచ్చేసి పవన్ ని తిరగనివ్వము, పవన్ తెలంగాణా కి ద్రోహి అని మొదలెట్టారు. ఎంత దారుణం? తెలంగాణా ప్రజలకి పవన్ ఎన్ని సహాయాలు చేశాడు, మొన్నటికి మొన్న కొండగట్టు దేవాలం అభివృద్ధికి పవన్ చూపించిన చొరవ అందరికీ తెలిసిందే. కాని అసలు సంబంధం లేకుండా పవన్ ఫొటో ని చెప్పుతో కొట్టించారు ఒక అనామకులతో. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఏమైనా ఉంటదా?
మత విద్వేషం
ఈ ప్రకాష్ రాజ్ , ప్రశ్న జోసఫ్ ఓరు మార్చి ఒకరు సంబధం లేకపోయినా మతాన్ని అంటగట్టి ప్రవన్ మీద విషం చిమ్ముతారు. 10 సార్లు మీడియా ముందుకు వస్తే అందులో 8 సార్లు పవన్ గురించి ,పవన్ మీద విధ్వేషం మాత్రమే ఉంటది. పవన్ వేరే ఏ కులాన్ని కించ పరచలేదు. తన మతాన్ని చిన్న చూపు చూడకండి అన్నాడు. అది కూడా తప్పు వచ్చేసింది. అవకాశం దొరికినప్పుడు దొరకనప్పుడు అవకాశం కలిపించుకొని మరీ పవన్ మీద విషం చిమ్ముతానే ఉంటారు.
వీటిని అసలు రాజకీయం అంటారా? ఒక్కడిని ధైర్యం గా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా నీచానికి దిగజారాలా? రాజకీయాలలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉండాలా? అదేదో వారి జన్మ హక్కులా ఫీల్ అయిపోయి సామ్యులు ఎవరు వచ్చినా వారిని నాశనం చేసే దాకా నిద్రపోరు.
సొంత డబ్బులతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేసిన చిరంజీవిగారు రాజకీయ సన్యాసం తీసుకునే దాకా విషం చిమ్ముతానే ఉన్నారు. రక్తం అమ్ముకున్నాడు, టికెట్స్ అమ్ముకున్నాడు అని. అలా ఆరోపించ వాళ్ళు ఇప్పుడు వచ్చి అవును ఎవరో అనమంటే అన్నాం అని ఒప్పుకున్నారు. కాని ఒక మంచి మనిషి, ప్రజాసేవ చేద్దాం అని ముందుకు వచ్చిన వ్యక్తి రాజకీయాలకి దూరం అయ్యాడు. దీవి వలన నష్ట పోయింది ప్రజలే. కులం , మతం, ప్రాంతం ముసుగులో ప్రతీ రోజు నష్టపోతుంది ప్రజలే.
Dear Deputy CMO, Andhra Pradesh Pawan Kalyan Garu
దీనెమ్మ ఏదైతే అది అయ్యింది. నీవు మాత్రం తగ్గొద్దు. ఇలా ఎంతమంది వస్తారో చూద్దాం. నీవు మాత్రం వెనక అడుగు వెయ్యొద్దు. గెలుపు ఓటమి కంటే ఇలాంటి నీచ రాజకీయలని తట్టుకొని నిలబడితే చాలు గెలుపు దానంతట అదే వస్తది. కొంచెం లేట్ అవుతుందేమో కాని తప్పకుండా ప్రజలు ఒకరోజు కాకపోయినా మరొక రోజు రియలైజ్ అవుతారు. ప్రతీ సంవత్సరం ఈ కుల మత పిచ్చి ఉన్న ముసుగు ముసలి ఓటర్ల సంఖ్య తగ్గుతుంది కొత్త రక్తం వస్తుంది. వారికి ఓట్ హక్కు వస్తుంది. వారందరూ నీ రాజకీయాలు అర్థం చేసుకుంటారు. నాలోంటోళ్ళు ఎంతో మంది నీవెంట ఉన్నారు. ముందు ముందు వస్తారు కూడా. వారే నిన్ను రక్షించుకుంటారు. నిన్ను చూసి inspire అవుతారు, నీతో అడుగు వేస్తారు. విజయీ భవ ....