09/07/2026
ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకూడదు...
కొచ్చర్ల తండాకు చెందిన ప్రతిభావంతుడైన మేరాజోత్ అబ్లు నాయక్ పదో తరగతిలో 553 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించాడు. కానీ తల్లిని కోల్పోయిన బాధ, కుటుంబ పేదరికం కారణంగా అతని పైచదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఆ క్లిష్ట సమయంలో డా. జటావతు రాంబాబు నాయక్ గారు ముందుకు వచ్చి, రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతని ఉన్నత విద్య కోసం ₹25,000 ఆర్థిక సహాయాన్ని అందించి, అతని కలలకు కొత్త ఆశను ఇచ్చారు.
ప్రతి ప్రతిభకు అవకాశం దక్కాలి...
ప్రతి విద్యార్థి తన కలలను సాకారం చేసుకోవాలి...
విద్యకు అండగా...
భవిష్యత్తుకు భరోసాగా...
— Rambabu Naik Foundation