CPI Hanumakonda

CPI Hanumakonda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPI Hanumakonda, Public Service, 1-8/379, Hanamkonda.

 #కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి #సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్హనుమకొండ కాళ...
15/05/2026

#కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి

#సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్

హనుమకొండ కాళోజీ సెంటర్ లో సిపిఐ రాస్తారోకో

#హనుమకొండ : పోక్సో కేసులో తన కొడుకును రక్షించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ కాళోజీ సెంటర్ లో సిపిఐ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని, ఇటీవల 17 ఏళ్ల మైనర్ బాలికపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ మద్యం తాగించి, కొన్నిసార్లు డ్రగ్స్ ఇచ్చి మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు పెట్టడం జరిగిందని అన్నారు. బండి సంజయ్ తన కుమారున్ని రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి భగీరథ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తండ్రి హోం సహాయ మంత్రిగా ఉండడం వలన పోలీసు యంత్రాంగాన్ని ప్రధాన మీడియాను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని డిమాండ్ చేసినారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, బి.విజయసారధి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, ఎన్ ఎ స్టాలిన్, ఎదునూరి వెంకట్రాజం, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, మాలోత్ శంకర్ నాయక్,కండె నర్సయ్య, గుంటీ రాజేందర్, అలువాల రాజు తదితర వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

 #పెట్రో ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న బిజెపి ప్రభుత్వం #పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం నియంత్రించాలి #...
15/05/2026

#పెట్రో ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న బిజెపి ప్రభుత్వం

#పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం నియంత్రించాలి

#సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

హనుమకొండలో సీపీఐ వినూత్న నిరసన

#హనుమకొండ : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని కాళోజి సెంటర్ లో ఆటోలను తాళ్లతో లాగుతూ వినూత్న
నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పెరిగిందని అన్నారు. పెట్రో ధరల పెంపుతో రవాణా, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పది రోజుల క్రితం వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ ధరలను భారీగా పెంచి కనికరం లేకుండా సామాన్య ప్రజలపై బిజెపి ప్రభుత్వం భారం మోపిందని అన్నారు. కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని అన్నారు. గడిచిన 12 ఏళ్లుగా ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో పాలకులు ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలని పిలుపునిచ్చారు. పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలను వెంటనే తగ్గించని ఎడల ప్రజా గ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, బి.విజయసారధి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఎన్ ఎ స్టాలిన్, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, ఎదునూరి వెంకట్రాజం, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, మాలోత్ శంకర్ నాయక్, కండె నర్సయ్య, గుంటీ రాజేందర్, అలువాల రాజు తదితర వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

02/05/2026

#హనుమకొండ లోని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నగర్ ను సందర్శిస్తున్న CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు గారు, హనుమకొండ జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కర్రే బిక్షపతి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ నేదునూరి జ్యోతి గారు, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ తోట బిక్షపతి గారు...

జిల్లా కేంద్రంలో జరిగిన మేడే ఉత్సవాల కార్యక్రమం ఈరోజు దిన పత్రికలో...
02/05/2026

జిల్లా కేంద్రంలో జరిగిన మేడే ఉత్సవాల కార్యక్రమం ఈరోజు దిన పత్రికలో...

 #మేడే స్పూర్తితో శ్రమ దోపిడీపై ఉద్యమించాలి #కార్మిక వర్గం బీజేపీకి గుణపాఠం చెప్పాలి #సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్క...
01/05/2026

#మేడే స్పూర్తితో శ్రమ దోపిడీపై ఉద్యమించాలి

#కార్మిక వర్గం బీజేపీకి గుణపాఠం చెప్పాలి

#సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

#హనుమకొండ సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా మేడే

#హనుమకొండ : మేడే స్పూర్తితో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. 140వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా శుక్రవారం హనుమకొండ బాల సముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం ఎదుట అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి, ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని అన్నారు. దేశ సంపదను తన కార్పొరేట్ మిత్రులకు మోడీ కట్టబెడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను రోడ్డున పడవేస్తున్నారని అన్నారు. కార్మికులు ఉద్యమించకుండా కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను కాలరాశారని అన్నారు.పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్ లుగా మార్చివేసి కార్మికులకు తీరని అన్యాయం చేశారని అన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాపాడుకునేందుకు, కార్పొరేట్ శక్తుల శ్రమ దోపిడీని అరికట్టేందుకు కార్మిక వర్గం మేడే స్పూర్తితో ఉద్యమించాలని కోరారు.కార్మిక వర్గం ఏకతాటిపైకి రావాల్సిన తరుణం ఆసన్నమైందని, అన్ని వర్గాల కార్మికులు ఐక్యమై పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, జిల్లా నాయకులు ఎన్ ఎ స్టాలిన్, కర్రె లక్ష్మణ్,ఏదునూరి వెంకట్రాజం,కొట్టెపాక రవి, మునిగాల బిక్షపతి, కండే నర్సయ్య, యాళ్ల సంజయ్, గుంటి రాజేందర్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

 #ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి #డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల...
24/04/2026

#ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి

#డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

#ఆత్మహత్యలు వద్దు.. పోరాడి సాధించుకుందాం

#సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

#కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో

#హనుమకొండ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, సమ్మె పై మొండి వైఖరి వీడాలని, ఈ విషయంలో సమ్మెపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు హనుమకొండలోని కాళోజి సెంటర్ లో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఆగిపోయిన రెండు వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. కార్మికుల ఐక్య పోరాటంతోనే హక్కుల సాధన సాధ్యం అని, సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రైవేటు డ్రైవర్ల ప్రయోగం ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని, సమ్మెను అణచివేసేందుకు ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమ చేశారు గత ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రెషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసి కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఎన్ ఎ స్టాలిన్, వుట్కూరి రాములు, కర్రే లక్ష్మణ్, ఎదునూరి వెంకట్రాజం, కొట్టేపాక రవి, వేల్పుల సారంగపాణి, గుంటీ రాజేందర్, అలువాల రాజు, పొనుగోటి రామ్ గోపాల్ చారి, పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, మామునూరి దామోదర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

24/04/2026

#హనుమకొండలో RTC సమస్యలపై CPI అధ్యర్యంలో నిర్వహించిన రాస్తారోకోనుద్దేశించి మాట్లాడుతున్న CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావు గారు...

 #ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ #పేద ప్రజల కోసం పనిచేస్తున్న సిపిఐ కి విరివిగా విరాళాలు ఇవ్వండి. #హనుమకొండ లో...
06/04/2026

#ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ

#పేద ప్రజల కోసం పనిచేస్తున్న సిపిఐ కి విరివిగా విరాళాలు ఇవ్వండి.

#హనుమకొండ లో ప్రారంభించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు.

హనుమకొండ : ప్రజా సమస్యల పరిష్కారానికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టినట్లు, పేద ప్రజల కోసం పనిచేస్తున్న సిపిఐ కి విరివిగా విరాళాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం హనుమకొండ నగరంలోని బాలసముద్రంలో ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ ప్రచారాన్ని ప్రధానంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి చేపడుతున్నామన్నారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సాధకబాధకాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా పేదల ఇండ్లు, ఇండ్ల స్థలాలు, గుడిసె వాసులకు పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్ లు, సాగునీరు వంటి స్థానిక సమస్యలపై దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులను సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో ఆలస్యం జరుగుచున్నదని అన్నారు. దీంతో ప్రజలు హామీల అమలుపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి , పార్టీ నాయకులు ఎన్ ఎ స్టాలిన్, మునిగాల బిక్షపతి, ఎదునూరి వెంకట్రాజం, కొట్టేపాక రవి, యేశబోయిన శ్రీనివాస్, వేల్పుల సారంగపాణి, మాలోత్ శంకర్ నాయక్, కండె నర్సయ్య, బరిగేల కుడిస్వామి, రాజరాపు రత్నం, సలకుల స్వరూప, రాజరాపు శ్రీను, బోడిగే కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

 #హనుమకొండ: బాలసముద్రంలోని   జిల్లా కార్యాలయంలో జరుగుతున్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న CPI జాతీయ కంట్రోల్ కమిషన్ చై...
03/04/2026

#హనుమకొండ: బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో జరుగుతున్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న CPI జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కామ్రేడ్ డాక్టర్ కె. నారాయణ గారు...
#నారాయణ గారితో పాటు CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు గారు హాజరయ్యారు.

#ఈ సమావేశంలో CPI హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ ఎ స్టాలిన్, మునిగాల బిక్షపతి, ఎదునూరి వెంకట్రాజం, నేదునూరి రాజమౌళి, ఎశబోయిన శ్రీనివాస్, కొట్టేపాక రవి, బత్తిని సదానందం తదితరులు పాల్గొన్నారు.

 #అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను పేదలకు పంచుతాం #ఏప్రిల్ ఒకటి నుండి ఇంటింటికి సిపిఐ కార్యక్రమం #సిపిఐ రాష్ట్ర సహాయ కార్య...
29/03/2026

#అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను పేదలకు పంచుతాం

#ఏప్రిల్ ఒకటి నుండి ఇంటింటికి సిపిఐ కార్యక్రమం

#సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

#హనుమకొండ : జిల్లాలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను పేదలకు పంచుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం హనుమకొండ బాల సముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బాషబోయిన సంతోష్ అధ్యక్షతన పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూములను కొందరు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో పేదల అసైన్డ్ భూములను భూకబ్జాదారులు ఆక్రమించుకున్నారని, వాటిని అధికారులు రద్దు చేసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించి పేదలు గుడిసెలు వేసుకున్నారని అన్నారు. పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నివాస స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాంటి పేదల కాలనీలలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. సీపీఐ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుని ప్రజల మద్దతు పొందిందని, ఈ క్రమంలో ఏప్రిల్ 1 వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ సీపీఐ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ సానుభూతి పరులు, ప్రజలు మద్దతు ఇచ్చి పార్టీ శ్రేణులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ ఎ స్టాలిన్, కర్రె లక్ష్మణ్, ఏదునూరి వెంకట్రాజం, మునిగాల బిక్షపతి, బత్తిని సదానందం, కొట్టెపాక రవి, యేషబోయిన శ్రీనివాస్, నకీర్త ఓదెలు, జక్కు రాజు గౌడ్, మంచాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Address

1-8/379
Hanamkonda

Website

Alerts

Be the first to know and let us send you an email when CPI Hanumakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category