12/07/2026
🏛️ మందస చారిత్రక వారసత్వాన్ని మట్టిపాలు చేయకండి! 🏛️
చరిత్రపై మందస ప్రజలకున్న గౌరవానికి 100 ఏళ్ల నాటి స్కూల్ భవనమే నిదర్శనం. ఆ పాత కట్టడాన్ని కూల్చకుండా, ఊరి జనం అంతా చందాలు వేసుకుని ఇటీవల దాన్ని పునరుద్ధరించి కాపాడుకున్నారు.
ఆటువంటిది అక్కడ ప్రాచీన కళింగ సామ్రాజ్య జైన గ్రంథాలు, శిల్పకళా చరిత్రలను పరిశీలిస్తే ఒక అద్భుతమైన నిజం తెలుస్తుంది. శతాబ్దాల క్రితం జైన తీర్థంకరులు, సన్యాసులు ప్రశాంతంగా ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని బోధించిన పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం మన మందస భూమి!
ఎన్నో తరం రాజులు, యుద్ధాలు, ప్రకృతి విపత్తులను తట్టుకుని వేల ఏళ్లుగా సజీవంగా నిలిచిన 23వ తీర్థంకరుడు శ్రీ పార్శ్వనాథుడి విగ్రహం, దాని పరిసరాల్లోని 'గోపాలసగరం మండపం' కేవలం రాళ్లు కావు!అవి నాటి శిల్పి రక్తాన్ని చెమటగా మార్చి చెక్కిన అపురూప కట్టడాలు.. మన పూర్వీకుల శ్వాస, మన మట్టి ఆత్మగౌరవం!
ఒకప్పుడు రాజులు ప్రజల తాగునీటి కోసం, ఆధ్యాత్మికత కోసం నిర్మించిన ఆ గోపాలసగరం మండప ఆధార కట్టడాన్ని, ఈ రోజు కూల్చివేస్తుంటే మన సంస్కృతి ముక్కలైపోతోంది. ఇది మన పూర్వీకుల ఆత్మపై జరుగుతున్న దాడి!
🌍 ప్రపంచం ఎక్కడ? మనం ఎక్కడ?* యునెస్కో (UNESCO) హంపి లాంటి చారిత్రక నగరాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి కంటికి రెప్పలా కాపాడుతుంటే.. మన దగ్గర అంతకంటే పురాతనమైన కట్టడాలను ఆధునికత పేరుతో నేలమట్టం చేయడం చారిత్రక తప్పిదం!
⚖️ చట్టం ఏం చెబుతోంది?
కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల (ASI) ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటి పురాతన నిర్మాణాలను తాకడం చట్టప్రకారం (AMASR Act) నాన్-బెయిలబుల్ నేరం.
📢 మన కర్తవ్యం:
1️⃣ సమగ్ర వారసత్వ ప్రభావ అంచనా (Heritage Impact Assessment - HIA): మందసలోని ఆనందగిరి, గోవర్ధనగిరి, గోపాలసగరం Contour (పరిసరాల్లో) ఏ చిన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ అభివృద్ధి పని చేపట్టాలన్నా.. ముందుగా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం 'హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్' జరపాలి.నిపుణుల కమిటీ తేల్చేవరకు పనులను తక్షణమే నిలిపివేయాలి.
2️⃣ చట్టబద్ధమైన 'బఫర్ జోన్' & జియో-ట్యాగింగ్ (Protected Buffer Zone & Geo-tagging): శ్రీ పార్శ్వనాథుడి విగ్రహం మరియు గోపాలసగరం పరిసర ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ మరియు జియో-ట్యాగింగ్ ద్వారా స్థిరీకరించాలి.
3️⃣ మల్టీ-డిసిప్లినరీ నిపుణుల కమిటీతో 'ఇన్-సిటు' పరిరక్షణ (In-situ Conservation by Expert Panel): కేవలం సాధారణ సివిల్ అధికారుల పర్యవేక్షణలో కాకుండా.. పురావస్తు శాస్త్రజ్ఞులు (Archaeologists), శాసన పరిశోధకులు (Epigraphists), మరియు పురాతన కట్టడాల ఆర్కిటెక్టులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని రంగంలోకి దించాలి.
మన వారసత్వాన్ని కాపాడుకుందాం – మన సంస్కృతిని గౌరవించుకుందాం!
చరిత్ర లేని సమాజానికి భవిష్యత్తు ఉండదు.