07/08/2026
#బీజేపీ పాలనలో ప్రజల అవస్థలు
#మోడీని గద్దె దింపే వరకు సిపిఐ పోరు
#సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
#ముల్కనూర్ లో సిపిఐ పాదయాత్రలో చాడ
#బీమదేవరపల్లి/ముల్కనూర్ : దేశంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ప్రచార జాత పాదయాత్ర నిర్వహిస్తుందని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలే దాని పతనానికి దారి తీస్తుందని, దేశంలో మార్పు కోసం సిపిఐ పోరాటం సాగిస్తోందని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సిపిఐ ప్రచార జాత పాదయాత్ర 2వ రోజు ముల్కనూర్ లో ప్రచార జాత పాదయాత్ర సహకార బ్యాంకు నుండి కొత్తపల్లి వరకు ఉత్సాహపూరితంగా సాగింది. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అంబేద్కర్ విగ్రహంకు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. బీజేపీ 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగకరమైన ఒక మంచి పని అయిందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని క్రమబద్ధంగా దెబ్బతీస్తుందని అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, సాధారణ పౌరులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడంలో విఫలమయ్యారని, రైతు సంక్షేమాన్ని దెబ్బతీశారని అన్నారు. సహజ వనరులను కార్పొరేట్ మిత్రులు అదానీ, అంబానీ లకు కట్టబెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. వీటికి వ్యతిరేకంగా కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, విద్య, ఆరోగ్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, మహిళా రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, దళితులపై, మహిళలపై అకృత్యాలను, దాడులను నిలిపివేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంకై ఆగస్టు 6 నుండి దేశవ్యాప్తంగా సిపిఐ పాదయాత్రలు వివిధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల గుండా సాగుతూ అట్టడుగు వర్గాల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో దేశంలో మార్పు కోసం మహా ర్యాలీతో ముగుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగే సిపిఐ పోరు ప్రచార జాత పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, ఎన్ ఎ స్టాలిన్, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, కొట్టెపాక రవి, మాలోతు శంకర్, శనిగరపు రాజ్ కుమార్, రాసమల్ల దీనా, గుంటి రాజేందర్, బీమదేవరపల్లి మండల కార్యదర్శి అదరి రమేష్, మండల నాయకులు కొంగల రామచంద్ర రెడ్డి, కంవంపల్లి కిషన్, రాగుల చంద్రయ్య, చిలక శ్రీను, నిమ్మల మనోహర్, మాలోతు మంగ, మమత, కుడి స్వామి తదితరులు పాల్గొన్నారు.