19/04/2026
✨ 📍 ఈరోజు కార్యక్రమం – హఫీజ్ పేట్
ఈరోజు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వైశాలినగర్, మంజీరా రోడ్డులో
జైన మహావీర్ అహింస స్థంభం శంఖుస్థాపన & భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
శేరిలింగంపల్లి MLA / PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు,
వారితో కలిసి హఫీజ్ పేట్ యువనాయకులు ధాత్రీనాథ్ గౌడ్ గారు పాల్గొన్నారు.
🕊️ ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ:
భగవాన్ మహావీర్ బోధించిన అహింస, సత్యం, శాంతి, సహనం వంటి విలువలను సమాజానికి చాటిచెప్పే ఉద్దేశ్యంతో ఈ అహింస స్థంభం నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
🌿 ఈ స్థంభం భావితరాలకు మహావీర్ సందేశాలను గుర్తు చేస్తూ,
మానవత్వం & సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.
🙏 ఈ కాలంలో అహింసా మార్గమే శాంతికి ఉత్తమ మార్గమని తెలిపారు.
✨ భక్తి, సేవా భావాలతో నిర్వహించిన ఈ శంఖుస్థాపన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
👥 ఈ కార్యక్రమంలో జైన సమాజ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.