21/11/2025
మరో అనాథకు గౌరవప్రదమైన చివరి సంస్కారాలు నిర్వహిస్తూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నది MDR ఫౌండేషన్.ఈ అంత్యక్రియల కోసం అవసరమైన సంపూర్ణ ఆర్థిక సహకారం MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు అందించారు.సమాజ సేవ అంటే పుస్తకాల మాట కాదని, అది మానవత్వం ముందుండి నడిపే పథమని నిరూపిస్తూ MDR ఫౌండేషన్ ఇంతవరకు 582 మంది అనాధలకు అంత్యక్రియలు నిర్వహించింది. అలాగే పేద, అసహాయ, అభాగ్య కుటుంబాలకు ఆర్థిక సహాయం, రేషన్ కిట్లు, వైద్య సహాయం అందిస్తూ నిరంతరం సాయం చేస్తోంది.ఈ సేవా కార్యక్రమాల లో భాగంగా, ఈరోజు కూడా MDR ఫౌండేషన్ తరపున మరో అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.పటాన్చెరు నూతన మార్కెట్ సమీపంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలు కింద పడిన విషయం స్థానికులకు తెలిసి, ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.ఆమె మృతదేహాన్ని స్వీకరించడానికి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆ వృద్ధురాలి చివరి ప్రయాణానికి తోడుగా నిలవడం MDR ఫౌండేషన్ తమ బాధ్యతగా భావించింది.మనుషులు మరణిస్తారు… కానీ మనిషితనం మాత్రం నిలిచేలా చేయడం MDR ఫౌండేషన్ ధర్మంగా తీసుకుంది.ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడుగా నిలుస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
MDR Foundation | NGO | Patancheru